పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనిపై బౌద్ధభిక్షువు ప్రభామతి యను టీకను, శంకరాచార్యులు జయమంగళను, మాధవమిశ్రయజ్వ నయచంద్రికను, భట్టస్వామి ప్రతిపదపంచికను వ్యాఖ్యానములుగా రచించిరి. వానిలోఁ గొంత కొంత భాగములు లభించుచున్నవి. భిక్షుమాధవులవ్యాఖ్యానములు మంచివి. భట్టస్వామిది హీనరచనము. అయినను ద్రవిడులును గేరళులును దమ తమ భాషలలోనికి దీని ననువదించికొనిరి.

కౌటిలీయార్థశాస్త్రముకన్నను చాక్షుషీయ మను నర్థశాస్త్రము ప్రాచీనగ్రంథము. అర్థశాస్త్రగ్రంథములలో నెల్ల మిక్కిలి చిన్నగ్రంథ మీచాక్షుషీయమే. ఇందు విషయము సూత్రరూపమునను, వాక్యరూపమునను సంగ్రహశ్లోకరూపమునను రచింపఁబడియున్నది. కొన్ని క్లిష్టస్థలములందుఁ బ్రాచీనసంప్రదాయార్థములకుఁ బూర్వపక్షానువాదదూషణరూపవిమర్శనలతోఁ గూడినసమీక్ష యను నాల్గవరూపము గూడ నున్నట్లు తెలియ నగుచున్నది. కౌటిలీయమున నీ సమీక్షారూపవిమర్శన ముండుటచే సుబోధమై చాక్షుషీయగ్రంథము నణగఁ ద్రొక్కి ప్రజాదరణమునకుఁ బాత్రమైనది. ఇట్టి సూత్రరూపరచనలు మనప్రాచీనులప్రతిభావిశేషములఁ జాటుచున్నవి. ఈ చాక్షుషీయము రాజ్యాంగములకు సంబంధించిన విషయముల నఱువదియేడింటిని గుఱించి తెలుపుచున్నది. ఇందు ప్రధమపటలము ఉద్దేశరూపమున నీ యఱువదియేడువిషయములఁ బేర్కొనుచున్నది. ద్వితీయపటలమున నఱువదివిషయములు మాత్రము లభ్యము లగుచున్నట్లు తెలియుచున్నది. మిగిలినది లుప్తమైనది. అందు ప్రథమపటల మిట్లున్నది.

శక్యమేకశరీరేణ నీతిమార్గానుసారిణా।
వ్యవసాయద్వితీయేన సర్వాం జేతుం వసుంధరామ్॥


అథాతః పురుషార్థసాధన మర్థశాస్త్రం ప్రవక్ష్యామః—


తద్యథా—