పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము.

ఆర్యసారస్వతమున నుపవేదములలో రెండవది యర్ధవేదము అర్దసంపాదనరక్షణక్రమముల నుపదేశించునది గాన నిది యర్థవేద మనఁబరఁగు. ఇందు రాజధర్మములును అర్థార్జనరక్షణక్రమములును గలపి బ్రహ్మ లక్షయధ్వాయములుగాను, రుద్రుఁడు 50000, స్కందుఁడు 25000, ఇంద్రుఁడు 12000, వాల్మీకి 6000, బృహస్పతి 3000, శుక్రుఁడు 1000 ఆధ్యాయములుగాను గ్రంథములు రచించిరఁట. భయంకరములగు నీ పెద్దగ్రంథములు తిన్నఁగా భుజింప నవకాశము చాలని ఘనకాలమువఱకు రాక నశించిపోయినవి. వీనిని సంగ్రహించి భారద్వాజుఁడు 700 అధ్యాయములుగాను, గౌరశిరుఁ డనుముని 500 అధ్యాయములుగాను, వ్యాసులు 300 అధ్యాయములుగాను నర్థశాస్త్రములు రచించిరఁట. అవియుఁ బైవానిగతియే చెందినవి. అర్థవేదము సంగ్రహరూపముగాఁ బదునాలుగువేలశ్లోకములతో రచింపఁబడినదఁట. అందీ విషయములు నిరూపింపఁబడినవి.

 "చతుర్దశ సహస్రాణి హ్యర్థవేదః ప్రమాణతః
యత్రై వాష్టాదశాధ్యాయాః సంతి ప్రత్యక్షసిద్ధిదాః
కల్పాధ్యాయో రసాధ్యాయః ప్రయోగాధ్యాయ ఏవ చ
ధాతుధ్మానక్రియాధ్యాయో రత్నాధ్యాయ స్తథైవ చ
త్రపుసీసజయాధ్యాయో లోహాధ్యాయ స్తతఃపరమ్
మూషామృల్లోణతగరాధ్యాయో వాదజయస్తతః
హేమసంపాదనాధ్యాయః సిద్ధాధ్యాయో౽ఖిలార్థదః
మూలికాశోధనాధ్యాయః పుటాధ్యాయో మహత్తరః