పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మఱి యభీష్టంబుల నొనర్చి వారిం దనవెంటఁ దోడ్కొని చన
వలయు నయ్యిరుదెఱంగులవారి కోపంబు లెట్టివనిన.

21


సీ.

సుతమంత్రిహితపురోహితనిజవంశజ
            సేనాధిపతులు ప్రధానజనము
లండ్రు ధారుణి వీరలందు నొక్కనికోప
            మైన నాంతరకోప మనఁగఁ బరగు
గడిఁగాచువారలు నడవులకడ నుండు
            ప్రజలును మఱి యెంచ బాహ్యజనము
లరయంగ వీరలయందులో నొక్కని
            కోపమైనను బాహ్యకోప మగును


గీ.

తనకు నాప్తులు చతురులై తగినయట్టి
మంత్రిజనములచేతను మనుజవిభుఁడు
తెలియఁదగు నిట్టికోపముల్ తేటపడఁగ
మించి వారల శాంతిఁ బొందించుకొఱకు.

22


గీ.

ఎట్టిరీతినిఁ దప్తులై యెడసి పగఱఁ
గూడుకొనిపోవ రటులఁ దత్కోప మడఁప
నమరు సామాదులగు నుపాయములనైనఁ
గట్టుకొని వారి విరిపోటు పెట్టియైన.

23


క.

హయములును భటలు చచ్చుట
క్షయమగు దవసంబు బసిఁడి కడు వ్యయమైనన్
వ్యయమగు నిటులన్ క్షయమును
వ్యయమగు పయనంబు మానవలయుం బతికిన్.

24