పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

ధరణి రాజ్యాంగముల యందుఁ దగులు నిట్టి
వ్యసనములు మాన్చఁగాఁ దగు నద నెఱింగి
యిటుల మాన్పక మదమున నెనయు భూమి
పాలుఁ డరిరాజుచేఁ బరాభవము సెందు.

73


వ.

ఇట్లు రాజు మొదలుగాఁ బలుకంబడిన యంగంబులకుఁ
బ్రాప్తంబులైన వ్యసనంబులలోన మొదట మొదటఁ జెప్పం
బడిన యంగంబుల వ్యసనంబులే గురుతరంబు లగుచు నుండుఁ
గావున.

74

సప్తవ్యసనవర్గప్రకరణము

క.

నరపతి దా వ్యసనంబులఁ
బొరయనిచో రాజ్యమెల్లఁ బోవగ నోపున్
నరపతి వ్యసనము చెందిన
నరయుచు రక్షింప రాజ్య మసమర్ద మగున్.

75


క.

తనసచివుని ప్రజ దుర్గం
బును భండారంబు సైన్యమును జుట్టము నెం
దును వ్యసన మందకుండగ
మనిచిన జనపతి త్రివర్గమహిమన్ జెందున్.

76


ఆ.

శాస్త్రదృష్టిలేని జననాయకుని నంధుఁ
డనుచు నంద్రు ప్రాజ్ఞులైనవారు
అంతకంటె నంధుఁ డగు చదివియును గ
ర్వమున మంచినడక వదలునతఁడు.

77


క.

జనపతి యంధుం డగుచో
ననువగు మార్గంబు మంత్రు లందింతు రిలన్
మును జదివి మత్తుఁ డైనన్
దనతోఁ గూడంగఁ బ్రకృతితతి చెడఁజేయున్.

78