పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ష్ఠాపనాచార్య సర్వతంత్రోభయ వేదాంతాచార్యులయిన శ్రీ శఠ
గోపజియ్యంగారి కార్యకర్తలయిన రాచప్పగారున్ను శ్రీ అహో
బలస్థానంవారున్ను కాశ్యపగోత్ర ఆపస్తంబసూత్ర యజు
శాఖాధ్యాయులయిన సూర్యవంశోద్భవులయిన మూరురాయర
బసవశంకర గుత్తిహన్నిబ్బరగండ యెరయూరి పుర
వరాధీశ్వరులయిన శ్రీమన్మహామండలేశ్వర కొండ్రాజు
తిమ్మరాజుగారి పౌత్రులయిన తిమ్మరాజుగారి పుత్రులయిన
వేంకటరాజు దేవమహారాజులుంగారికి యిచ్చిన శిలాశాసన
క్రమ మెట్లన్నను, ప్రాక్‌బహుధాన్యనామ సంవత్సరాన నిభరామ
వారు హండేవారిని కూడుకొని సీమ యంతా రాచూరా పట్టి
అహోబలస్థలానకు వచ్చి అహోబలం అంతా పాడుసేసి అహో
బలస్థలం అయిదు ఆరుఏండ్లు తమ వశం చేసుక ఆక్రమించి
నడస్తూవున్న నిమిత్యం శ్రీ అహోబలేశ్వరులు సన్యాసం
ప్రసాదించిన ఆదిమమైన శఠగోప జియ్యంగారికి ఏడోతరమై
శ్రీ పురుషోత్తమ ఆళ్వారుల ప్రతిష్ఠ సేసి ముకుందదేవునిచేత
పూజగొని రామానుజదర్శనోద్ధారకులైన శ్రీ పరాంకుశమహాముని
శిష్యులయినటువంటి శ్రీ మచ్ఛరకోపస్వామివారిస్థలం యీతీరున
అయిననిమిత్తం శ్రీరంగరాయ దేవమహారాయుల సముఖాన తాము
మనవి చేసి మీరు యీతీరున రత్నసింహాసనారూఢులై వుండిన్ని
మీకులస్వామియైన అహోబలేశ్వరునిస్థలం తురకలు......"


ఈశాసనములోని వేంకటరాజుదేవమహారాజులుంగారు మనకామందక కృతిపతియగు వేంకటరాజే!