పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని యుండుటచే నీ వెంకట్రాజు అహోబలస్వామి భక్తుఁడై యానృసింహదేవాలయము నుద్ధరింపఁ బ్రయత్నించినట్లు తెలియవచ్చుచున్నది. ఈ విషయమే రెట్టమతగ్రంథమునందును

సీ.

శ్రీమదహోబలస్వామిమహారాజ్య
          రక్షకుం డగుచు నేరాజు వెలయు
నభిరామకామందకాఖ్యసత్కావ్యర
          త్నమునకు నేరాజు నాథుఁ డయ్యె
నెరయూరిపురవరాధీశాది బహుబిరు
          దాంకుఁడై యేరాజు యశము గాంచె
జానకీనాయకచరణసంసేవన
         ప్రౌఢిచే నేరాజు ప్రబలు సిరుల


గీ.

నతఁడు కొండ్రాజు తిమ్మభూపతివరేణ్య
తనయ పెదతిమ్మరాజవతంస గర్బ
వార్ధిచంద్రుండు సత్కులవర్ధనుండు
సతతవిభవుండు వెంకటక్ష్మావిభుండు.

అని కలదు.

ఈ వెంకట్రాజు అహోబలము నుద్ధరించె ననుటకు అహోబలమహాద్వారమున శాసనప్రమాణ మున్నది.

"శుభమస్తు. శ్లో. దేవశ్రేణీశిరోరత్నం దైత్యద్విపఘటాంకుశమ్।
               జయతు శ్రీనృసింహస్య దేవదేవస్య శాసనమ్॥
స్వస్తిశ్రీ జయాభ్యుదయశాలివాహనశకవర్షంబులు 1506
అగు నేటి తారణ సం॥ వైశాఖశుద్ధ 14 శ్రీమద్రాజాధిరాజ రాజ
పరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీవీర శ్రీరంగరాయ దేవమహారాయలు
గారు పెనుగొండనగరమందు వజ్రసింహాసనారూఢులై పృథ్వీ
సాంమ్రాజ్యము చేయుచుండఁగాను శ్రీమద్వేదమార్గప్రతి