పుట:అహల్యాసంక్రందనము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

అహల్యాసంక్రందనము

     రిచ్చట దొమ్మిగూడి కలహించినఁ దేరుగడేల పుట్టు నీ
     రచ్చ లణంచఁగా వలయురా” యని యింద్రుఁడు చేయమర్చుచున్.111
ఉ. గాధిజుఁ జేరి వేడుకొని, కండుమహామునికిం బ్రియోక్తులన్
     బోధనచేసి, శక్తిసుతు పొంతకుఁ బోయి, విభాండకున్ "వృధా
     గాథ [1]య”టంచుఁ బల్కి భయకారి మునీంద్రుని వాదణంచి స
     క్రోధుల మిత్రు నప్పతిఁ బురూరవు యక్షజుఁ దాళఁ బట్టుచున్.112
కం "ఏకాంత ఎవరి కితవో
     యాకాంతను వారు పొగడు టదియుక్తం బే
     మీకేల వాదు మీలో
     ‘లోకో భిన్నరుచి’ యనెడు శ్లోకము వినరే.”113
చ. అనుటయు నొక్కతాపసుఁ "డహా! పదివేలయినా తిలోత్తమే
     వనిత" యనంగ, వేఱొకఁడు , "వామ” యనంగ, నొకంకడు “చిత్రరే
     ఖ"న మఱికొంద ఱందుఁ "బదహాటకమాలిని భీమ పుండరీ”
     కన, వెసం బుట్టెఁరేఁ బెట్టు కలహంబులు నారదుఁ డుబ్బియార్వగన్.114
క. " రాజానుమతో ధర్మో'
     నా జను లనుకొండ్రు గాన నవ్యప్రతిభన్
     మాజగడముఁ దీర్పఁగను బి
     డౌజా, నీవె”యని మౌను లందఱు వేఁడన్.115
క. “నలువగల సృజించిన య
     న్నలువ గలఁడు నిర్ణయింప నలినాక్షుల మి
     న్నలువగ లటపోవుద"మని
     నలువగలన్ ఠీవి మెజయ నగరిపుఁ డంతన్.116
చ. ఉఱుముల బండికండ్లరొద యొప్పగు వాల్మెఱుపుం బతాకలున్
     చిఱుమెఱుపుం ధ్వజంబులును జేరుబలాకలబారు చామరల్

  1. యి"దంచు