Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విధానాన్ని ప్రకటించి దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను నెలకొల్పారు. అలా అప్పుడే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఇరవైమూడు జిల్లాలలో నవోదయ పాఠశాలలు ఏర్పాటయ్యాయి.

ఆయన గురించి మరికొన్ని విషయాలు చెప్పుకోవాలంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజాప్రతినిధిగా చేసిన అనుభవం ఆయనది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రిగా ప్రధానమంత్రిగా ఆయనకు అప్పగించిన ప్రతి బాధ్యతను అంతే నిబద్దతతో నిర్వర్తించారు. మా సిద్దిపేట నియోజకవర్షానికి 1957లో ఎమ్మెల్యే గా ఎన్నికైన పి.వి రాజేశ్వరరావు గారు పీవీ నరసింహారావు గారికి రాజకీయ గురువు. ఆయన ఇంటికి పి.వి. గారు చాలాసార్లు వచ్చేవారు.

పీవీ గారి తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్‌ బిహరీ వాజపేయి పీవీ నరసింహారావు గారిని తన రాజకీయ గురువు అని ఒక సారి బహిరంగంగా అన్నారు. అటల్‌ బిహారీ వాజపేయి ఆఫీసులో పివి గారి చిత్రపటం ఉండేది.

థింక్‌ గ్లోబల్‌ యాక్ట్‌ లోకల్‌ అనే దానికి పీవీ నిలువెత్తు నిదర్శనం. ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి మానవ వనరుల శాఖను ఇవాళ సర్వ వ్యాప్తం చేసిన తీరు మెచ్చుకోదగినది. ఆయన మరణం తర్వాత తన సొంత పార్టీవారే ఆయనకు ఇచ్చిన విలువ ఏమిటో, మనం గమనించాము ! కానీ పార్టీలు వేరైనా అజాత శత్రువులా ఉన్న ఆయన శత జయంతి ఉత్సవాలను సంవత్సరమంతా నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగారి ప్రకటనతో పీవీ గారి స్మృతికి సరియైన నివాళి అర్చించే అవకాశం వచ్చింది. రాజకీయ నాయకుడే కాదు... కవి, తత్వవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి “భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్న ముఖ్యమంత్రి అ వైపున కృషి చేయాలి. ప్రధానమంత్రిని కలసి ఒప్పించి వచ్చే సంవత్సరం అయినా పీవీ గారికి భారతరత్న తీసుకువస్తారని తెలుగు ప్రజలు అశ పడుతున్నారు. అ అశ తప్పక నెరవేరుతుందని ఆశిద్దాం.


13వ పుట తరువాయి .......

తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం - సవాళ్లు

బోధన జరపడమంటే ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదు. ప్రాథమిక విద్యాభోదన మాతృభాషలో తప్పనిసరి చేసి, ఇప్పుడు ఉన్నట్లుగానే ఉన్నత విద్యలో తెలుగును ఒక విషయంగా ఉంచినప్పుడే అమ్మ భాష మనుగడలో ఉండగలదు. రాజ్యాంగంలో పొందుపరుచు కున్నట్లు మాతృభాషను రక్షించుకుంటూ అన్యభాషలు నేర్చుకోవడం ఉత్తమం. అభివృద్ది చెందిన దేశాలైన జపాన్‌, చైనా, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ లాంటి దేశాల్లో వారి వారి మాతృభాషల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. మన దేశంలోని తమిళనాడు, కర్జాటక రాష్ట్ర ప్రభుత్వాలు వారి మాతృభాషకు తగిన గుర్తింపు, ప్రోత్సాహాన్ని ఇస్తూ పరిరక్షిస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమాన్ని ఆర్భాటాల అద్దాల్లో చూపిస్తూ మాతృభాషపట్ల నిర్లక్ష్య భావనకు గురిచేస్తున్న కార్పోరేట్‌ ప్రైవేటు పాఠశాలలకు అడ్డుకట్టవేయాలి. ఆంగ్ల మాధ్యమం మోజులో పడి తెలుగు మాధ్యమానికి తిలోదకా లిస్తున్న సంకుచిత దృష్టి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంతమంఛిదనే భావనను తల్లిదండ్రుల్లో రావాలి. ఆధునిక సాంకేతిక ఉపకరణాల్లో వాడటానికి మాతృభాషను ఆధునీకరించే కృషి తక్షణమే చేపట్టాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలన్నీ ప్రజల భాషలోనే జరపాలి. అలాగే వివిధ శాఖల వెబ్‌ సైట్స్‌ కూడా తెలుగులో అనువదించేలా రూపొందించాలి. తెలుగు మాధ్యమంలో చదివే వారికి కూడా ఉద్యోగ, ఉపాధిలో ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఈ విధంగా ప్రభుత్వ పరంగానే కాదు, ప్రజలందరూ భాషాభిమానంతో తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలి.

రచయిత పరిశోధక విద్యార్థి,
కాకతీయ యూనివర్సెటీ, వరంగల్‌
సోషియాలజీ అండ్‌ సోషల్‌ వర్క్‌ విభాగం,

గురజాడ అప్పారావు పుట్టినరోజు: సెప్టెంబరు 21: ఆధునిక తెలుగు సాహితీ దినోత్సవం

“సాంఘిక అవినీతి క్రిములతో నిండిన దుర్శరదాన్యం నుంచి మహిళల్ని కాపాడటానికి, సమాజాన్ని అప్రదిష్టపాలు చేసే పరిస్థితిని కళ్ల ఎదుట పెట్టి, నైతిక భావాల ఉన్నత ప్రమాణాన్ని ప్రాచుర్వానికి తేవడ కంటే సాహిత్యనికి ఉత్తమమైన కార్యమేది ఉంది?”

“నేను జీవితాన్ని చిత్రిస్తున్నాను. దాన్ని కళాత్శకంగా, ఆదర్థప్రాయం చేస్తూనే కళ నా ప్రభువు అయినవ్పటికీ- సంఘం ఎడల నా బాధ్యత ఒకటుంది. జీవితంతో నేను చర్దాటమాడను."

“దేశమును ప్రేమించుమన్నా... మంచియన్నది పెంచుమన్నా...
వట్టిమాటలు కట్టిపెట్టొయ్‌... గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ !! "