పుట:అనిరుద్ధచరిత్రము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

శోణపురీశుండు బాణాసురుం డనాహతశౌర్యశాలి సహస్రబాహుఁ
డతనికూఁతురు రూపయౌవనభాగ్యలక్షణకళావతి యుషాకన్య యెసఁగు
నాయింతి కలలోన ననిరుద్ధుఁబొడ గాంచి మోహించి సంతాపమునఁ గృశింపఁ
జెలికత్తెయై తగు చిత్రరేఖాంగన యాత్మీయయోగవిద్యానిరూఢి
నింగి నేతెంచి శయ్యపై నిదురవోవు, వానిఁ గొనిపోయి యాచంద్రవదనఁ గూర్చె
నతఁడుఁ దత్కిలికించితరతిసుఖాబ్ధి, మగ్నుఁడై యుండె నిరతంబు మఱచి యందు.

19


ఉ.

అంతట గర్భమయ్యె జలజాక్షికి నవ్విధ మెల్ల బాణుఁ డా
చెంత మెలంగునంగనలచే విని దైత్యులఁ బంపుపెట్టినం
బంతముతోడ వారు దనుఁ బట్టఁగ వచ్చిన సింహశాబకం
బెంతయుఁ దీవ్రత న్మదగజేంద్రముల న్విదలించుకైవడిన్.

20


వ.

హతశేషులు పోయి విన్నవించిన నతండు.

21


ఉ.

చంపిన నాగ్రహంబున నిశాచరుఁ డార్చి యెదిర్చి పేర్చినం
దెంపురు బెంపునుం గలిగి ధీకొని యుద్ధముఁ జేసి చేసి ని
ర్జింపఁగ లేక దైవగతిచే ననిరుద్ధుఁడు వానిచేత బం
ధింపఁబడెన్ దశాస్యజఫణిప్రదరావృతరాఘవాకృతిన్.

22


వ.

జంబూద్వీపంబునం గల్గువిశేషంబులం జూచుటకై విశ్వంభరాభాగంబున సంచరించి
శోణనగరప్రాంతమార్గంబున స్వర్గంబునకుం బోవుచుండి యీయోగక్షేమంబు వినుటం
జేసి తెలియఁబలుక న్వలసె నిటమీఁదటికార్యంబు చతుర్థోపాయసాధ్యంబగుట
చిత్తంబునఁ దోఁచియున్నదేకదా యథోచితప్రయత్నంబు సేయునది మీకు
నభ్యుదయపరంపరాభివృద్ధి యయ్యెడుఁ బోయివచ్చెదనని గోవిందునిచేత నామంత్రి
తుండై నారదుండు యథేచ్ఛావిహారంబున నరిగె. అప్పుడు ప్రద్యుమ్నతనూభవక్షేమ
వార్తాకర్ణనంబునం బొడము మోదంబును దదీయపరాజయవృత్తాంతశ్రవణసంజనితం
బగు భేదంబును దత్పరిపంథిసంహరణోద్రేకం బగురోషంబును ముప్పిరిగొని హృద
యంబులం గలయ నల్లి ముఖంబుల నాక్రమింప యాదవసమూహంబులు ముకుంద
వదనారవిందం బవలోకించుచుండినవార లగుచుండి రప్పుడు పుండరీకాక్షుండు మంత్రి
పుంగవుల నవలోకించి దండయాత్రకుఁ జతురంగబలంబు నాయితంబు గమ్మని నియో
గింపుఁడనిన వారు నుద్దండదండనాయకులఁ బడవాళ్లనుం బిలిపించి తత్ప్రకారంబుఁ
దెలిపిన వారునుం దదీయప్రయత్నపరాయణులై యుండిరి.

23


క.

భేరీధణంధణంధణ, భూరిధ్వానమున భూనభోభాగంబుల్
భోరుమని మ్రోసె నాశా, వారణములు బెదరె నదరె వసుధాధరముల్.

24


ఉ.

పాపయుతత్రిషష్ఠము శుభస్థితకేంద్రము కార్యపూర్ణదృ
గ్వ్యాపకముం గదా యని శరాసనలగ్నము చంద్రహోరను