పానశాల/దువ్వూరి రామిరెడ్డి

వికీసోర్స్ నుండి

కవికోకిల
దువ్వూరి రామిరెడ్డి

జననం: నవంబరు 9, 1895 గూడూరులో.

చిన్నప్పటినుండి విజ్ఞాన శాస్త్రంమీదే వీరి మనసంతా. అందుకే వీరి స్కూలు జీవితం చాలా కొద్ది. చిత్రలేఖనము, శిల్పము వీరి జీవితానికి క్రీడారంగాలైనవి. 20 సం|| వయసులో వీరు కవితారంగంలోకి ప్రవేశించారు. స్వయంకృషితోనే ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్, సంస్కృతము, బెంగాలీ, పెర్షియన్, ఉర్దు, తమిళంలో పాండిత్యం గ్రహించారు. వీరి కవిత్వం పాత క్రొత్తలకు ప్రాక్పశ్చిమాల మేలికలయికగా అందాలు అవరచుకుంది. శ్రమజీవియైన కర్షక జీవితము కవితా వస్తువేనని వీరు నిరూపించినారు.

ఖయాము రుబాయతులకు తెలుగులో యెంత మధురంగా గానం చేశారో, కర్షక జీవితాన్ని అంత కమ్మగా పాడారు.

1920లోనే విశ్వశాంతి కోసం వేదనపడి, శాంతి గీతికలు ఆలపించిన యీ కళాశీలి, తెలుగు సారస్వతాకాశాల్లో నవకుసుమాలు పూయించి మనకిచ్చి, 1947 సెప్టెంబర్ 11వ తేదీన దివంగతులైనారు.