దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువెవ్వుళ్ళూరు

వికీసోర్స్ నుండి

90. తిరువెవ్వుళ్ళూరు 17

(తిరువళ్ళూరు)

శ్లో. శ్రీ హృత్తాప వినాశ తీర్థరుచిరే శ్రీ వెవ్వుళూర్ పట్టణే
   వీక్షారణ్య మితి ప్రసిద్ధి విభవే శ్రీ శాలిహోత్రేక్షిత:|
   ప్రాగాస్యో వర వీరరాఘవ విభు స్సౌవర్ణవల్లీ పతి:
   భోగేన్ద్రే జయకోటి మందిరగత: శేతే కలిఘ్నస్తుత:||

వివ: వీరరాఘవపెరుమాళ్-కనకవల్లితాయార్-హృత్తాప నాశతీర్థం వీక్షారణ్యం-తూర్పు ముఖము-భుజంగశయనము-విజయకోటి విమానము-శాలి హోత్రులకు ప్రత్యక్షము-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: సర్వేశ్వరుడు శాలిహోత్రమునికి ప్రత్యక్షమై నివసింపదగిన స్థలము? అని అడిగిరట. కావుననే ఈ క్షేత్రమునకు "తిరు ఎవ్వుళ్‌వూర్" (కింగృహ)క్షేత్రమని పేరువచ్చినదని పెద్దలు చెప్పుదురు. మేషం పునర్వసు మొదలు పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. మకర మాసం పూర్వాభాద్ర అవసానముగా పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకై భక్తులు వత్తురు. ఈసన్నిధి అహోబిల మఠం జీయర్ స్వామివారి నిర్వాహములో నున్నది. సన్నిధిలో ప్రసాదము లభించును. సన్నిధి వీధిలో అహోబిల మఠము కలదు. సమస్త వసతులు కలవు.

మార్గము: శెన్నై-అరక్కోణం రైలు మార్గములో తిరువళ్లూరు స్టేషన్ నుండి 5 కి.మీ. మద్రాసు నుండి అన్ని ప్రధాన పట్టణముల నుండి బస్ సౌకర్యము కలదు. ఆంధ్రాలో సూళ్లూరుపేట నుండి, తిరుపతి నుండి బస్ సౌకర్యము కలదు.

పా. వన్దిరుక్కుమ్‌ మెల్ విరలాళ్; పావై పనిమలరాళ్,
   వన్దిరుక్కుమ్మార్; వన్ నీలమేని మణివణ్ణన్;
   అన్దరత్తిల్ వాழுమ్‌ వానోర్; నాయగనాయమైన్ద;
   ఇన్దిరఱ్కుమ్‌ తమ్బెరుమా; నెవ్వుళ్ కిడన్దానే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-2-9


మంచిమాట

ఆత్మకు అహంకారము ఆవరించి యుండుటచే నిజస్వరూపమును తెలియక మిట్టిపడును. ఆ అహంకారము తొలగినచో "దాసుడను" అని తన సహజ స్వరూపముతోనే వ్యవహరింపబడును.

"వడక్కుత్తిరువీధి ప్పిళ్లై"

109

91. తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము) 18

శ్లో. భాతి శ్రీ మణికర్ణికాఖ్య సరసి శ్రీ నీర్‌మలాఖ్యే పురే
   నీర్‌వణ్ణన్ విభురత్ర తోయగిరి రిత్యాఖ్యాం విమానం శ్రిత:|
   నాయక్యా త్వణిమామలర్ పదయుజా మాణిక్య శయ్యాంగతో
   లంకా పట్టణ వీక్షితాంచిత వపు స్తుండీర దేశప్రభు:||

   తొండమాన మహారాజ మార్కండేయ భృగూత్తమై:|
   ప్రత్యక్షిత: కలిధ్వంసి శ్రీ భూతముని కీర్తిత:||

వివ: నీర్‌వణ్ణన్-అణిమామలర్ మంగై తాయార్-మణికర్ణిక పుష్కరిణి-తోయగిరి విమానము-దక్షిణ ముఖము-మాణిక్యశయనము-తొండమాన్ చక్రవర్తికి, మార్కండేయ భృగుమహర్షులకు ప్రత్యక్షము-కలియన్, పూదత్తాళ్వార్ కీర్తించినది.

విశే: తిరునీర్‌మలై ఒక విలక్షణమైన దివ్యక్షేత్రము. వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైనది. "నిన్ఱానిరున్దాన్ కిడన్దాన్ నడన్దా ఱ్కిడమ్‌ మామలైయానదు నీర్మలైయే" అని తిరుమజ్గై యాళ్వార్లు సాదించినట్లుగా ఇక్కడస్వామి నిలచున్న; కూర్చున్న, శయనించిన, నడచుచున్న రీతిని వేంచేసియున్నారు. "నఱైయూర్; తిరువాలి, కుడన్దై తడన్దిగళ్ కోవలర్ నగర్"(తి.మొ.2-4-1) అనునట్లు నఱైయూర్‌లో వేంచేసియున్నరీతిని నిలచుని, తిరువాలి తిరునగరిలో వలెకూర్చుని, తిరుక్కుడన్దైలో వలె శయనించి, తిరుక్కోవలూర్‌లో వలె నడచుచున్న రీతిని వేంచేసియున్నారు.

ఇచట కొండపై రంగనాథులు శయన తిరుక్కోలములో వేంచేసియుండగా (దక్షిణ ముఖము) కూర్చున్నసేవగా శాంత నరసింహస్వామి (తూర్పు ముఖము) నడచుచున్నరీతిలో ఉలగళన్దపెరుమాళ్(తూర్పు ముఖము) నిలచున్న సేవగా చక్రవర్తి తిరుమగన్ వేంచేసియున్నారు. కొండపై శ్రీరంగనాయకి సన్నిధి వేరుగా గలదు. కొండదిగువున నీర్‌వణ్ణన్ ఉత్సవమూర్తి వేంచేసియున్నారు. మణికర్ణిక, క్షీర, కారుణ్య, స్వర్ణ తీర్థములు గలవు. ఈక్షేత్రము చుట్టును నీరు నిలచి యుండెడిదట. తిరుమంగై ఆళ్వార్ ఇచటికి వేంచేసి జలపరివృతమైన సన్నిధిని చేరరాలేక ఆరు మాసములు ఇక్కడనే వేంచేసియున్నారట. అందుచే ఈక్షేత్రమునకు తిరుమజ్గై యాళ్వార్ పురం అను తిరునామము కూడ కలదు.

మార్గము: పల్లావరం స్టేషన్‌కు 4 కి.మీ.

                                                      110