దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కణ్ణంగుడి

వికీసోర్స్ నుండి

26. తిరుక్కణ్ణంగుడి - 26

(కృష్ణారణ్య క్షేత్రం)

శ్లో|| శ్రీ మచ్చ్రవణ కాసారే తిరుక్కణ్ణంగుడీరితే
    పురే శ్యామళ తంవాఖ్యః అరవ్ందలతాయుతః
    ఉత్పలాఖ్య విమానస్థః ప్రాజ్ముఖో గౌతమర్షిణా
    ప్రత్యక్షితః కలిఘ్నార్య సంస్తుతో భువి భాసతే

వివ: శ్యామలమేని పెరుమాళ్ - అరవిన్దవల్లి తాయార్ - శ్రవణ పుష్కరిణి - ఉత్పల విమానము - తూర్పుముఖము - నిలుచున్న సేవ - గౌతమ మహర్షికి (భృగు, బైద్యులకు) ప్రత్యక్షం - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు కృష్ణారణ్య క్షేత్రమని పేరు కలదు. ఇచట ఆకులు ముడుచుకొనని చింతచెట్టు (ఉఱంగాప్పుళి) తిరుమంగై ఆళ్వార్ రాయి విసరిన చోట ఏర్పడిన ఊరా కిణర్ అను మంచి నీటి చెఱువును ఉండెడివి. పుష్పించియు కాయలు కాయని పొగడ చెట్టు కలదు.

ఇచ్చట తాయార్ మూలవర్ ఉత్సవర్ ఒకే పోలికలో నుండుట విశేషము. తిరుమంగై ఆళ్వార్ బంగారు బుద్ధ విగ్రహమును దాచిన స్థలము. ఆ స్థల యజమానితో వచ్చిన వివాద కారణముగా "తీరావழక్కు తిరుక్కణ్ణం గుడి" (తీరని వాజ్యము తిరుక్కణ్ణంగుడి) యని ప్రసిద్ధి చెందినది. కుంభమాసం మఖా నక్షత్రం తీర్థోత్సవము జరుగును.

మార్గము: నాగపట్నం - శిక్కిల్ - కీవళూర్ మధ్యన గల ఆళయూర్ అను చోట బస్ దిగి 1 కి.మీ. నడచి సన్నిధి చేరవచ్చును. తంజావూరు - కీవళూర్ మార్గములో కీవళూర్ నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.

పా|| వజ్గమామున్నీర్ వరినిఱ్ప్పెరియవాళ రవినణైమేవి
    తజ్గమార జ్గైత్తడ మలరున్ది చ్చామమామేని యెన్ఱలైవన్
    అజ్గమా ఱైన్దు వేళ్వి నాల్‌వేద మరుజ్గవై పయిన్ఱు; ఎఱిమూన్ఱుమ్‌
    శెజ్గయాల్ వళర్కున్దుళక్కమిల్ మనత్తోర్ తిరుక్కణ్ణజ్గయ్ళ్ నిన్ఱానే.
    వెన్ఱిశేర్ తిణ్మై విలజ్గల్ మామేని వెళ్ళెయిట్రారిత్తఱుకణ్,
    పన్ఱియాయన్ఱు పార్ మగళ్ పయిలై తీర్తవన్ వజ్జవర్ పొగన్
    ఒన్ఱలావురువత్తులప్పిల్ పల్ కాలత్తయర్ కొడి యొళివళర్ మదియుమ్‌
    శెన్ఱుశేర్ శెన్నిచ్చిగరనన్ మాడ త్తిరుక్కణ్ణజ్గుడియుళ్ నిన్ఱానే.
                తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 9-1-1.4.

27. తిరుక్కణ్ణమంగై - 27(తిరువారూరు 8 కి.మీ)

(కృష్ణమంగళ క్షేత్రం)

శ్లో. దర్శనాఖ్యసరో రమ్యే కణ్ణ మంగై పురీవరే
   అభిషేక లతాయుక్త: భక్తవత్సల నాయక:||
   ఉత్పలాఖ్య విమానస్థ: సురనాథ దిశాముఖ:
   రోమశర్షి ప్రచేతాభ్యాం సేవిత: కలిజిన్నుత:||

వివ: భక్తవత్సల పెరుమాళ్-అభిషేకవల్లి తాయార్-దర్శన పుష్కరిణీ-ఉత్పల విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-రోమశ మహర్షికిని వరుణునకును ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: సన్నిధికి కావలసిన అంశములు ఏడు. అవి విమానము, మండపము, రథము, సరస్సు, క్షేత్రము, నదీ, నగరములు. ఈ ఏడు అంశములు కలిగియుండుటచే ఈ క్షేత్రమునకు సప్తామృతక్షేత్రమని పేరు వచ్చినది. ఈ సన్నిధిలో ఒక తేనెగూడు కలదు. మహర్షులు తేనెటీగల రూపములో స్వామిని ఆరాధించిరట. ఆ తేనె గూటికిని తిరువారాధన జరుగును. "తిరుక్కణ్ణ మంగై యాండాన్" అవతార స్థలము. ఈ క్షేత్రస్వామిని గూర్చి తిరుమంగై యాళ్వార్ "పెఱమ్బుఱుక్కడలై" (పె.తి.10-10) అను దశకమును అనుగ్రహించు చుండగా నాల్గు పాశురములు అనుగ్రహించు సమయమున తిరునిన్ఱవూర్ భక్తవత్సల పెరుమాళ్ ఎదుట సేవ-సాయింపగా "కురుమామణి కున్ఱినై నిన్ఱవూర్ నిన్ఱ నిత్తిల త్తొత్తినై" అని మంగళా శాసనం చేసిరి. ఒక రాత్రి ఇచట నిద్రించినను మోక్షము లభించునని ప్రసిద్ది.

మార్గం: తిరుచ్చేరై నుండి 24 కి.మీ. కుంభఘోణం-తిరువారూర్ బస్ మార్గం తిరువారూర్ నుండి టౌన్ బస్ కలదు. 8 కి.మీ. (కుంభకోణ మార్గం).

పా. పెరుమ్బుఱ క్కడలై యడற்றత్‌తివై ప్పెణ్ణై యాణై; ఎణ్ణిల్ మునివర్‌క్కు
   అరుళ్ తరున్దవత్తై ముత్తిన్ తిరట్కోవైయై ప్పత్తరావియై నిత్తిలత్తొత్తినై
   అరుమ్బినై యలరై యడియేన్ మనత్తాశైయై యుముదమ్బొది యిఇన్జవై
   కురుమ్బినై క్కనియై చెన్ఱునాడి కణ్ణమజ్గయు ట్కణ్డు కొణ్డేన్.

   ఏற்றవై యిమయత్తు ళెమ్మీశనై యిమ్మై యై మఱుమైక్కు మరున్దినై
   ఆற்றలై అణ్డత్తప్పుఱత్తాయ్ త్తిడుమై యనైక్కై యழி యొన్ఱేన్దియ
   కాற்றనై, కురుమామణిక్కున్ఱినై నిన్ఱవూర్ నిన్ఱ నిత్తిల త్తొత్తినై,
   కాற்றనై ప్పునలై చ్చెన్ఱు నాడి క్కణ్ణమజ్గై యుట్కణ్డు కొణ్డేనే.
           తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 7-10-1,5

                                    38