తెలుగు శాసనాలు/పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4. పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము.

(క్రీస్తు. 630. నాటిది కావచ్చును.)

-ఎపి.ఇండికా.XXVII-పుట 231

ఇదియు కమలాపురం తాలూకాలోనిదే. దీని లిపి సొగసైన పల్లవ-గ్రంథాక్షరములను పోలి యుండును. ణకారము కళింగరాజుల శాసనములందువలె నుండును.

ఎరికల్ ముతురాజు పుణ్యకుమారుడు చివన్‌లి పట్టుగాను రేనాణ్డేలుచుండగా చామణకాలు అను ఉద్యోగిక ఱెవురు(నివాసియగు) తక్కన్ ప్రోలు పారదాయ (భారద్వాజః)కత్తిశర్మకు తిప೯ లూరను ఏబది (మతరుల) పన్నస కాత్తి೯క మాసము బహుళపక్షము ద్వతీయ,పుణరు పుష్యమి (పునర్వసు) నక్షత్రము సోమవారము బృహస్పతిహోర అగు సమయమున ధర్మము చేసెను. పుణ్యకుమారునికి మరున్థ(ఇక్కడ థవత్తును θగా చదవాలి) పిడుగు; మదుముదితున్ఠు (ఇక్కడ ఠవత్తును θగా చదవాలి), ఉత్తమోత్తమున్డు (ఇక్కడ డవత్తును θగా చదవాలి). గణ్యమాన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి) అను బిరుదాలు లేక ప్రశంసాపదములు గలవు. మూలము

  1. స్వస్తిశ్రీ ఎరికల్ల ముతు
  2. రాజు పుణ్యకుమారున్డు((ఇక్కడ డవత్తును θగా చదవాలి)గణ్య
  3. మానున్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)మరున్డ(ఇక్కడ డవత్తును θగా చదవాలి)మద
  4. ముదితును తమోతమున్డ(ఇక్కడ డవత్తును θగా చదవాలి)యిన వా
  5. న్డు((ఇక్కడ డవత్తును θగా చదవాలి)చి೯లియ పటుకాను రేనాణ్డే
  6. ళుచుతక్క೯ పుఱోలపారదాయ
  7. కిఱెవురు కత్తిమ೯కు తిప೯లూ
  8. రపనాళకొణ్డ కాత్తి೯య చీకు
  9. బిదియ సీమవారంబు పుణరు 22

తెలుగుశాసనాలు

10.పుష్యంబు బృహస్పతి హోర[కా]

11.ను ఎమ్బది యె చామణకాలధ[11*]

ఇచట దానము చేసినది చామణకాలు అను ఉద్యోగి. కనుక 'పుణ్యకుమారుడు రేనాణ్డేళుచు'- అనుదానికి పుణ్యకుమారుడు రేనాణ్డేళుచుండగా అనిచెప్పవలెను. 'ళ'కారములు కొన్ని యింకా 'ల 'కారములుగ మారలేదు. ఏవ్ళుచున్, అనేయున్నది.వేరే శాసనంలో 'శమ్మ೯ళాకున్' అనికూడా కలదు. 'ఎరికల్' అనుహలంతముపట్టుదలగా 'ఎరికల్ల'అని అజంతంగా మార్చబడింది. ఇదే నిజ మైన తెలుగుతనము. అట్లే ద్రవిడ హలంత తత్సమాలు పుణ్యకుమారన్; గణ్యమానన్, ముదముది తన్, ఉత్తమోత్తమన్, అనేపదాలు ఉకారాంత తెలుగు తత్సమాలుగ మారినవి. పుణ్యకుమారున్డు, గణ్యమానున్డు, మదముదితున్డు, ఉత్తమోత్తమున్డు(ఈ నాలుగు పదాల లోని డ వత్తును θ గా చదువవలెను) అని 'ఉ'కారాంతములు ప్రథమైక వచన రూపము లు తయారై నవి. ఈ చివరి 'ఉ 'కారారము నుచ్చరించుటకు ముందున్న ప్రాతిపదికలోని 'అ 'కారముకూడ 'ఉ' కారము కావలసి వచ్చింది. అనగా చివరి 'ఉ'కారమును నుచ్చరించుటలో కష్టము లేకపోతే ముందున్న ప్రాతిపదికలోని తుది 'అ'కారము 'ఉ'గా మారనక్కర లేదనుకోవలెను. అందుచేతనే 'రంగడు' 'మల్లడురేవడు'అను రూపములనేకము వాడుకలోనున్నవి.

ఇచట ముతురాజు అనుటచే పుణ్యకుమారుడింక మహారాజు పదవిని పొందలేదని తెలియుచున్నది. మఱున్డ(ఇక్కడ డవత్తునుθగా చదవాలి) పిడుగు అనగా శత్రురాజులకు పిడుగువంటి వాడని అర్థము.'కగ'లమధ్య భేదమింక పూర్తిగా రాలేదు.అట్లే 'త' 'ద' లమధ్యకూడ. తేనికి, దేనికి అని అభేదంగానే వాడబడుచున్నవి.పల్లవ మొదటి మహేన్ధ్ర వర్మ యొక్క 'పగాప్పిడుగు 'అనే బిరుదును పోలిన బిరుదీ పుణ్యకుమారుని' మఱన్డ (ఇక్కడ డవత్తునుθగా చదవాలి) పిడుగు'లేక మార్పిడుగు ' అనునవి.అట్లే మదముదితున్డు'(ఇక్కడ డవత్తును θ గా చదవాలి) అనేదికూడా పల్లవరాజుయొక్క 'మత్త విలాస' అనేబిరుదును పోలియున్నది.చిప೯లియ అనేది చిప్పలి అనే నగర ము.పటుకాను(=పట్టుకాను)అంటే రాజధానిగా రాజ్యము చేయుచుండగా, అని అర్థము. తక్క೯పుఱోల అనగా తర్కప్రోలు అనేఊరు తకప్రోలు అనే వేరే శాసనంలో కూడ వస్తూంది.'పుఱోల'లోని 'ఱో'అను అక్షర ము వలన ముందున్న 'పు'కొంత్కాలమునకు 'ప్రో'గా మార్పునొందెను. అట్లే 'కొఱెచె' అనునది 'క్రొచ్చె 'అని మారింది.'పారదాయ 'అనగా 'భారద్వాజ ' అని కత్తిశర్మ యొక్క పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము

23


గోత్రము కాదగును. ఇచట గమనించ వలసిన దేమన ;భారద్వాజ ' అని, పుణ్యకుమారుని సంస్కృత శాసనాల్లో అనేక మార్లు వస్తుంది.అయినా యిక్కడ తెలుగుతనము ఉండాలని ప్రాకృతరూపాన్ని అనుకరించి 'పారదాయ 'అని వాడెను.


'కిఱెవురు 'అనే పదానికి అర్థము తెలియుట లేదు.తిప్పలూరు లోనే భూమిదానం చేయబడింది.ఇట్లు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే భూమిని 'పన్నస'అంటారు.పన్నాస,పన్నవిస అనురూపములలో కూడనిది ప్రాచీన తెలుగు శాసనములందు కనుపించును.


'కొణ్డకాత్తి೯క 'అను పదంలో 'కొణ్డ'అంటే సరిగా తెలియదు.తిథి, వరాలు, నక్షత్రము, హోర చెప్పబడినవి.పుణరుపుష్యం అంటే పునర్వసు నక్షత్రమని అర్థము.తమిళంలో కూడా దీనిని 'పునర్పూశం'అంటారు. సీమవారమనిన్నీ ,బృగస్పతిహోర అనిన్నీ చెప్పబడి నవి. శాసనాల్లో వారము,హోర చెప్పుట యిదే మొదలనిపిస్తుంది.కనీసం వారము పేరు చెప్పుట కూడ ఇంతకు ముందు శాసనాల్లో కానరాదు.


ఏబది అని సంఖ్య మాత్రమే చెప్పబడింది.సందర్భమును బట్టి 'మఱుతర్లు 'అను భూపరిమాణముగా గ్రహించవలెను.చామణకాలు అనే ఉద్యోగియొక్క 'ధ ' అంటే 'ధర్మము 'అని ప్రాకృతశాసనాల్లో సూక్ష్మముగా వ్రాయుట కలదు.కనుక అట్లే యిక్కడకూడ గ్రహించవచ్చును.


'రేనాణ్డేళుచుండగా' అనుటను బదులు 'రేనాణ్డేళుచు'అని వ్రాయటము, తుదిలో 'చామణకాల(ధర్మము)'అని క్రియ లేకుండా వాక్యం ముగియుట ఇవి రచనలోని లోపములు.వాక్యరచన సరిగా రూపొందలేదని స్పష్టంగా తెలుస్తోంది.వీరిశాసనాలన్నీ యించుమించుగా ఇట్లే యుండును.కొన్నిపదా లకి సరిగా అర్థం తెలియక పోవటమేగాక వాక్యాల్లో కర్త,క్రియ,కర్మలను తెలుపు పదాలు కూడ స్పష్టంగా ఉండవు.క్రొత్తగా భాషను తయారు చేసు కొనే కాలమది.ఈ మాత్రం శాసనం వ్రాయటమే చాలా గొప్ప ఆనాడు.


ఈ పుణ్యకుమారుని కొడుకు మొదటి విక్రమాదిత్యుడు,ఇతని కొడుకు శక్తి కుమారుడు,ఇతని కొడుకు రెండవ విక్రమాదిత్యుడు.ఇతని కొడుకు సత్యా 24

తెలుగుశాసనాలు

దిత్యుడు.'విక్రమాదిత్య' అను పేర్లు వచ్చినప్పుటినుండి వీరు బాదమి చాళుక్యులకు సామాంతులైనత్లు తెలుస్తుంది.బాదామి చాళుక్య రెండవ పులకేశి వల్లభుని(611-643) కొడుకు మొదటి విక్రమాదిత్యుడు క్రీ.678 వరకు రాజ్యమేలెను.తరువాత అతని కొడుకు వినయాదిత్యుడు,ఇతని కొడుకు రెండవ విజయాదిత్యుడు వరుసగా రాజ్యమేలిరి.విజయాదిత్యుని కొడుకు రెండవ విక్రమాదిత్యుడు క్రీ.732 లో రాజయ్యెను.ఇతనికి సమకాలికుడు సత్యాదిత్యుడనే రేనాటి చోళరాజు.ఈ రాజుయొక్క శిలాశాసన మొకటి కమలాపురము తాలూకా మాలెపాడులో కలదు.

5. సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము.

(సుమారు క్రీ.శ. 725 నాటిది.)

ఎపి.ఇండికా.XI పుట.345

మొదటి వైపు

  1. అ స్వస్తిశ్రీ చోఱమ
  2. హా రాజాధిరాజ ప
  3. త్యశక్తి కొమర వి
  4. క్రమాదితుల కొడుకు
  5. [ళ్ళ్]కాశ్యపగోత్ర
  6. [న్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి]శతదిన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)శిద్ది
  7. [వే]యురేనాణ్డు ఏఱు[వే]
  8. [ళు] ఏళుచు[న్డి](ఇక్కడ డవత్తును θగా చదవాలి)కొను
  9. [ఱి]పాఱ రేవళ
  10. మ్మ೯కాశ్యపగో
  11. త్రి(త్రు)నికి ఇచ్చిన
  12. [- -]చిఱుంబూరి ఉత్త
  13. [- -]శ తూపు೯నదిశ
  14. [- -]డు జుగ్గి పొలగ[రు]
  15. సుసక్షిణదిశ[ర]
  16. [-]గ్గాపాఱ[-]

రెండవ వైపు

18. ఏనుమఱుత్రుగా 26

తెలుగు శాసనాలు

19.ను తాగిరి[||*]దేని
20.సల్పిన వానికి
21.వేగుద్లుము వేసె
22.ఱువుళు వేవాన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)
23.ద్లు నిలిపిన పుణ్య
24.ంబు దీనికి వక్రంబు
25.వచ్చు వన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)పుత్రన
26.ద్య స్త్రీ వద్య గోవ
27.ద్య వ ఞాచమహా
28.పాతక ఞాచెసిన
29.వానిలోక[ంజ]
30.న్వాన్డుల(ఇచట డవత్తునుθగా చదవాలి)

ఇప్పటికి భాష కొంచెం మెఱుగైంది.రాజు కొద్దిపాటి ప్రశస్తి,తన కుల గోత్ర ములు, తండ్రి తాతల పేర్లు వ్రాయించుకొనెను.తమ చోఱ మహారాజా ధిరాజ పరమేశ్వ రుడనియు,విక్రమాదిత్యుని పుత్రుడగు శక్తి కొమరుని కొడుకైన (రెండవ) విక్ర మాదిత్యుని కొడుకుననియు కాశ్యప గోత్రమునకు చెందిన వాడననియు చెప్పు కొనెను.సిద్ధవటము-వేయి గ్రామాల సీమ, రేనాణ్డు -ఏడువేల గ్రామాల సీమ రెండింటిని కలిపి రాజ్యము చేయు చున్నట్లు చెప్పు కొనెను.అట్టి సత్యాదిత్య మహారాజు కాశ్యపగోత్రుడగు రేవశర్మ అను బ్రాహ్మణునికి ఇచ్చిన[ది]అని వాక్యము ముగియును. భూమి అని పూరించు కొనవలెను.కొమఱి అనునది 'పాఱ'కు విశేషణ ముగ నున్నది గనుక నొక గ్రామమని అర్థమగుచున్నది.తర్వాత వాక్య ములో చిఱంబూరు మున్నగు సీమలు చెప్పుతూ ఇచ్చిన భూపరి మితి చెప్పబడెను.వాక్యం చివర 'తాగిరి' అని సమాపక క్రియ కలదు. ఆ సరి హద్దులు తాకునట్లు అయిదు మఱతుర్లు భూమిని ఇచ్చిరి అని అర్థము. ఇంతవరకు రెండు వాక్యములు సరిగానే యున్నవి.'తాగిరి'అను క్రియ మనకిప్పుడు ఈ యర్థములో కానరాదు. సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము

27

తర్వాత ఈ ధర్మమును కాపాడు వానికి పుణ్యఫలము,చెఱచువానికి పాప ఫలము చెప్పబడినవి.ఇందలి పదములు కొన్ని పరిశీలింపదగియున్నవి.

'విక్రమాదిత్య శక్తి కొమర విక్రమాధితుల కొడు'కను చోట మూడు పురుషాం తరముల వారొకే సమాసములో జేర్చి చెప్పబడుట యొక విశేషము. 'ఏళచున్డి(ఇచట డ వత్తును θ గా చదవాలి) అని 'ఏలుచుణ్డి ' అను నర్థమున వాడబడెను.కాశ్యపగోత్ర రేవశర్మకు అనుతకు బదులు 'రేవ శర్మకాశ్యపగోత్రునికి'అనే ప్రయోగం విలక్షణంగా వున్నది.షష్ఠి ప్రత్యయము 'రేవశర్మ'పదానికి కాకుండగ గోత్రపదానికి చేర్చబడింది.21వ పంక్తి నుండి వేదుద్లు,మువెసెఱువులు,వేవాన్డు,ద్లునిల్పిన పుణ్యము అనుదానిలో ము యొక్క ప్రయోజనము తెలియదు. ప్రథమా విభక్తి ప్రత్యయము కాదు.ఆనాటి కింకా'ంబు 'అనేదే వాడబడుచుండెను.లేఖక ప్రమాదము కావచ్చు ను.'వేగుద్లువు' అని దానిని ప్రకటించిన వరు చదివిరి.అప్పుడు కూడ 'వు'కి ప్రయోజనము కానరదు.ఇచట 'గుడికి' బహువచనము 'గుద్లు' అనియున్నది.అదినేడు గుడ్లు,గుళ్లు అని ద్వివిధ రూపములైనది. అట్లే మఱికొన్ని పదములు గలవు.θ వర్ణము భాషనుండి పోవునప్పుడు దానికి సరిపోవు ఉచ్చారణమును ఉన్న అక్షరములతో సరిపెట్టుటకై చేసిన ప్రయత్నమే యిట్టి వికల్పరూపములయ్యెనని స్పష్టమగుచున్నది.

గుడి& rarr;గుద్లు(=గుడ్లు,గుళ్ళు)(ప్రస్తుత మాలెపాడు శాసనము)

వాకిలి→వకిద్లు(=వాకిండ్లు(=వాకిండ్లు,వాకుళ్ళు)అరకట వేముల శాసనము)

ఊరు→ఊడ్లు(=ఊఁడ్లు,ఊళ్ళు)(ఇదేశాసనము)

కంచరి→కంచద్లు(కంచడ్లు,కంచర్లు)అరకట వేములశాసనము)

వేవాన్డు(ఇచట డ= θ గా చదవాలి)ద్లు అని యీ శాసనమందు చూడనగును.

'వేవాన్డుద్లు(ఇచట డవత్తును θగా చదవాలి) అనుపదము 'వేయి ఊళ్ళు'అను నర్థమున వాడబడినట్లు తోచును.'పుదలి ఏదువాన్డు(θ),'సాక్షి వచ్చువాన్డు (θ)'వక్రంబు వచ్చువాన్డు(డ్=θ) మున్నగు క్రియాయుక్త విశేషము లందు వలె 'వేయి'అనుసంఖ్యావాచకము తరువాత కూడ వాన్డు(డ్=θ) వాడబడెను. వేవాన్డు(డ్=θ) వేయువాడు అని కీ.శే.మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు చెప్పిన యర్థమిచ్చట బాగులేదనిపించును.పుత్రవధ