తెనాలి రామకృష్ణకవి చరిత్రము/పట్టెడు మెతుకు

వికీసోర్స్ నుండి

31 పట్టెడు మెతుకు

'రాయలకడసెలవుగొని రామకృష్ణకవి మఱొకసారి నెల్లూరునకు బోయెను. శ్రీమతియను వేశ్య యఖండపాండితీవిభాషితమైతన్ను వాదమునగాని, మఱియేవిషయముననైనగాని గెలిచినవారితో భోగసాగర తరంగముల నోలలాడుటయేగాక వేయి దీనారముల నిచ్చెద' నని ప్రకటన మొనరించి యుండెను. రామకృష్ణు డామె నెట్లయిన నోడించి యాబహుమానము దానొందవలయుననితలంచి, యొకనాటి సాయంసమయమున గడ్డిమోపునెత్తుకొని యావేశ్య యింటికడ కేకవైచెను. ఆమె 'అబ్బీ ? గడ్డిమోపెంత?' అని యడిగెను. “ఆఁ! తగిలినది. బేరము అని తలంచి, పట్టెడు మెతుకుల కిచ్చెద' ననెను .

'అయితే ఆదొడ్డిలో బడవేయు' మని యా శ్రీమతి పట్టెడన్నముతెచ్చి 'బట్టపట్టు' మనెను – రామకృష్ణుడు 'పాండిత్యమున నసమానినని గర్వించుచున్నావు. పట్టెడు మెతుకున కిచ్చెదనంటిని గాని పట్టెడన్నము కంటినా? చక్కగా ఓడిపోయినావు పందేమొడ్డిన వేయి దీనారములను యి'మ్మనెను ఆమె యోడితినని యొప్పుకొని యా రాత్రి యాతనితో సౌఖ్యార్ణవ తరంగమాలికల దేలియాడి వేయి దీనారములనుయిచ్చెను. రామకృష్ణుడు విజయనగరమునకు దిరిగివచ్చి రాయల కీసమాచారము నెరిగించి యాహ్లాదమొదవించెను.


32 తాతాచార్యుల కవమానము

వృద్ధుడయ్యును తాతాచార్యులు వేశ్యలగృహమునకు దఱుచుగా వెళ్ళుచుండునని యెవ్వరో చెప్పుటచే రామకృష్ణుఁ డొకనాఁడు 'ఆచార్యులవారూ ! తాము గతరాత్రి వేశ్యయగు చంద్రిక గృహ