చీనా - జపాను/1 వ అనుబంధము

వికీసోర్స్ నుండి
1 వ అనుబంధము
♦♦♦చైనాలో మూడు ప్రభుత్వాలు♦♦♦

ప్రస్తుతం చైనాలో మూడురకాల అధికారాలున్నాయి.ఒకటి నాన్కింగు ;రెండు కాంటన్‌;మూడు సోవియట్టు ప్రభు త్వాలు.నాన్కింగు ప్రభుత్వమే పెద్దదిగా ఉంది.దీని తరువాత సోవియట్తు పెద్దది.కాంటన్‌ ప్రభుత్వము చిన్నది. కాంటన్‌ప్రభుత్వము కీ||శే|| సన్‌యెట్టుసేను యొక్క పద్ధతిలో కూడిన ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటుం ది.నాన్కింగు ప్రభుత్వములో ప్రస్తుత అధికారులు జపాను ధాటీకి ఆగలేక ఏదోరీతిని జపానుతో సఖ్యత చేసు కోవాలంటూవుంటే అక్కడున్న యువకబృందానికి అదియుష్టము లేనందున యూవుభయులకు యూరీతి అంతః కలహాలునాయి. సోవియట్టులున్నచోట కార్మిక కర్షక ప్రభుత్వాన్నే బలపరచుకుంటూ మిగత యూనాన్కింగు, కాంటను ప్రభుత్వాలకు ప్రాకించి ఏక సోవియట్టు చైనాగా చేయాలనుకుంటున్నారు.చైనాలోని సోవియట్టులకు సోవియట్టు రష్యాయొక్క ఆంతరంగిక బలంవుందని సోవియట్టు రష్యాపై సామ్రాజ్యతత్త్వంతో కూడిన జపానుకు కోపంగా ఉంది.సోవియట్టు రష్యాలోని సామ్యవాదతత్త్వం ప్రక్కనున్న జపానులోనికి ప్రాకితే జపాను యొక్క సామ్రాజ్య ప్రాబల్యమునకు ముప్పుకలుగుతుందను భయంతో చైనానంతటిని జపానుయొక్క సామ్రాజ్యంలోనికి తీసుకొని రష్యాను అణచివుంచాలని జపానుకు ఉంది.చైనా స్వాతంత్ర్య

71

మును కాపాడుటలో లీగ్‌ఆఫ్‌ నేషన్సు(అంతర్జాతీయ సంఘం)యిదివరలో సహాయపడలేదు.అందువల్ల లీగ్‌పై చైనాకు మోజు పోయింది.ఇంతకూ నాన్కింగు, కాంటన్‌, సోవియట్టు ప్రభుత్వాలు మూడు ఏకమైతే ఏకొద్దో జపానుయొక్క సైనికబలాన్ని అడ్దుకొనగలదేమోగాని అటుల లేనంతవరలు చైనా జపానుకు లొంగక తప్పదేమో అనిపిస్తోంది.

ఇంతకు వైనాలో పాశ్చాత్యులలో బ్రిటిషు, అమెరికా, ఫ్రెంఛి వారికిన్ని తూర్పుననున్న జపాను అధికారానికి హక్కులున్నాయి.ఈ నాలుగు అధికారముల మధ్యను చైనా స్వాతంత్ర్యంగా నుండడానికి నలిగిపోతోంది.

♦♦♦చైనా బలహీనత-నాన్కింగు గవర్నమెంటు♦♦♦
1644 లగాయితు 1911 వరకు చైనాలో సరియైన ప్రభుత్వంలేక(కేంద్ర ప్రభుత్వం) ఎవరు బలవంతులో అట్టి వారి అధికారంలో తలోకాస్తా వుంటూవుండేది.ఇందువల్లనే బ్రిటిషువారు 1842 లో చైనాకు నల్లమందు వర్తకం చేయుటకు వచ్చి చైనారాజులతో పోరాడి వర్తకానికి హక్కులను సంపాదించుకొనిరి.చైనావారు నల్లమందు వేస్తా రు.అందువల్ల చైనావారికి బ్రిటిషువరు నల్లమందునమ్మి లాభాలు సపాదించుటకు ప్రారంభంలో వచ్చి క్రమేణా చైనాలోనున్న ముడిపదార్థాలను బ్రిటిషువారు తీసుకుపోవుటకు రైళ్ళు,బ్యాంకులు మున్నగు వాటికి బ్రిటిషువారే పెట్టుబడిపెట్టి ఆరీతిగ చైనా ఆర్థిక రాజ

1 వ అనుబంధము

73

కీయ సమస్యలను బలహీనంగా చేసి, బ్రిటిషు అధికారాన్ని హెచ్చుచేసుకున్నారు.బ్రిటిషువారు వైనావారిని వారి విశ్రాంతి స్థలములలోనికి(పార్క్సు)క్లబ్బులలోనికి రానియ్యలేదు.చైనావారు బ్రిటిషువారికి బానిసలే అనునట్లు సాంఘికంగా జూచేవారు.ఇండియాకు మొదట వర్తకానికివచ్చి క్రమేణా రాజ్యాన్ని సంపాదించినట్లే చైనాలోనికీ యీ బ్రిటిషువారు ప్రవేశించిరి.డాక్టరు సన్‌యట్టు సేను నాయకత్వంలో 1911 లో చైనా ప్రజాస్వామిక ప్రభుత్వ ముగా ఏర్పడెను. దీనికికాంటన్‌ ప్రదేశము ముఖ్యస్థావరముగ నుండెను.మహాసంగ్రామ సమయంలో(1614-18)జపానువారు పెకింగులోనున్న అధికారులను బెదరించి కొన్నిహక్కులను చైనాలో సంపాదించుకొనిరి. 1921 లో డాక్టరు సన్‌యెట్టుసేను అమెరికా, బ్రిటను దేశములనుంచి చైనాను జపాను మ్రింగకుండానుండుటకు సహా యము పొంందుటకు యత్నించగా అయత్నంలో విఫలమయ్యెను.అపుడు లెనినుతో సంప్రతించగా యిావుభ యుల సంప్రతింపులలోను చైనాపూర్తిగా సోవియట్టు రష్యాను అనుకరించ వీలులేదనియు కాని ఆ పద్ధతులనే చైనాయొక్క సాంఘిక, ఆర్థిక పరిస్థితులనుబట్టి మార్చుకుంటూ అవలంబించుటకున్ను ఏర్పాట్లు జరిగెను.దీనితో డా||సన్‌యట్టుసేనును పాశ్చాత్యులు నమ్మలేదు.జపానుకు సోవియట్టుతత్వంయిష్టంలేదు;గాన మరింత విరోధం హెచ్చెను.కాని చైనాలో ఈవుభయుల

74

చీనా-జపాను

సంప్రతింపులవల్ల చైనా స్వాతంత్ర్యమునకు కొన్ని కట్టుదిట్టాలు సైనిక, రక్షణశాఖలలో ఏర్పాట్లు చేసుకొనగలిగిరి. డా||సన్నియేటుసేను 1925 మార్చిలో చనిపోయెను.దానివల్ల చైనాలో మరల ఐకమత్యము చెడిపోయెను. దీనివల్ల పెకింగునందున్న అధికారుల ప్రాబల్యం వలన నాన్కింగు ప్రదేశము 1927 ఏప్రియలులో నాన్కింగు ప్రభుత్వమునకు ప్రధాన పట్టణముగ ఏర్పడెను.సోవియట్టులకు కౌఇంగుటాంగు ముఖ్యప్రదేశము.ఇదే సన్నియ ట్టు సేనునకు కూడా కాంటన్‌ గవర్నమెంటునకు ముఖ్యస్థానముగ నుండెను.1927 లో నాన్కింగు ప్రభుత్వ ము అనగా చాంగిషేకు అనువాడు డా.సన్‌యట్టుసేను మరదలను వివాహం చేసుకొనెను.డా||సన్‌ యట్టు సేనుకు తన భావమరిదికి మంత్రిత్వమిచ్చెను.ఈరీతి సంబంధంతో డా||సన్‌యట్టుసేను అనుచరులలో విభేదం కలిగించి చాంగిషేకు తన నాన్కింగు ప్రభుత్వాన్ని పెద్దదిగా చేసుకొనెను.ఈతడు వర్తకులకు భూస్వాములకు రక్షణకర్తగానుండి కార్మిక కర్షకుల ప్రాబల్యాన్ని అణచుచుండెను. ఈ కారణం వల్ల యిాతని ప్రభుత్వాన్నే విదేశీయ ప్రభుత్వాలు అంగీకరించి బ్రిటను, బెల్జియం, అమెరికా, సంయుక్తరాష్ట్రాలు మున్నగు రాజ్యాలవారు యిా నాన్కింగు ప్రభుత్వంతో వర్తకపు టొడంబడికలు వగైరాలు చేసుకొన్నారు.లీగ్‌ ఆఫ్‌ నేషన్సునకు యిా నాన్కింగు ప్రభుత్వమే ప్రతినిధులను పంపుచుండెను.

1వ అనుబంధము

75

చైనాలోని మిగతా కాంటన్,కౌఇంగుటాంగు ప్రభుత్వాలకు అనగా డా||సన్‌యట్టు అనుచరుల ప్రభుత్వానికి, కౌఇంగుటాంగు సోవియట్టు అనుచరుల ప్రభుత్వానికి యిా నాన్కింగు ప్రభుత్వం లోబడదు.అందువల్ల యిారెంటి ని అణచుటకు నాన్కింగు ప్రభుత్వము ధ్వజం ఎత్తుతో ఉండడంవల్ల అంతంఃకలహములున్నాయి.నాన్కింగు ప్రభుత్వాన్ని ఎదుర్కొనుటకు నాన్కింగు, కౌఇంగుటాంగు ప్రభుత్వాలు రెండున్ను 1931 లో ఏకమై యత్నించ గా ఆయత్నంలో కొంత సఫలం కొంత విఫలం కలిగినది. చైనాలో హుఫే రాష్ట్రములోను,హనన్‌ రాష్టంలో చాల చోట్లలోను సోవియట్టు ప్రభుత్వం చాలా కట్టు దిట్టాలతో ఏర్పడి అభివృద్ధి మార్గంలోనే ఉంది.ఈ భాగాల సరి హద్దులలో“ఇక్కడ నుంచే చైనా సోవియట్టు గవర్నమెంటు ప్రారంభం” అనుగుర్తుగల సైనుబోర్డులను (వ్రాత మూలకంగా తెలిపే చిహ్నములను)కట్టుకొన్నారు.నాన్కింగు ప్రభుత్వంలో నున్నవారిలో కొద్దిమంది కూడిన పక్షం సోవియట్టునకు హెచ్చుమందితో కూడిన పక్షం నాన్కింగు ప్రభుత్వంతోటి సంబంధం పెట్టుకుంది.మొత్తానికి యిా కాంటన్‌ ప్రభుత్వం నాన్కింగు ప్రభుత్వంతో స్నేహంగా వుంటూ ఒకరికి మరొకరు తోడ్పడుతున్నారు.

నాన్కింగు, కాంటన్‌ గవర్నమెంటులు ఒకటే అనుకుందాము.ఈవుభయులు ఏకమై ప్రభుత్వంలో వృద్ధనాయ

76

చీనా-జపాను

కులకు జపానుతో సఖ్యము చేసుకోవాలనియు యువకబృందానికి సంపూర్ణ స్వాతంత్ర్య పరిపాలనలోనే వుండా లని అంతఃకలహాలున్నాయి.నాన్కింగు గవర్నమెంటు తత్వం కార్మిక కర్షక ప్రభుత్వానికి వ్యతిరేకమున్నూ ధనిక వర్గముతో కూడిన ప్రజాస్వామ్య పరిపాలనకు అనుకూలముగను ఉంది.ఇట్టిస్థితిలో జపాను సమయం దొరికిన పుడల్లా యిానాన్కింగు ప్రభుత్వాన్ని బెదరిస్తూ బలహీనం చేస్తోంది.దీనినిబట్టి చైనా సమస్య పర్యవసానం మున్ముందు ఏలావుంటుందో వుహింతురుగాక!

(కృష్ణా పత్రిక నుండి)1-7-36