చీనా - జపాను/జాతీయ ప్రభుత్వ స్థాపనము

వికీసోర్స్ నుండి
6
చీనా-జపాను

40 వంతులు పట్టుబట్టలు ఫ్యాక్టరీలలోగాక చేతిమగ్గముల మీదనే తయారుచేయవలసి వచ్చుచున్నది. పెక్కు మంది వ్యవసాయజీవులే యైనను మిల్లులలో పనిచేయువారు 2,750,000 మంది గృహపరిశ్రమలవారు 12,000,000 మంది ఉన్నారు.ఈ పరిశ్రమలవారందరూ దగ్గిర దగ్గర నగరములలోను,విదేశస్థుల మిల్లుల లోను జీవించుటచేత వీరికి మంచి ఐకమత్యము,బలము ఉన్నది.పనిచేయు గంటలు తగ్గించుమని, కూలి హెచ్చించు మని.నిరుద్యోగమును తొలగించమని. ఇతర హక్కులిమ్మని,ఇందుకు తగిన శాసనములుండవలెనని వారు నిరంతరాందోళనము చేయుచు పల్లెటిగ్రామములవారిని గూడ ఉద్బోధించి విప్లమును లేవనెత్త జూచు చున్నారు.చీనాదేశమునకు మహత్తరమయిన శక్తిస్వాతంత్రములు రావలెనంటే వీరి ప్రయత్నములవల్లనే వచ్చుననుటకు సందేహము లేదు.

జాతీయ ప్రభుత్వ స్థాపనము

చీనాకు ఈవిధము ఆర్థికదారిద్య్రము,రాజకీయదాస్యము,కాయిక కష్టము ఒక్కముహూర్తమున సంభవించినవి. దీని కంతటికిని విదేశసామ్రాజ్యతత్వ ప్రభుత్వముల చర్యలే కారణములని చీనాప్రజలు గుర్తించిరి.1900లో బాక్సరుతిరుగుబాటు పేరుతో"యుహొచుఆను" అను ఉద్యమము లేచినది.ఈతిరుగుబాటును విదేశ ప్రభుత్వ ములన్నీకలసి అణగద్రొక్కినను ఉద్యమము మాత్రము
చీనా

చావలేదు.ఈ విదేశప్రభుత్వము లనేకములై ఒకటి నొకటి మించిపోకుండా కాచుకొనుచుండుట చేత చీనా సామ్రాజ్య వంశమసలే అంతరించలేదు.మంచూ వంశస్థులక్రింద నింకనూ అది నామమాత్రావశిష్టమై యున్నది ".పరదేశస్థులెట్లు చెప్పితే అట్లుచేయడం,స్వదేశస్థులెట్లు నిందిస్తే అట్లు పడడం,ఇదిరాజవంశం యొక్క గతి.

ఈ రాజవంశం కూడా 1911 వ సంవత్సరం తిరుగుబాటువల్ల తొలగిపోయినది.ఈ సంవత్సరములో చీనా రిపబ్లికు స్థాపించబడినది.అధికారము పౌరుల వశమైనది.అయినను చీనాకష్టము లింతటితో గట్టెక్కలేదు. ముందు రానున్న మహాప్రళయమున కిదియొక సూచనమాత్రమే.

1911లో నెలకొల్పబడిన చీనారిపబ్లిక్కునకు జనరల్ యుఆన్‌షీకేయ్‌ మొట్టమొదటి అధ్యక్షుడు.ఈ రిపబ్లిక్కు స్థాపనకు కూడా పాశ్చాత్యసామ్రాజ్య ప్రభుత్వములే తోడుపడినవి.వారి సహాయముతోనే అధ్యక్షుడు చీనా పరి స్థితులను చక్కబెట్టజూచెను.అంతకు ముందు సన్‌యట్‌సేను నాయకత్వముక్రింద చీనా ఉద్యమమును క్యూమిన్‌ టాంగు పక్షము వారు నడిపించుచుండిరి.దీనికి పాశ్చాత్యసామ్రాజ్యముల అధికారమంటే కిట్టదు.దానిని అణగ ద్రోక్కుటకే ఈ పక్షము కంకణముకట్టుకొని పనిచేయుచుండెను.పాశ్చాత్యప్రభుత్వముల ఆధారముతో చీనా రిపబ్లిక్కును స్థాపించిన యుఆన్‌షిన్‌కేయ్‌ ఈ పక్షమును ధ్వంసముచేసి వారియండ నిలువగలిగెను.

7
8
చీనా-జపాను

కాని ఈ విజయము చిరకాలము నిలువలేదు.దక్షిణప్రాంతములలో సన్‌యట్‌సేను క్రమక్రమముగా బలవంతుడై క్యూమిన్‌టాంగును బలపరచి తిరుగుబాటును లేవదీసెను.

ఇంతలో ఐరోపాయుద్ధము వచ్చెను.ఈ యుద్ధములో జపాను పాలుగొనలేదు సరేగదా చీనాసముద్రములో జర్మనీ పడవలను ముంచివేయుచు,జర్మనీరాష్ట్రమగు షాంటాంగును ఆక్రమించుచు చీనాలో పాశ్చాత్య దేశము లనుమించి తన ప్రతిభ నెక్కువగా స్థాపించుకొనజొచ్చెను.జపాను ఈ విధముగా బలవంతమై చీనా ప్రభుత్వము ను తన యురవైయొక్క డిమాండులను అంగీకరిస్తావా అంగీకరించవా అని 1915లో బెదరించెను.ఇందుకు చీనా ఒప్పుకుంటే అనేక పాశ్చాత్యప్రభువులకు బదులు ఒక్క జపాను దాస్యమునకు అంగీకరించినట్లే అగును; కనుక చీనాప్రజలు దీని కంగీకరించలేదు,సరేగదా,అమెరికా సామ్రాజ్యము కూడా దీనిని ప్రతి ఘటించెను. ఏమైనా సరే ఐరోపాయుద్ధానంతరమున 1918 వ సంవత్సరము నాటికి తక్కిన దేశము లన్నింటిని తీసికట్టు చేసి జపాను బలవత్తరమైన శక్తియై చీనాను గడగడలాడించుచుండెను.1919 లో జరిగిన వార్సయిల్సు ఒడంబడిక ప్రకారము షాటాంగు,మంచూరియా,మంగోలియా రాష్ట్రములందు జపాను చేసుకొనిన అక్రమణ ములను ఆదేశములు పూర్తిగా అంగీకరించినవి.
చీనా

రష్యాలో జారు ప్రభుత్వము అంతరించి కమ్యూనిష్టు రాజ్యము రాగానే చీనా కార్మికులకు కూడా పెద్ద ఉత్సాహ ము జనించినది.వారుకూడా కమ్యూనిష్టు పార్టీని యేర్పరచుకొనిరి.రష్యా కమ్యూనిష్టు ప్రభుత్వము జారు చీనా తో చేసుకొన్న ఒడంబడికలను,చీనాకిచ్చిన ఋణములను రద్దుచేయుట వలన వీరి ఉత్సాహము మినుమ డించినది. చీనా కర్మిక విప్లవమును సంపూర్ణ స్వాతంత్ర్యమును పోషించగలనని రష్యా ప్రకటించుటచేత వీరి ధైర్యము మరీ యెక్కువైనది.

ఇంతకుముందుచీనాజాతీయోద్యమమునందు పాల్గొనెడివారు మధ్యతరగతులవారు,విధ్యార్థులు,విద్యాధికులు మొదలుగాగల మితమగు అస్తిపరులైయుండిరి.కమ్యూనిస్టు పార్టీ లేచి సమ్మెలు,ప్రదర్శనములు చేయగానే వీరి అధికారములు కూడ వెనుక పడ్డది.దీని నఱిగట్టుటకై చీనాలోని సేనానాయకులు భాగ్యవంతుల తరపునవచ్చి తమలోతామును వీరితోకూడను పోరాడవలసివచ్చెను.ఇందువల్ల చీనా మరింత దరిద్రమయ్యెను.ఈ సమయము న సామ్రాజ్య ప్రతికూలపక్షమును జాతీయ విజ్ఞానపక్షమును చేతులు కలుపుకొని క్యూమిన్‌టాంగును ముట్టడించి బలపరచి శాంతి నెలకొల్ప బూనినవి.

క్యూమింటాంగులోనే రెండు శాఖలేర్పడినవి.ఒకటి జాతీయ శాంతివాద పక్షము,రెండవది సంపూర్ణ కార్మిక విప్లవ పక్షము.ఈ రెండునూకాక కమ్యూనుష్టుపార్టీ మూడవది

9
10
చీనా-జపాను

యేలాగనూఉన్నది.క్యూమింటాంగులో దక్షిణభాగము వారు జాతీయశాంతివాదులు;వామభాగమువారు విప్లవ వాదులు.దక్షిణ పక్షసహాయముతో వామపక్షమువారిని,కమ్యూనిష్టులను కూడా చాంగుకెయ్‌షేకు అణగ ద్రోక్కి సంపూర్ణ జాతీయపక్ష ప్రభుత్వమును నెలకొల్పబూనెను.1926 మే మాసములో అతడు కొంతవరకు విజయ ము నందెను.క్వాన్టంగు,షాంఘే జిల్లాలలో కార్మికుల బలము నాశనము చేయబడెను.నాన్‌కింగులోజాతీయ ప్రభుత్వము నెలకొల్పఁబడెను.

దక్షిణపక్షము యొక్క విజయమునకు కమ్యూనిష్టు పార్టీవారి కొన్ని చర్యలే కారణములు.ఆచర్యలను వార ప్పుడు అవలంబించవచ్చునా కూడదా అన్నది కొంతవరకు సందేహాస్పదమే.విప్లవమును నాలుగు గుఱ్ఱాలూ పూన్చి పరిగెత్తించుట ఆ సమయమున నీతివంతమగు కార్యంకాదు.అది ట్రాట్‌స్కీ సిద్ధాంతముల చొప్పున సవ్య మైనట్లు కనిపించినను స్టేలిను సిద్ధాంతముల ప్రకారము అపసవ్యమైనదే.ఈపరిస్థితులలో చీనా కార్మికులు చీనా జాతీయోద్యమమును పూర్తిగా విసర్జించుటకు వీలులేకుండెను. క్యూమింటాంగును వారు పూర్తిగా విసర్జించిరేని కర్షకబృందము వారి ప్రక్కన నిలువదని వారికి అధైర్యము కలిగెను.కర్షకులలో కూడ విప్లవ భావములు పూర్తి గా చెలరేగనిదే జాతీయేద్యమమును తూలనాడుట మంచిమార్గము కాదని కమ్యూనిష్టు ఇంటర్నేషనలు యొక్కయు, స్టేలిను యొక్కయు అభిప్రాయమైయుండెను.ఈ కారణముల వల్ల చీనా విప్లవ నాయకులు లేక క్యూమింగు టాంగు వామపక్ష నాయకులగు వాంగుచిన్‌వెయి మొదలగువారు దక్షిణపక్షముతో గట్టిగా పోరాడలేదు సరేగదా దానికి ప్రతికూలముగ కొందరు భూస్వాములలోను పూంజీదారులలోను దూరిపోయిరి.ఇట్టి చర్యలు మాత్రము అవకతవకవే యైనను ఈసమయమున మోటాయించి కర్షకశ్రేణిని విసర్జించుట సరియైన మార్గము కాదని అందరును ఒప్పుకొనుచున్నారు.

వూహానులో కమ్యూనిష్టు ప్రభుత్వము

చియాంగ్‌ కాయ్‌షేకు నాంకింగులో బూర్జువా ప్రభుత్వమును స్థాపించినను అది బలవత్తరముగా లేకుండెను. క్వాంగుటాంగు,షాంఘే జిల్లాలలోని కర్షక కర్మిక సంఘముల నణగత్రొక్కుటయే అతడు తన మొట్టమొదటి పనిగాబూనెను.

కర్షక కార్మిక సంఘముల యెడల నాతడవలంబించిన ఇట్టి ఘోరచర్యలు వారిద్వేషమును మఱింత బలపర చెను. వీరును విద్యార్థిసంఘములును కలసి వూహాన్‌ నగరమునందు 1927లో మరియొక ప్రభుత్వమును నెలకొల్పిరి.ఈప్రభుత్వము స్థాపించబడినప్పటి నుండియు కర్షకసంఘములు మరింత బలపడినవి. హూనాన్‌, హూపే జిల్లా కర్షకసంఘములో నున్న 800,000 సభ్యులసంఖ్య మే మాసము నాటికి,

11