చీనా - జపాను/చీనామిాద కన్ను

వికీసోర్స్ నుండి
46
చీనా-జపాను
♦♦♦చీనామిాద కన్ను♦♦♦

జపానులో కలిగిన నూతన పాశ్చాత్య జాతీయ చైతన్య మూలకముగా జపాను జనసంఖ్య హెచ్చినది;పరిశ్రమలు పెఱిగినవి; సైన్యములు యుద్ధనావలు వృద్ధియైనవి.జపానువారు నివసించుటకును బాగుపడుటకును క్రొత్తసీమ లు;సరుకులు చెల్లుటకు, ముడిపదార్థములు సంపాదించుటకు వలసరాజ్యములు; సైన్యముల పనికై క్రొత్త అవ కాశములు కావలసియున్నవి.జపాను ప్రక్కనున్న విశాలదేశము, అనేక అవకాశములను పూర్తిచేయు దేశము చీనా యైయున్నది.కనుక జపానుకళ్ళు చీనామిాద పడినవి.


చీనా ఇదివరకే అనేక పాశ్చాత్యప్రభుత్వములకు గుత్తయై యుండెను.చీనాలో కూడా ఇంతోఅంతో జాతీయ విజ్ఞా నము సోవియటు ఆసయములు మొలక లెత్తినవి. కనుక జపాను ఆశలు సఫలము కావలెనన అవతల పాశ్చాత్య ప్రభుత్వములను ఇవతల చీనాప్రజలను డీకొనగల సామర్థ్యము కావలసియున్నది. జపాను తన పారిశ్రామికాభివృద్ధిని సైన్యాభివృద్ధిని కూడ ఇందుకొరకే చేయుచున్నది.

చీనాయొక్క దక్షిణ మధ్యభాగములును పసిఫిక్కుదీవులును ఇదివరకే మంచి నాగరికత పొందియున్నవి. వీనిని లోబరచుకొన్నచో తక్కిన చీనా సులభతరముగా వశ్యముకాగలదు కనుక ఈ భాగములలోనే ముందు ప్రవేశింప వలెనని జపానులో ఒక తెగవారి అభిప్రాయము.ఈ పనికై
జపాను

పూనుకొన్నచో ముందుగానే అమెరికాతోను ఇతరవిదేశములతోను విరోధమునకు సిద్ధముగా ఉండవలెను. జపానులో యుద్ధమంత్రివర్గములన్నియు ఇందుకనుకూలములు.

రెండవవర్గము అనగా పారిశ్రామిక ప్రభువులును వర్తకశిఖామణులును చీనావాయవ్యభాగమును ముందు స్వాధీనము చేసుకొనవలెనని కోరుచున్నారు.ఈభాగములు సులభసాధ్యములు, ముడిపదార్థసంపూర్ణములు, మంచి కలప దొరకును.కనుక నౌకాశాఖవారు కూడ దీనికే అనుకూలముగా ఉన్నారు.రెండువర్గములవారి యొక్కయు పరంపరాశయము చీనానంతటిని తమ స్వాధీననందుంకొనుటయే.

వాయవ్యచీనాలో ముడిపదార్థములు చౌక, వస్తువులు యెక్కువ చెల్లును కనుక 1931కి పూర్వమే జపాను పెట్టుబడిదారులు అక్కడ అనేక బట్టలమిల్లులు, బొగ్గుగనులు, నూనెమిల్లులు మొదలైనవి పెట్టి లాభములు తీయుచుండిరి.మంచిహక్కులు సంపాదించి ఇదివరకే అభివృద్ధి పొందుచుండిరి.కనుక మంచూరియా సులభముగా సాధ్యము కావచ్చును. ఇది సాధ్యమైనచో అవతల రష్యాకు ఇవతల అమెరికాకు కూడ జపాను ప్రక్కలో బల్లెమై యుండును.

1894 నుంచి జపాను చీనాలో ఒక్కొక్కముక్కను తీసుకొనుచుండెను.ఆ సంవత్సరం డెసెంబరు మాసములోనే ఫార్మోజాను తీసుకొనెను.రష్యా అడ్దుతగులబట్టికాని మం 48
చీనా-జపాను

చూరియా స్వాధీనమై యుండేడిది.1904-5 రష్యా జపాను యుద్ధములో రష్యా ఓడిపోయినది కనుక క్వాం టంగున్ను తూర్పు చీనా రెయిల్వే(దీనినే తరువాత దక్షిణ మంచూరియా రెయిల్వే అనిరి)చాలా భాగము న్ను జపానుకు స్వాధీనమైనవి.దక్షిణ మంచురియా వీరి ఆటలకు ఆటపట్టు(స్ఫియర్‌ ఆఫ్ ఇన్ప్లూయెన్సు) అయి నది.ఈవిధముగా జపాను సామ్రాజ్యము యొక్క పలుకుబడి ఆసియాలో వృద్ధియైనది.గనుకనే 1934 లో జపాను తన మన్రోడాక్టరిను ప్రకటించగలిగినది.

ఐరోపాయుద్ధము ప్రకటించగానే జపాను జర్మనీ యొక్క చీనా వలస రాజ్యములగు వెయిహినీను, షాంటంగుల ను, తత్ర్పాంతములందలి రెయిల్వేలను స్వాధీనము చేసుకొనినది.చీనాలో జర్మనీని ఒకా జపానే ఓడించి తన సామ్రాజ్యము నీరీతిని పెంచుకొనినది.చీనా రిపబ్లికు ప్రెసిడెంటు యుఆనుషిలేయిని వశీకరణ మొనర్చుకొని అతనిని చక్రవర్తిని చేయబూనినది.ఇట్లుచేసినచో గ్రేటుబ్రిటను, అమెరికాదేశములు తననెదిరించలేరనిన్ని,అంతగా యెదిరిస్తే కాస్త సదుపాయములు చేసి ఊరుకో పెట్టవచ్చుననిన్ని జపాను ఉద్ధేశ్యమై యుండెను.

1915 లో జపాను కాళసర్పసంఘమువారు డిమాండులను పెట్టిరి.వీనిని అయిదు భాగములుగా విభజింప వచ్చును.మొదటిభాగము ప్రకారము జర్మనీని చీనా నుండి తొలగించవచ్చును.రెండవభాగము ప్రకారము దక్షిణ మంచూరి
జపాను

యానులోపలి మంగోలియాలో తూర్పుభాగమును జపాను స్వాధీనములో ఉంచుకొనవచ్చును.మూడవభాగము ప్రకారము చీనాలో ఉన్నపెద్ద ఇనుపగనులన్నియు జపాను స్వాధీనమగును.నాలుగవ భాగము ప్రకారము చీనా యొక్క దీవినిగాని, సింధుశాఖనుగాని, రేవునుగాని హార్బరునుగాని ఒక్క జపానుకే కాక యితరజాతికిని బాడుగ వేయరాదు.అయిదవ భాగము ప్రకారము చీనా యెల్లయు జపానుకు ఆర్థిక రాజకీయదాస్యము చేయు నట్లు బిగించును.

యుఆన్‌షి-కాయ్‌, ఈడిమాండులకు లొంగుదామా మానుదామా అని చాలాకాలము తటపటాయించెను.కాని ఈషరతులకు ఒప్పుకుంటావా లేక యుద్ధముచేస్తావా అని జపాను అంత్య సందేశమును పంపినప్పుడు అయిద వ భాగము డిమాండులకు తప్ప తక్కినభాగముల కన్నిటికిని యుఆన్‌షి-కాయ్‌ తలయొగ్గెను.ఈ అయిదవ భాగమునకైనను యుఆన్‌షి-కాయ్‌ మొగముచూచి జపానులొంగలేదు.బ్రిటను మొదలగు విదేశీప్రభుత్వముల నిర్బంధమొకటియుండుటచే ఇప్పటిమట్తుకు జపాను ఆషరతులను ఉపసంహరించుకొనెను.

1916 లో జపాను చీనాలో ఒక ఒడంబడిక చేసుకొనెను.దాని ప్రకారము విరోధులనెదిరించుట యందును, ఉభయుల సంరక్షణమునందును ఒకరికొకరు సహాయము చేసుకొనుటకును యుద్ధసామగ్రిని చేకూర్చుటకును ఒప్పుకొనిరి.ఈ

4
49
50
చీనా-జపాను
విధముగా చీనానిండా సేనలు, ఉద్యోగస్తులు మొదలగువారిని జపాను దించగలిగినది.యుద్ధానంతరమున జర్మనీ వలసరాజ్యమగు చీనాభాగములను చీనాకిచ్చివేయుదురను ఊహలతో చీనామిత్రవర్గమునకు 1,75, 000 మనుష్యుల సహాయమును ఫ్రాన్సు మెసపోటేమియా ఆఫ్రికాలకు పంపెను.కాని యుద్ధానంతరమున మిత్రవర్గమువారు చీనా కోర్కెను తీర్చక అంతకుముందే ఆ ప్రదేశములనాక్రమించుకొనిన జపాను తీసికొనుట కంగీకరించిరి.అయిరోపాయుద్ధము అనాధజాతులకు స్వాతంత్ర్యమును ఎల్లరకు స్వయం నిర్ణయపు హక్కును ఇచ్చునిమిత్తమే జరుపబడినదను ప్రారంభప్రకటలు నమ్ముకొని చీనా యుద్ధానంతరమున ఈ దిగువ అయిదు కోరికలను కోరెను.(1)చీనాలో వివిధ దేశముల లాభముకొరకు ప్రత్యేకప్రదేశములు కేటాయింపబడినవి.వీనిని స్పియర్సు ఆఫ్‌ ఇన్ఫ్లుయెన్సు అందురు.మరే దేశములోను ఇట్లులేదు గనుక వీనిని తీసివేయవలెను.(2)చీనాలో విదేశప్రభుత్వముల సేనలు పోలీసులు ఉండరాదు.(#)తపాలా, టెలిఫోను తంతిశాఖలు విదేశస్థుల స్వాధీనములో ఉండరాదు.($)చీనాలో విదేశీయులకు స్వదేశస్థులకు కంటె మించిన హక్కులు (ఎక్స్ట్రాటెర్రిటోరి యల్ రైట్సు) తొలగించవలెను.(5)విదేశస్థులాక్రమించుకొనిన ప్రదేశములను చీనాకిచ్చివేసి విదేశ వస్తువులపై చీనాకిష్టమై అనుకూలమైన రీతిని సుంకములను విధించుకొన నీయవలెను.ఈ కోరికలు చాలా న్యాయమైనవి, ధర్మమైనవే.కాని వీనిని
జపాను

గూర్చి ఆలోచించవలసిన అవకాశమదికాదని ఇవి త్రోసివేయబడినవి.

చీనాలో పాదుకొన్న తొమ్మిది విదేశ ప్రభుత్వములకును వారిలోవారికే పడకపోవుటచేత అందరూ కలసి చీనాకు సరీగా అభివృద్ధి చేతామనే మిషపెట్టి యెక్కువ సమరసగా లాభాలు పంచుకొనుటకై ఒకసభ 1921 సెప్టెంబరు 12వ తేది మొదలు 6-2-1922 వరకు వాషింగటనులో జరిపి ఒక ఒడంబడికకు వచ్చినారు.ఈసభలో పాల్గొ నిన తొమ్మిదిదేశములు అమెరికా సంయుక్త రాష్ట్రములు, గ్రేటు బ్రిటను, ఫ్రాన్సు,ఇటలీ, జపాను,బెల్జియము , హాలండు పోర్చుగలు, చీనా. దీని ప్రకారము చీనాకు ఒక స్వయంవ్యక్తిత్వమున్నదని అంగీకరించారు.నిజం గా చూస్తే జపాను చీనాను యెక్కడ యెక్కువ మ్రింగివేయునో అని కల్పించిన యెత్తే ఇది.జపాను ఈసంగతి తెలుసుకున్నది.జపాను ప్రధాని టనాకా అనునతడు 1926“తనాకా ప్రణాళిక”(టనాకా మేనిఫెస్టో)ను ప్రకటించె ను. చీనాలోను కొరియాలోను జపాను ప్రతికూల తిరుగుబాటులు జరిగెను.వీనిని సహించకే జపాను టనాకా ప్రకటనము చేసెనని కొందరందురు. మంచూరియాలో బలవంతముగా సైన్యమును దింపి ఆక్రమింపవలె ననియే ఈ ప్రకటన సారాంశము.1931 సెప్టెంబరులో మంచూరియా ముఖ్యపట్టణమగు మూక్డెను నగరమును జపాను తీసుకొని మంచూకో రాజ్యమును నిర్మించెను.బ్రిటనుకు ఇది 52
చీనా-జపాను

ఇష్టము లేకున్నను,జపాను యేవోకొన్ని సౌకర్యములను చేస్తా నన్నందువలన లిట్టను కమిషనువారు ఈ ఆక్ర మణమున కనుకూలముగానే 1932 లో తీర్పు వ్రాసిరి.చీనా పెద్దగోడ పొడవునను జపాను మిలిటరీ స్టేషనుల ను నిర్మించెను.తరువాత జహోలు, చాహారు రాష్ట్రములను తీసుకొనెను.ఈ విధముగా ఉత్తర చీనాలో జపాను యేటేటా యెంతోకొంత తీసుకొనుచునే యున్నది.జాతిసమితి దీనిని లీగ్‌ ఆఫ్‌ నేషన్సుకాస్త ఆక్షేపించినదను కారణమున జపాను సమితిని తృణీకరించి వెలుపలకు వచ్చి వేసినది.

1933 లో జరిగిన టాంగుకూ ఒడంబడిక ప్రకారము చీనా, మంచూరియాను జపానుకు అర్పించినట్లే. ఈ ఒడంబడిక షరతు లిదివరకు బహిరంగముగా ప్రకటనము కాలేదు.ఇందులో సంతకము పెట్టిన చియాంగు కాయిషేకు జపాను స్నేహము కొరకు చీనానెంతవరకు ధారపోసినాడో తెలియుట కష్టము.లోపల మంగోలియాలో జపాను ప్రవేశించుటకై యెత్తులు పన్నుచున్నది.ఇందుకై మంచూకోకు ఆదేశమునకు మధ్యనున్న 15000 చదరపుమైళ్ళ ప్రదేశము అనగా జెహోలు చాహారు జిల్లాలను జపాను స్వాధీనముచేసుకొనియే యున్నది.