చీనా - జపాను/కాంటనులో కమ్యూనిష్టు ప్రభుత్వము

వికీసోర్స్ నుండి
14
చీనా-జపాను

తోనో చేతులు కలుపుకొని వారిని అణచివేయుటకు సంకోచింపరని తేటయైనది.ఇందుకు తగినట్లు వారు కట్టు బాట్లు చేసుకొనప్రారంభించిరి.

కాంటనులో కమ్యూనిష్టు ప్రభుత్వము

1927 ఆగస్టు 1 వ తేదినాటికి ఈ ప్రయత్నములు పూర్తియైనవి.అనేకమంది జాతీయవిప్లవసేనా నాయకులు కూడా వీరిలోనికి వచ్చిరి.కమ్యూనిష్టు సేనానులు యేటిన్‌,హొలంగు అని వారలక్రింద ఈ సేనలు తిరగబడి క్యూమింగుటాంగు పక్షమును కియాంగ్స రాష్ట్రరాజధాని యగు నాంచాంగు నగరమున ఓడించెను. ఆరువారములలోనే క్వాంగుటంగు రాష్ట్రములో స్వాటోనగరము వరకును పోయి ఆనగరమునాక్రమించుకొనిరి. ఈసమయమున క్వాంగుటంగు కియాంగ్సీ రాష్ట్రముల సేనానులు తమలో తాము పోరాడుకొనుచుండిరి.దీని నాధారముగా గొని ప్రజలఉత్సాహము నూత చేసుకొని క్వాంగుటంగు రాష్ట్ర రాజధానియగు కాంతనులో వీరు కమ్యూనిష్టుప్రభుత్వము స్థాపించిరి.

డిసెంబరు 11 వ తేదిని వీరిమీద తిరుగుబాటు లేచెను.కాని కమ్యూనిష్టు పార్టీవారు మధ్యతరగతులవారినుండి ఆయుధములను పెరుకుకొనిరి.పోష్టు,టెలిపోను,టెలిగ్రాపు,పోలీసు బేరక్సు మొదలైన శాఖలన్నింటినీ తమ ఆధీనములోనికి తీసుకొనిరి.క్యూమింటాంగు ఆఫీసులన్నింటినీ కాంటనులోనికి
చీనా

మార్చివేసిరి. 12 వ తేదిని సుచావోచిన్‌ అధ్యక్షత క్రింద కాంటను సోవియటు ప్రభుత్వమును ప్రకటించిరి. సుచావోచిన్‌ దూరముగ నుండుటచేత చాంగుటెయిలే అను సేనాని ఆక్టింగు అధ్యక్షునిగా నియమించిరి;కాని ఇతనిని కూడ యెవరో హత్య గావించిరి.

తరువాత కాంటను కమ్యూను ప్రకటింపబడెను.దీనివల్ల వివిధసంఘములకు వివిధసౌకర్యములు ఈయబడినవి.

కార్మికులకు:దినమున కెనిమిదిగంటలపని, యెక్కువ కూలులు, పనివారల పనులను పనివారే తనిఖీ చేసు కొనుట, నిరుద్యోగులకు తాము ఉద్యోగములోనుండిననాడు తెచ్చుకొనుచుండిన సంపాదనలనుబట్టి నిర్ణయించ బడిన సహాయములు.విప్లవ ప్రతికూల ట్రేడు యూనియనులను రద్దుచేయుట.

కర్షకులకు:భూస్వాములకు భూమిలేకుండచేసి కర్షకుల కందరకును పంచిపెట్టుట, వడ్డీవ్యాపారస్థులకు వీరియ్య వలసిన ఋణములను రద్దుచేయుట, దుర్భరములగు పన్నులనుతీసివేయుట, గ్రామాలలోను జిల్లాలలోను సోవియటు సంస్థలను స్థాపించుట.

సిపాయీలకు:విప్లవపక్ష సైనికికందరికు భూములనిచ్చుట, వారి బసలు దుస్తులు ఆయుధములు మొదలగునవి మేలుతరములుగా చేయుట, వారి జీతములు నెలకు 12 నుండి 20 డాలర్లకు హెచ్చించుట కర్షకకార్మికుల రక్తవర్ణసేన(రెడ్‌ఆర్మీ)ల నేర్పరచుట.

15
చీనా

బూర్జువా, కమ్యూనిష్టు కలహములు

1928 మొదలు 1936 వరకు

1928 మొదలు 1936 వరకు చీనాలో కమ్యూనిష్టు, బూర్జువా పక్షములకు నిరంతర యుద్ధములు జరుగు చునే యుండెను.క్యూమింటాంగు లేక నాన్‌కింగు ప్రభుత్వమునకు చియాంగు కెయిషేకు అధ్యక్షుడు. తక్కిన పక్షములు కమ్యూనిష్టు నాయకుల అధికారము క్రింద ఉండెను.ఈపక్షములు దినదిన ప్రవర్థమాన శక్తియుక్త ములగుచుండెను.వీని నణచుటకు చియాంగుకెయిషేకు 9యుద్ధములకు తక్కువ కాకుండా ఒనరించెను. ఒకయుద్ధమునందును అతనికి జయము కలుగలేదు సరేగదా కమ్యూనిష్టు ప్రభుత్వము క్రిందికి అనేక జిల్లాలుజారిపోవుచుండెను.

మొదటి యుద్ధము

మొదటియుద్ధము 1930 అక్టోబరునుండి 1931 వరకును సాగెను.ఈయుద్ధములో చియాంగుకెయుషేకు స్వయముగా సేనలను నడిపించి మూడుమాసములలో విప్లవకారులను కలికములోనికి కానరాకుండా చేయుదునని ప్రగల్భములు కొట్టెను.కాని టంగుకూ యుద్ధములో అతను పూర్తిగా ఓడిపోయెను.1928 లో 10,000 సైనికులుగల కమ్యూనిష్టుసేన యుద్ధము తరువాత 62,000 వరకు ప్రబలెను.వీరిలో సగముకంటె యెక్కువమందియొద్ద ప్రశస్తమైన ఆయుధములు తుపాకులు ఉండెను. 2