చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/లక్ష్మీ - సరస్వతీ

వికీసోర్స్ నుండి

దొడ్లో ఆరవేసుకున్న మడిచీరకట్టుకొని పిండి రుబ్బుతున్నది.

మరి కాస్సేపటికి మొగుడు పొలం నుంచి యింటికి వచ్చి ముసుకు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూచి పక్కింటి విధవరాలనుకొని "ఏమే? అయ్యో పాపం! పక్కింటామెచేత పని చేయిస్తున్నావా?" అని ఇంటివేపు చూసి అడిగాడు. "అదేమిటండీ, అలాగంటారు! బామ్మగారిని కష్టపెట్టి పనిచేయించుకోటానికి నేనేం వెఱ్ఱి దాన్నా?" అంటూ ముసుగు తీసేసి భర్తవేపు తిరిగింది.

భార్య అవతారం చూడగానే భర్త

"ఒసే నీకు యిదేం పోగాలమే? నేను బ్రతికుందగానే బుర్ర గొరిగించుకు కూర్చున్నావు?" అంటూ గొల్లుమన్నాడు.

భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. "చాల్లెండి. ఎంత చేసినా యింతే మీరు. బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటిరి. సరే గదానని ఆవిడగారు చెసినట్లే నేనూ చేశాను. ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు?" అంటూ ఆ వెఱ్ఱిబాగుల భార్య కళ్లనీళ్లెట్టుకుంటి.

పాపమా బ్రాహ్మడు మళ్లీ గారెలు చెయ్యమని అడిగిన పాపాన పోలేదు.


చందమామ

జానకి, వసంత అక్క చెల్లెళ్ళు. ఒకసారి బొమ్మల పండుగ వచ్చింది. అక్క చెల్లెళ్ళిద్దరూ బొమ్మలను వరసగా పెట్టసాగారు. ఇలా పెడుతుండగా మధ్యలో ఏబొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది. జానకి సరస్వతి బొమ్మ పెట్టాలంది. వసంత లక్ష్మి బొమ్మ పెట్టాలంది. దాని మీద ఇద్దరికీ తగువు వచ్చింది. "లక్ష్మి కంటే సరస్వతి మంచిది," అన్నది జానకి. "కాదు సరస్వతి కంటె లక్ష్మే మంచిది," అన్నది వసంత.


పండిత జవజర్‌లాల్ నెహ్రూ
(మన భారతదేశపు ప్రధాన మంత్రి)