చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/నాగకన్య

వికీసోర్స్ నుండి

పూర్వం సింహళదేశానికి రాజొకడుండే వాడు,ఆయన పరాక్రమానికి అర్జునుడు, బుద్దికి బృహస్పతి, దానానికి కర్ణుడు. ఇన్నీ ఉన్నా ఆయనకు సంతానం లేదు. ఎందుచేతనంటే ఆయనకు వివాహం కాలేదు. ఎన్ని దేశాల రాజపుత్రికల్ని చూసినా ఆయనకు నచ్చలేదు.

ఇట్లా ఉండగా ఒకనాడు సింహళదేశానికి పర్షియాదేశపు వర్తకులు ఓడలపై వచ్చారు. వారిలో పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా చూసి ఏమన్నాడంటే. "మహారాజా! నా వెంట ఒకబానిస పిల్లను తెచ్చాను. ఆమెను మించిన సౌందర్యవతి ప్రంపంచంలో ఎక్క డాలేదు. మీకు ఆమె నచ్చినట్టయితే కోటి మొహరీలకు ఆమెను ఇచ్చేస్తాను " అని అన్నాడు.

రాజుగారు ఆమెను చూడటానికి ఒప్పుకున్నాడు. వర్తకుడు బానిసపిల్లను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు.ఆమెమేనాలో నుంచి దిగుతుండగా చూసి రాజు ఆమెను చూసి ఆమెనే తప్ప మరొకరిని పెళ్ళాడనని నిశ్చయించుకున్నాడు. కోటి మొహరీలు పుచ్చుకుని బానిసపిల్లను రాజాంతఃపురంలో వదిలి వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయినాడు.

రాజుగారు తన పెళ్ళికి శుభముహూర్తం పెట్టించి ఈ లోపుగా రాణిగారి కోసం సముద్రతీరాన దివ్యభవనం కట్టించాడు. అది తన భార్యకు భరణంగా ఇచ్చేశాడు. రాజుగారికిన్ని బానిసపిల్లకున్నూ అతి వైభవంగా వివాహం జరిగింది. కొత్తరాణిగారు తన భవనం ప్రవేశించింది.

ఇప్పుడు రాజుగారి ఒక దిగులు పట్టుకున్నది.రాణిగారు తనతో నోరుతెరచి ఒక్క ముక్క మాట్లాడదు. ఎప్పుడూ తన భవనంలో కూర్చుని సముద్రంవైపు చూస్తూ ఉంటుంది. భర్త వస్తే లేచి నిలబడదు. భర్తను గౌరవించదు.

ఒక సంవత్సరం గడిచిపోయింది. తనభార్య విచిత్రపు వర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించాడు కాని లాభం లేక పోయింది. ఆమె నోరు విప్పదు.

ఇంతలో రాణిగారు గర్భవతి అయి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఈ వార్త రాజుగారికేగాక దేశంలో ప్రజలందరికి ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే
భూలోకంలో ఏ రాజునైనా పెళ్ళాడమని నాకు మా వాళ్ళు సలహాయిచ్చారు.కానీ నేను మానవ

మాత్రులను పెళ్లాడటానికి ఎంతమాత్రమూ వొప్పుకోలేదు.

"ఇట్లా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదులాడుతుండగా కొందరు పర్షియాదేశపు వర్తకులు పడవలలోపోతూ నన్ను చూసి వలవేసి పట్టుకున్నారు.వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు.నాపేరు నీలోత్పల."

నీలోత్పల చెప్పిన కథ విని రాజు ఆశ్ఛర్యపోయి, "నువ్వు నాగకన్యకవా?రాజకుమార్తెవా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎందుకంటే,నువ్వు నాగకన్యకవైతే భూమిమీద ఎట్లా నివసించ గలిగావు? అని అడిగాడు.

 " రాజా, మేము మీలాటి మానవులము కాము. నీటిలోనూ నేలమీదకూడా నివసించగల దేవతలము.నీ కింకొక చిత్రం చూపుతాను చూడు," అంటు నీలోత్పల పరిచారికలను పిలిచి నిప్పూ, సాంబ్రాణి తెప్పించింది. నిప్పులో సాంబ్రాణి ధూపం వేసి ఏవో మంత్రాలు చదివింది. సాంబ్రాణి ధూపం నాలుగుమూలలా దట్టంగా అల్లుకున్నది. ఆ పొగలోనుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమైనారు. ఆ వచ్చినవారు నీలోత్పల అన్న అయిన నాగరాజు, అతని పరివరమునూ. వారంతా సముద్రంలో నుంచే వచ్చారు.
  నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణ్ అతనిచేతికిచ్చింది. నాగరాజు తన మేనల్లుణ్ణ్ చేతుల్లో తీసుకొని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమై పోయినాడు. నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణ్ తీసుకొని పారిపోయినాడని రాజుకు బయం కలిగింది. కాని కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో తిరిగివచ్చి, "మామాదిరిగా మా మేనల్లుడుకుడా నీటిలో నివసించగలడో, లేడో చూడడానికి తీసుకుపోయినాను. ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండటంచేత మాలాగే నీటికింద నివసించగలడు," అని చెప్పాడు.
  కొంతకాలంపాటు నాగరాజు తన బావగారైన సింహళ రాజు ఆతిధ్యం స్వీకరించి తరువాత తన చెల్లెలిని, మేనల్లుణ్ణ్ వెంట పెట్టుకుని నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం వారిని ఉంచుకుని తరువాత తిరిగి పంపాడు. నాగలోకంగురించి కుమారుడు చెప్పిన వింతలు వినటమేగాని అవి చూసే భాగ్యం సింహళరాజుకు లేకపోయింది. మేనమామల ఇంటినుండి రాజు కొడుకు చిత్ర విచిత్రమైన వస్తువులనూ, జంతువులనూ తెచ్చి తండ్రి కిచ్చేవాడు.
  ఈవిధంగా సింహళదేశపు రాజు, నీలోత్పలతోటి, తన కుమారుడితోటి ఎంతో కాలం సుఖంగా గడిపాడు.