కాశీయాత్ర చరిత్ర/పదియేడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

వేడుకగా వుంచున్నది. మధ్యే ఒక్కొక్క యెర్రవర్ణపు పూలున్ను సకృత్తుగా పూచియుంచున్నవి.

గోధుమలు, జవ అనే యవలున్ను వరిపయిరు వలెనే పెరిగి తోకవడ్లవలెనే యెన్నులు తీయుచున్నవి. గోధుమ యెన్నులు కురచగా నున్ను, గింజలు గుండు అందముగానున్ను జడ అల్లినట్టుగా వుంచున్నవి. యవయెన్నులు తోకవడ్ల యెన్నులకు అన్ని విధాలా సరిపోలి వుంటున్నవి. యీదేశపు గౌడ బ్రాహ్మలందరున్ను అభిని మందు, బంగాకు దాని జడలున్ను సహజముగా అంగీకరిస్తారు.

యీ గయా మహాక్షేతములో కాశివలెనే అడుగడుగుకు లింగాలు లేకపోయినా శానా గుళ్ళు తీర్ధాలకు నాలుగు పక్కలా వున్నవి. అందులో ముఖ్యముగా మంగళగౌరి యని వొక శక్తి గుడిన్ని గయాసురి అనే శక్తి గుడిన్ని వున్నవి. యీ రెండు గుళ్ళలో తామసారాధన లయిన బలిప్రదానాలు జరుగుచున్నవి. యీ మంగళ గౌరి యనే దేవిగుడి అష్టాదశ పీఠాలలో ఒకటి యని వాడుకుంటారు. యీ గయా మహాక్షేత్రములో ఫిబ్రవరి నెల 14 తేదివరకు వాసము చేసినాను.

పదియేడవ ప్రకరణము

ఫిబ్రవరి నెలె 14 ది మధ్యాహ్నము 12 ఘంటలకు ఆ క్షేత్రము వదిలి ప్రయాణమై లోగడి దారిగానె మళ్ళీ 12 తేది పట్నాషహరు ప్రవేశించినాను. నేను మైహరు అనే వూరు వదిలిన వెనక యీ నెల14 తేదివరకు యెక్కడా వొక చినుకయినా పడ్డది కారు. శివరాత్రి ముందు వెనకలుగా యీ దేశములో వర్షము కురియడము వాడికె గనుక సివరాత్రి ముందు వెనకలుగా యిక్కడ మంచివర్షాలు కురిశినవి. యీకాలమందు కురిశే వర్షము కూడా ఘనీభవించి రాళ్ళ వాన కురియడము కద్దట. ఆదేప్రకారము యీ చుట్టుపక్కలా తూర్పు గాలి సహితముగా రాళ్ళవాన కురిశినట్టు విన్నాను. ఆ రాళ్ళు భూపతన మయిన రెండు గడియలకు కరిగి పోవుచున్నవట. యీ వానలు యిక్కడికి గోధుమ వగయిరా పయిరులకు నిండా విరోధము. అకుటోబరు నెల ఆఖరు మొదలు ఫిబ్రవరి 15 తేది పర్యంతము చలియొక్క బాధ ఒకటేరీగిగా వుండినది. పిమ్మట చలిబాధ విడిచినట్టు తోచగానే యెండలు తీక్ష్ణము కాసాగినవి. యీ వాన కురియకపోతే చలి శుద్ధ ముగా నివర్తించునట. యీ వానవల్ల వైశాఖమువరకు వుదయకాలమందు కొంచము చలి వుపద్రవము వుంటూ వచ్చునని యీ దేశస్థులు చెప్పినారు. యెట్లా శీతము యెక్కునో, అట్లా యెండయున్ను ఆ కాలములో అంత యెక్కువగా వుంచున్నదనివిన్నాను. యీ వుష్ణకాలానికి భయపడి లార్డు వుల్లియం బెంటిక్కుగారు నెపాళ దేశములో వుండే సముద్రోదకానికి పైన 27000 అడుగుల పొడుగుగా యీ బ్రహ్మాండాని కంతా వున్నత పర్వతమైన హిమాలయ పర్వతానకు యెండకాలపు కాలక్షేపము కొరకు వెళ్ళినారు. ఫిబ్రవరి నెల 18 తేది మొదలు కొని మార్చి 4 తేదివరకు వర్షప్రతిబంధకము చేతనున్ను బజరా పుల్లాకులు అనే వాడలను కుదుర్చుకోవలసి సావకాశముగా పట్నా షహరులో వసించినాను.

మార్చి నెల 5 తేది సాయంతరము పట్నాషహరు వదిలి 14 దాండ్ల బజరా ఒకటి బంగాళాకు బాడిగె 112 రూపాయలకు కుదిరి వుండగా దానిమీద సహకుటుంబముగా సవారి అయి 70 రూపాయిల బాడిగెకు పుల్లాకి యనే పడవ వొకటి కుదిరి యుండగా దాని మీద బోయీలు, కళాసులు, డేరాలు మొదలయిన సామానులను యెక్కించి ప్రయాణమైనాను. హిందుమతము యొక్క బాహ్యపు చిన్నెలు చూచి హిందువులు తెలియక చెడిపోతారనే తాత్పర్యము యిప్పట్లో యీశ్వరాజ్ఞ వల్ల హిందువులను యేలే ఇంగిలీషు జాతివారికి నిష్కర్షగా తోచివున్నది. అటువంటి తాత్పర్యము వారికి కలగడము యీ సరికి నేను వ్రాసిన హేతువులవల్ల యెంత మాత్రమున్ను వింతకాదు. గండకెగంగాసంగమ ప్రదేశములో యిక్కడ హరిహరాదుల గుళ్ళు రెండువున్నవి. అక్కడ సంవత్సరానికి ఒకసారి మహోత్సవము జరిగి లక్షావధి ప్రజ వస్తు శ్రీ శైలనాధునికి సమమవునా శ్రీకాళహస్తి నాధునిన్ని యుక్తులు చెప్పి శైవవైష్ణవులు మొదలయిన హిందువులు వారలలో వారే పోట్లాడ సాగుతూ వుంటే 3000 ఆమడ దూరములో నుంచి వచ్చిన యింగిలీషువారు హిందువులను జూచి నవ్వక అంతస్తత్వము విచారించే వోపిక త్వరలో యెట్లా కలుగును! గనుక పూర్వీకుల తాత్పర్యము యీ కర్మోద్ధారణ విషయములో యేమైనదంటే నిప్పులో నీళ్ళు పుట్టినట్టయినది.

పట్నాషహరు వదిలిన వెనక మార్చి నెల 2 తేది మూంగేరి (మాంఘీర్) అని యిప్పుడు లోకప్రసిద్ధిగా వుండే పూర్వపు ముద్గలాశ్రమము ప్రవేశించినాను. గంగామహానది సర్పము నడిచినట్టుగా అనేక తిరుగుళ్ళుగా ప్రవహింపుచున్నది. మూంగేరి ముందుగా గంగ నడమ చిన్నతిప్పలు రెండు వున్నవి. ప్రవాహకాలమందు ఆ కొండతిప్పలు ముణిగిపోను గనుక పడవలకు గుర్తు తెలిశే నిమిత్తము వాటిమీద రెండు కొడిస్తంభములు నాటివున్నారు. మూంగేరి ఖసుబా కలకటరు వగైరా అధికారస్థులు వుండే స్థలము. సకల పదార్ధాలు దొరుకును. గొప్పయిండ్లు, ఒక చిన్న కోట కలదు. జాతులవాండ్లు కొన్ని బంగాళాలు ముచ్చటగా కట్టివున్నారు. యీ షహరులో నేమి యీ చుట్టు ప్రాంత్యాలలో నేను మూంగాచీర అనే పట్టు నారమళ్ళు నేశి మన దేశానకు రావడము; యీ బట్టలను మూంగేరి చీరలనడానకు మూంగాచీరలని అభావముగా ప్రఖ్యాతి అయినది. ఆ బట్టలు యుక్కడా శానా నయము.

యిక్కడ మాకు పడవతోశే మల్లాలకు కావలశిన భక్ష్యయోగ్య పదార్ధాములు పుచ్చుకొని సాగిపోయి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే సీతాగుండ ప్రదేశానకు సమీపముగా పడవలు నిలిపీ సవారీలతో రెండుకొసుల దూరము వెళ్ళి అక్కడవుండే సీతాగండదర్శనము చేశి స్నానపానాదులు చేసినాము. ఆ సీతాగుండము సుమారు 30 అడుగుల చదరముతో తిరుకొలను వలె కట్టివున్నది. వుదకము బహు నిర్మలముగా వున్నది. వుదకముకింద రాతిగొట్టు కొండరాతిలో వూటపుట్టి తిరుకొలనులో పెట్టివుండే తూముగుండా వుదకము బయట పారుతున్నది. తిరుకొలను వదిలి 100 బారల దూరము పొయ్యేదాకా వుదకము యొక్క వుష్ణము యెక్కువ గనుక చెయి నిండాసేపు వుంచ సహ్యముకాదు. తిరుకొలనులో వుదమము మీద పొగలు పారుతూ వుదకమునద్ది మెట్లను వుష్ణము చేయుచూ కిందమంట వేస్తే తపిలలోని వుదకము పొంగుతూ వుంచున్నది. లోకులు పూజార్ధము ఆ కొలనులో బియ్యము వేస్తారు. ఆ బియ్యము రెండు మూడు దినములకు నాని తూముగుండా బయిటికి వస్తున్నది గాని పచనము కావడము లేదు. యల్లీసు దొర కోడిగుడ్డును యీ వుష్ణోదకములో వుంచితే పక్వము కాలే దని వ్రాశినాడు.

యీ వుదకము యేప్రల్ నెలలో వచ్చే శ్రీరామనవమి మొదలుకొని యిక్కడా వర్షాకాలము ఆరంభమయి శ్రావనమాసము దాకా శీతకరముగా వుండి వర్షప్రదము కాగానే వుదకము మళ్ళీ వుష్ణము కాసాగి శీతకాలమునందు చెప్పితీరని వుష్ణమవుచున్నదట. యిక్కడ సంవత్సరానికి వకసారి అయ్యే వుత్సవములో బహు జనసమ్మర్ధము చేత మనిషి కాలుజారి ఆ కొలనులో పడితే చర్మమువూడి నాలుగయిదు దినములలో దేహమునకే అపాయము వస్తున్నదట. యిప్పట్లో ఆగుండములో నుంచి ముంచిన ఒక కుండ గంగలో సుమారు రెండు కుండల చల్లని గంగపోసి చల్లర్చి స్నానము చేసినాను.

ఆ తీర్ధానికి చుట్టున్ను రామగుండము లక్షమణగుండము అనే తీర్ధములు నాలుగు అయిదు కొలనుల వలెనే కట్టియున్నవి. వాటి వుదకము చల్లనే గాని, వుష్ణముకాదు. వాటి వుదకము వూటే గాని సీతాగుండమువలె వుదకము వుదకము నదివలెనే సదా స్రవింపుచు పారడములేదు. యీ వుష్ణోదకము కనిపెట్టకూడని వొక సువాసనగా వున్నది. అది నిండా మాధుర్యము లేకపోయినా పానానికి సహ్యముగా వున్నది. పానానంతరము నోరు కొంచెముగా పుల్లగా వుంచున్నది. స్నాన పానానంతరము ఒకవిధమయిన సువాసన మన దేహాన్ని అనుసరించి కొంతసేపు వచ్చే వుచ్చ్వాస నిశ్వాసాలతో తెలియవచ్చుచున్నది.

నల్సెటిర్ యేసిడ్ అనే గంధక ద్రావకము వుదకములో కలిసి తీసుకుంటే పుల్లగా వుంచున్నది గనుకనున్ను అగ్ని గంధకపు భూమిలో తనంతట పాషాణ సంబంధమయితే త్వరగా వుత్పత్తి కావచ్చును గనుక నున్ను లోకారాధ్యుడు మహానదులనున్ను, మహాపర్వతాలనున్ను అనేకముగా సృష్టించి నప్పటికిన్ని అటువంటి సృష్టికోటి చూచి ఒక వేళ తన అత్యద్భుత చర్యను తెలుసుకొలేక పోదురనే తాత్పర్యముతో యీ వుష్ణ గుండాన్ని తగుపాటి కారణాలను వుంచి సృష్టించినాడని తోచబడుచున్నది.

యీ వుష్ణగుండపు కధ: శ్రీరాములు రావణ బ్రహ్మహత్య పరిహారార్ధముగా ముద్గలాశ్రమమునకు సహకుటుంబముగా వచ్చి నట్టున్ను, అప్పట్లో తన లంకా నివాసదోష సందేహము అక్కడవున్న అనేక ఋషులకున్ను, అక్కడికి సమీపమందున్న తన తండ్రి అయిన మిధిలాపురనాయకుని కిన్ని నివృత్తి అయ్యేటట్టు పాతాళమందు వుండే బాడబాగ్నిని తెప్పించి సీతాదేవి తాను ప్రవేశమై బయిటికి వచ్చి నట్లున్ను, ఆ అగ్నివల్ల యీలోకానకు బాధలేకుండాపిమ్మట అక్కడ తదుపరి వుదకప్రవాహాన్ని సృస్టించినట్టున్ను తద్వారా అద్యా ఆ వుపి ఉదకము వుష్ణకరముగా వుండేటట్టున్ను చెప్పుతారు.

రామకృష్ణాద్యవతారములు అబద్ధములు కావు గనుకనున్ను, వారు పరబ్రహ్మ స్వరూపు లనడానకు యేమాత్రము సందేహము లేదు. గనుక నున్ను తమమహిమలు లొకములో ప్రసిద్దిగా వుండేకొరకు యిటువంటి యాశ్చర్యకరము లయిన విషయాదులు కలగచేసినా కలగజేసి వుండవచ్చును.

యీ స్థలమందు వసించి ఆమరునాడు జాంగీరు అనిన్ని, జాంగరాబాదు అనిన్ని చెప్పబడే గొప్పబస్తీ యయిన గంగ వుత్తరవాహినిగా ప్రవహింఛే పుణ్యస్థలము ప్రవేశించినాను. యీ వూరు కలకటరు మొదలయిన అధికారస్థులు వసించే జిల్లా కాకపోయినా నీలిమందు చేసే యింగిలెషు దొరలు గంగాతీరమందు అక్కడక్కడా మిద్దెలు వగయిరాలు కట్టుకొని యీ ప్రాంతముల అనేకులు వుండేటట్టు యిక్కడా కొందరు వసించి యున్నారు. యిది గొప్పవూరు. మైధిలి కాన్యకుబ్జ బ్రాహ్మణులు యిండ్లుకట్తుకొని తీరవాసు లయి యున్నారు. వంటి సిద్ధులకు నిమిత్తములయిన వస్తువులను స్వాధీనము చేసుకోవలనని వృధా ఆశపడి నిమిత్తము మాలిన భ్రమప్రమాద మైన పనులు చేయడము అతి వ్యర్ధమని నిశ్చయము చేసినాను.

యీ దాతా వైధ్యనాధ స్వరూపముగా వుండే పరమాత్మునికి శివరాత్రి దినమున సపాదలక్ష అనే లక్షాయిరువై అయిదువేల గంగ కావిళ్ళకు తక్కువ లేకుండా లొకులు తెచ్చి కామ్యార్ధముగా అభిషేకముచేస్తే యిష్టసిద్ధి అవువున్నదని యీ హిందూస్తాన్ లో బహు ప్రసిద్ధి. ఆ పంచకావిళ్ళు యేదే దంటే గంగోత్తరి, గంగా సాగర సంగమము కావిళ్ళు రెండు; హరిద్వారమువద్ద యెత్తే గంగకావడివొకటి; ప్రయాగలో యెత్తే కావడి వొకటి; యీ జాంగీరువద్ద యెత్తే గంగకావడి వొకటి; అంతు కావిళ్ళు అయిదు.

యీదాతావైద్యనాధస్థలముయొక్క కధయేమంటే పూర్వకాలమునందు రావణాసురుడు కైలాసానకు వెళ్ళి శివుణ్ని నాలంకలో నీవు వసించవలనని ప్రార్దించి నట్టున్ను శివుడు మంచిదని ఒకలింగములో మూర్తీభవించి నన్ను దిగువపెట్టకుండా నీలంకకు యెత్తుకొని పొమ్మని చెప్పినట్తున్ను విష్ణువుకు యీ వర్తమానము తెలిసి లోక సంరక్షణ పనికి నియమింప బడ్డ వాడు గనుక యీ తామసగుణ ప్రధానడయిన రావణుని సమీపమందు శివుడు వసిస్తే వీడు మరీ శివప్రసాదము కలిగే కొద్దిన్ని సాధులను బాధపెట్టు ననే భయముచేత వుదకాధిపతి అయిన వరుణుని ప్రేరేపణ జేసి రావణుడు యీ జాంగీరువద్ద గంగ దాటి అడివి మధ్యే పోతూవుండగా రావణునికి జలబాధ బహుశా కలిగేటట్టు చేసి తాను వృద్ధ బ్రాహ్మణుని వేషము వెసుకొని ఆ లింగము తీసి వుంచుకొని రావణుడు జలబాధ నివృత్తి చేసుకుని వచ్చేలోపల ఆ అరణ్యములో పెట్టి వెళ్ళీనట్టున్ను ఆ లింగాన్ని పెల్లగించడానికి శక్తిలేక లంకకు వెళ్ళిపోయినట్టున్ను, పిమ్మట వైద్ది అనే గోపాలకుడు కాళహస్రి కన్నప్పవలెనే అతిమూర్ఖమయిన భక్తితో ఆరాధన చేశినట్తున్ను ప్రసిద్ధి గలిగి యున్నది. ఆ స్త్ఘలము చుట్ట్లున్ను అడివి బిల్వ మయముగా వున్నది. యీ దేశములోనున్ను ముఖ్యముగా బగాళీలున్ను, యెండకాలములో బిల్వపండ్లు షర్బత్తుచేసి బహుశ: తాగుతారు. ఈ దేశపు బిల్వపండ్లు బహు గొప్పలుగా వున్నవి. పండిన వెనక బహుమాధుర్యముగా వుంచున్నవి. యీ బిల్వపండలు నిమిత్తము బిల్వచెట్టుకు బహుకట్టు చేశియున్నారు. యీ చెట్ల కిందికి మనుష్యులను పోనివ్వరు. యీ జాంగీరువద్ద నొక తోటలో బిల్వచెట్టు పనసచెట్టు కాచివుండగా నా మనుష్యులు పనసాకులు కొయ్యపోతే పనసచెట్లనువిరచినా సమ్మతించినారుగాని పూజకు రెండు నిల్వదళములు కొయ్యనిచ్చినవారు కారు. యీ జాంగీరు స్థలములో అమావాస్య ఆదివారము ఘటనమైనది గనుక ఆ దినమునకు మరునాడు అమావాస్య సోమవార వ్రత మిక్కడనే గడిపి సోమవారము మధ్యాహ్నము బయలుదేరి సాగివచ్చినాను.

మార్చి నెల 16 తేది కహలుగాం అనే గొప్పవూరుచేరినాను. యీ వూరివద్దను గంగమధ్యే రెండు చిన్న కొండలున్నవి. ఆకొండల మీద మానుషసంచారము లేదు. అడివి పెరిగియున్నది. ఈ వూళ్ళో అన్ని పదార్ధాలున్ను దొరుకును. మయిధిలి బ్రాహ్మణులు, కనోజాబ్రాహ్మణులు 40 యిండ్లదాకా యున్నారు. కరివేపాకు మన దేశము వదిలిన తరువాత అక్కడక్కడ ప్రయత్నముమీద దొరుకుతూ వచ్చినది. ఈ వూరిలో ప్రతిపెరటిలోనున్ను కరివేపాకుచెట్లు కొల్లగా వేసి యున్నారు. కొత్తమల్లి మనిషిపొడుగున యీ దేశాములొ గడియ దూరము దాకా పరిమళింపుచు పయిరు అవుచున్నరి. యీ ధనియాలు కునుంబా చెట్లతో కలిపి అభిని చెట్లతొ కూడా నున్ను ప్రత్యేకముగా పొలాలలో నున్ను చల్లుతారు.

మూంగేరి మొదలుగా గంగకు యిరుపక్కలలో పర్వత దర్శనము అవుతూ వున్నది. బజారాలో వచ్చేటప్పుడు ఆ పర్వతాలు వొక పక్క నుండేవయినా నాలుగు పక్కలా తిరుగుతూ వుండేటట్టు స్థిరముగా నుండే సూర్యుడు భూచలనముచేత వొక పక్కనుండి వక పక్కకు వచ్చేటట్టుతోచే లాగు అగుపడుచున్నది. జాంగీరునుంచి కహలుగాముము వచ్చేలోపల భాగల్పూ రనే జిల్లాకసుబా గొప్ప షహరు వొకటి వున్నది. అక్కడ కలకటరు మొదలయిన అధికారస్థులు నివాసముగా వుండి వున్నారు. ఆ వూరి వద్ద నుండే గంగాధార యీ దినాలలో లోతు చాలనందున ఆ వూరికి వుత్తరముగా వుండే పద్ద ధారలో యీ బజరాలు వస్తున్నవి గనుక దూరపుదృష్టి మాత్రము ఆ వూరిమీద కలిగినది. యీగంగధారలను యీ పడవవాండ్లు దరియ్యా లంటారు. జలధార తక్కువయితే యె దరియ్యా మరుగయా అంటారు.

17 తేది గురువారము పడమటిగాలి అనుకూలముగా కొట్టి నందున యీ దినము వుదయము మొదలు అస్తమానము లొపల 24 కోసుల దూరము మా బజరా సాగి వచ్చినందున రాజా మహాలు అనే గొప్ప వూరు చేరినాము. యీ వూరిలో నీలిమందు చేశే దొరలు మాత్రము నివాసముగా వున్నారు. యీ వూరివద్ద గంగలో రాళ్ళు వున్నవి. పడవలు జాగ్రత్తగా రావలసినది. యీ వూరు తోపులు, తోటలతో నిండి వున్నది. వొక మశీదు వున్నది. అది తురకల భక్తిని ఆకర్షించే పాటిగా పురాతముగా వుండి వున్నది. పూర్వికపు రాజులు *కట్టినది వొక నల్లరాటి మహలి శిధిలమై యున్నది. సకల పదార్ధాలు దొరుకును.

పట్నా అనే షహరు విడిచిన వెనక శోధన చూడవలెననే వేషముతో సుంకపు చౌకిదార్లు యెవరున్నూ మా బజరాలవద్దికి చిన్నపడవలు వేసుకొని రావడములేదు. వారిని యిక్కడి కష్టం కలకటరులుపోయి వస్తూవుండే పడవలను నిండా తొందరపెట్టకుండా తాకీదు చేసినట్టు తోచుదున్నది. సుంకపువాండ్లు యీ దేశములో లోకులను చేసేతొందర అధికారస్థు లయిన దొరలకు తెలుసును. కాశిలో వుండే బ్రూక్కుదొర యీప్రసక్తి నాతో మాట్లాడే టప్పుడు ఈలాగే మాదేశమైన యింగిలాండులోనున్ను సుంకపువాండ్లవల్ల తొందర కలిగి


  • ఔరంగజేబు చక్రవర్తి సోదరుడు షూజా క్రీ.శ. 1630 లో దీనిని కట్టె నని బిషప్ హెబరు వర్ణించినాడు. వున్నది. వీరికి అధికారము యివ్వక విధిలేదు. యిచ్చినందువల్ల లోకులకు హింసగా వున్నదని వ్యసన పడుకున్నాడు.

యు దేశములో బంట్రౌతులు మొదలుగా గల శిరస్తా వుద్యోగస్థుల వరకు జీతములు బహు స్వల్పము గనుక లోకులవద్ద లంచాలు నిండా తీస్తారని గయా మేజస్ట్రేటుదొర మేస్తరు జాకుసన్ దొరతో మాట్లాడునప్పుడు ప్రసక్తివచ్చి అప్పుడు వారి చెప్పినది యేమంటే; పిడికిళ్లతో యెత్తి యీ దేశములో అధికారస్థులకు లోకులు లంచాలు యిచ్చేవాడికె పడియున్నందున జీతాలు మీ దేశమువలె యెక్కువచేసినా అధికారస్థులు అడకక పోయినా వాడికె ప్రకారము లొకులు తెచ్చియివ్వలసినదాన్ని యిస్తూ వస్తున్నారు గనుక అప్పట్లో కుంఫిణివారికి యెక్కవజీతము యిచ్చేనష్టము ఒకటేగాని యెవరికి క్షేమముండ నేరదని చెప్పినాడు. బరకందాసు అనే వొక ఠాణాబంట్రౌతులకు యిక్కడ జీతము నెల 1 కి నాలుగురూపాయిలు. వాడి గుర్రము వగయిరాలకు మాత్రము నెల 1 కి 10 రూపాయలు సెలవు వుంటూ వున్నది. యిక్కడ జిల్లామేజస్ట్రేటు నాజరుకు సుమారు నల 1 కి నూట్కి తక్కువలేక వస్తూవున్నది. హిందుస్తానులో జుడైసైయాల్ లయనులో నల్లవాండ్లలో నాజరు వుద్యోగము సర్వోత్తమ మని నిశ్చయిముచేసినాను.

యిక్కడ సకల కచ్చేరలలోనున్ను లెక్కలు వగయిరా వ్రాసే భాష ఫాషీన్. యింకా యిక్కడా వ్రాశే అక్షరములు శానా విధములుగా వున్నవి. ఒకరికి వ్రాయ చదవ తెలిసినది మొరొకరికి తెలియదు గనుక జాబులు మూలకముగ పనులు జరుగడము ప్రయాస. ఫార్శి లిపిమాత్రము సర్వమధ్యస్థముగా వున్నది. యిక్కడ వ్రాశే లిపుల ఖుల్లసు యేమంటే మహాజని యని సాహుకార్ల లిపి వొకటి. బ్ర్రాహ్మణీ అని బ్రాహ్మలు గ్రంధాలువ్రాశే లిపి ఒకటి, మోడి అనే మహారాష్ట్రపు లిపివొకటి, మారువాడి అని మారువాడీలు వ్రాసే లిపివొకటి. ఇంకా కొన్నిలిపులు వున్నట్టు తోచుచున్నది. మగధ దేశములో మాగధి అని వొక భాష గయావళీలు అంతరంగముగా మాట్లాడు కొంటారు. యీగయావళీలేమి, యీదేశపు పంచగౌడ బ్రాహ్మణులేమి వారి వటువులకు యెనిమిదో సంవత్సరమున వుపనయనము క్రమముగా చెస్తారుగాని ఆచిన్న వాండ్లచేత అటుతర్వాత త్రికాలములను సంధ్యవార్పింఛే జాగ్రత చెయ్యడములేదు. వివాహాదులు నాలుగు దినముల దీక్షతో చేస్తారు. నిశ్చితార్ధము మాత్రము కొన్ని నెలలకు ముందే చేసివుంచుతారు. ప్రవేశ హోమము శేషహొమము పాణిగ్రహణము యీ ముఖ్య కృత్యములు కద్దు. మంగల్య ధారణము మొదలయిన లౌకిక లాంచనలు దక్షిణదేశము వలెనే నడవడము లేదు. జాతా శౌచాదులు శృతి స్మృతి ప్రకారము ఆవరించుతారు. గంగకు సమీపప్ర్రాంతములందు వశించేవారు, యెవరు దేహము వదలినా దేహమును యథోచితముగా కర్మ నిమిత్తము తప్తముచేసి గంగలో విడిచిపెట్టుతారు. కర్మ ప్రసక్తి లేనివారి దేహములు వొక నిమిత్తము లేక గంగలో విడిచి పెట్టడమే ముఖ్యముగా జరుగుచున్నది.

యిక్కడి పంచాంగాలలొ గ్రహ దృష్టులు సాధించి వ్రాయుచున్నారు. తిధివార నక్షత్ర యోగకరణాదులు దక్షిణదేశపు పంచాంగానికి గడియ యెచ్చు తక్కువగా సరిగా వుంచున్నది. పంచాంగాలలో వివాహోపనయన ముహుర్త విచారణ బహుశ: లోకులు చేయుచున్నారు. శివాలిఖిత మని వొక ప్రయాణ ముహూర్త నిర్ణయ గ్రంధమున్నది. దాని ప్రమేయము సాంబమూర్తి త్రిపుర పరిహారము చేయబోవు నప్పుడు తలచిన కాలమందు ముహూర్తము దొరికేటట్టు ఆ గ్రంధము లోకోపకారముగా చేసినాడట. జాతక సంవత్సర ఫలాలు గొప్ప వారికి జ్యోతిషికులు వ్రాయిస్తూ వస్తారు.

కాశీప్రయాగలొ దక్షినదేశస్థులేమి, యిక్కడి ఉత్తర పశ్చిమ తూర్పు దేశస్థులేమి అనేక ధర్మాదులను కాశీతంబురాయడి అధీనముగా దక్షిణదేశస్థులు కాశీ మొదలయిన ధర్మాదులను చేసినట్టు చేసి అనేక గుమాస్తాలగుండా నడిపిస్తూ వుండేది. నడుస్తున్నదా లేదా అని సర్కారుతరపున విచారణలేదు.

దక్షిణదేశపు సౌరమాన చాంద్రమాన నక్షత్రమానాలకున్ను, విశ్వాసములు కలవారు గనుకనున్ను, కలకత్తా దేశమునుంచి నూరార్లు నావాలు వేసుకొని నా యెదట యిప్పుడు వస్తున్నారు గనుక యెక్కడ రాత్రిళ్ళు దిగినా ఐదారు నావాలు నాతో కూడా దిగుతూ వస్తున్నవి. యీ ప్రాంతములలో రాత్రిళ్ళు వావాలు ఒంటిగా మనిషి కట్టు తక్కువగా దిగి వుంటే దొంగలు తెలివిగా వుండే కిస్తీలు అనే నావాలమీద వచ్చి కొళ్లపెట్టుక పోతారని వాడుకుంటారు. యిప్పట్లో అటువంటి దుర్మార్గములు శానా మట్టుపడ్డట్టు తోచబడుచున్నది.

లోగడ వ్రాశినంతలో శాస్త్రయుక్తిచోదిత మయిన ద్వైతమతము ప్రసిద్ధముగా మధ్వాచార్యులవారు వుద్ధరించి దక్షిణ దేశములొ బహుమందిని తదనుష్టానపరులుగా నున్ను యేర్పరుచుకున్నట్టు యీ దేశములో యెవరినిన్ని లోపరుచు కో లేదని వ్రాసుకుని వుంటిని. గయామహాక్షేత్రము ప్రవేశించిన వెనక గయావళీల మతము విచారించగా వారు మధ్వమత ప్రవిష్టులుగా నున్ను దక్షిణ దేశపు సత్యపూర్ణ పీఠపు శిష్యవర్గముగానున్ను తెలియవచ్చినది.

యీ గయావళీలు మాత్రము యింత దేశములో మధ్వమతానికి లోబడ వలసిన కారణ మేమని విచారించగా వాయుపురాణ ప్రకారము యాగార్ధమై వీరు బ్రహ్మ కల్పిత బ్రాంహ్మణులు గనుక నున్ను ధర్మప్రజా వృధ్యర్ధం వర్ణాంతర స్త్రీలను పరిగ్రహించి నారు గనుకనున్ను యిక్కడి బ్రాంహ్మణ మండలి యీ గయావళీలను తమ సముగాయములో కూర్చుకొక గయాప్రజనకాలములలో మాత్రము వాయుపురాణ ప్రకారము వీరిని తగురీతిని ఆరాధనచేయుచు నుండగా మధ్వమత ప్రకటనార్ధము యేనూరేండ్లకిందట మధ్వమతొద్ధారకులు యీ దేశమునకు వచ్చినప్పుడు అందరికి యిక్కడా వెలిగావున్న గయావళెలు అందరున్ను యిక్కడ అనంగీరారము చేశిన మతాన్ని అంగీకరించి తమంతట తాము యిక్కడ వొక ప్రత్యేక మతానుసారులుగా వుండడము యుక్తమని నిశ్చయము చేశి మధ్వమత సంకేతాలకు అన్నివిధాలా అప్పుడు లోపడినారు. మతోద్ధారకులు ద్రావిడాచారాలు యావత్తు వీరికి బోధచేసి తదారభ్య ద్రావిడాన్నము భోజనము చేసేటట్టు వీరికి యిచ్చను కలగచేసినారు. ఆ యిచ్చమాత్రము యిప్పుడు నిలిచి వున్నది గాని, వారు బోధ చెసిన ఆచార వ్యవహారాదులు యీ దేశాస్థుల సాంగత్యము చేత క్రమక్రమశ: ఖిలపడుతూ వచ్చినది.

వాయుపురాణ ప్రకారము గయావళీలను గయావ్రజనక్రియలు చేయడములో ఆరాధన చెయవలసినది అగత్యము గనుకనున్ను, ద్రావిడాచార ప్రకారము పిండప్రదానాత్పూర్వము అన్నశ్రాద్ధము చేయడము ముఖ్యము గనుకనున్ను, గయవళీలు ద్రావిళ్ళు పచనము చేసిన అన్నము భోజనము చేసేటట్టు సమ్మతించినారు గనుకనున్ను, చటకము మొదలైన శ్రాద్ధాలు చేసి గయావళీలకు ఆమం మొదలైన భక్ష్యయోగ్య వస్తువులు యిచ్చే టంతకన్నా అన్నశ్రాధ్హానికి గయావళీలను బ్రాహ్మణార్ధము చెప్పేటట్టు దక్షణ దేశస్థులు నిశ్చయము చేసినారు గాని యేకారణము చేతనున్ను గయావళీలు పక్వము చేసిన అన్నమును ద్రావిళ్ళు వుచ్చుకునేటట్టు సమ్మతించినవారు కారు. తదారభ్యగయావళీలు ద్రావిళ్ళవల్ల యీపాటి జరిగే గౌరవమును కాపాడుకోవలసి ద్రావిడ దేశస్థులు భోజనము చయ్యకనుండేవారి చేతి పక్వాన్నము తామున్ను భుజించకుండా ద్రావైడాచార ప్రకారము నడిచేవారమని అభినయిస్తూ కాలము గడుపుతూ వస్తున్నారు. యాభై అరవై యేండ్ల క్రిందట సత్యూపూర్ణ పీఠస్థులు యీ ప్రాంతముల చచ్చివుండి గయావళీలకు నమాశ్రయణము చేసి పూజగైకొని పోయినారు. యిప్పుడున్ను పునా శ్రీమంతుడు మొదలయిన గొప్పవారి గయావళీలు మాత్రము యధోచితముగా యజమాన ప్రీత్యర్ధమై బ్ర్రాహ్మణ నిత్యకర్మలు జరుపుకుంటారు.

పద్దెనిమిదవ ప్రకరణము

మనలో పేరుగలిగిన యాభై ఆరు చేశాలు వాటి ఛెప్పన్నభాషలున్ను యీ బ్రహ్మాండములో యేపక్క వున్న వని విచారించగా నేను చేసిన దేశాటనముచేత నాకు కలిగివుండే స్వానుభవము చెతనున్ను, నా వినికిడి వల్లనున్ను, నేను నిశ్చయము చేసినది యేమంటే ఆ దేశాలంతా కర్మద్వారా బ్రహ్మానుసంధానము చేసే 'యిండి