అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/ఆగిన తెలుగు వెలుగు చిరస్మరణీయసేవలు

వికీసోర్స్ నుండి


చరిత్రగా మిగిలింది

సన్నిధానం నరసింహశర్మ 92920 55531


ఆగిన తెలుగు వెలుగు చిరస్మరణీయసేవలు

బావుటా చేబట్టిన ఈనాడు సంపాదకులు సుప్రసిద్ధులు శ్రీ రామోజీరావు


ఒక పని ఆగితే ఒక వ్యక్తికి నష్టం కావచ్చు,

ఒక పని అగితే ఒక సంస్థకు నష్టం రావొచ్చు.

కానీ ఒక పది మందికి అవసరమైన పని ఆగితే యావత్తు సమాజానికీ నష్టం- పూడ్చలేని నష్టం ప్రస్ఫుటమవుతుంది. రామోజీ ఫౌండేషన్‌ వారు కొన్ని ప్రమాణాలతో నడిపిన 'తెలుగు వెలుగు” అగిపోయిందన్న వార్త చెవులబడినప్పుడు - భాషా సాహిత్యాభిమానులు అ సామాజిక నష్టాన్ని అనుభూతిచెందారు.

చతుర, విపుల నవలాసాహిత్యానికి, కథాసాహిత్యానికి అనువాదాలకు చేసిన దోహదం అసామాన్యమైనది. 1978 నుండీ కొనసాగి అవి ఇప్పుడు ఆగాయి.

ప్రొద్దుటే లేవగానే సూరీడునీ ఈనాడునూ చూడకపోతే ఇదై పోయేవారు అసంఖ్యాకులు. రామోజీరావుగారి దార్శనిక దృష్టివల్ల, వ్యాపార సృజనాత్మకతల వల్ల రాష్ట్రంలో వేలమందికి ఉపాధి ఏర్చడడం మరువరానిది. క్రొత్తగా “బాలభారతం” అని పిల్లల పత్రిక పెడితే అది లక్షా యిరవై వేల పైబడి పంపిణీ స్థాయికి ఎదిగిందంటే శ్రీ రామోజీరావు మార్గర్శకత్వం, అంకితభావాలు గల ఆయన సహచర ఉద్యోగుల శ్రమతత్వం ఎన్నో ఆంతరంగీకంగా ఉన్నాయి. ఒక పెద్ద నిఘంటువును తెలుగు జాతికి అందించాలని లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఒక అవిచ్చిన్న భాషా సేవ కొనసాగిస్తున్న శ్రీ రామోజీరావు గారి పాత్రను మరువలేం.

వ్వవసాయ ప్రధానమైన, అన్నపూర్ణకి అక్షయపాత్ర వంటి అన్నదాత పత్రికను ప్రదానం చేసిన క్రొత్త చూపు శక్తి- శ్రీ రామోజీరావుగారిది.

బాలబాలికల్లో సృజనాత్మక పెంపుదలకు, ఆహ్హాదాన్ని కలగజేయడానికి, అధునిక వైజ్ఞానిక సమాజ అనుగుణ ఆలోచలనలను పెంపొందించడానికి పిల్లల పత్రిక- “బాలభారతం'ని అభివృద్ధిపరిచారు. అదీ కాలీన పత్రికా జీవనపరిస్థితులను బట్టి ఆగిపోయింది.

ఎంత మందికో బ్రతుకుదన్నులిచ్చిన పత్రికలుగా ఆగిపోవడం తప్పని పరిస్థితుల్లోనే అయినా ఆ ప్రభావం ఎన్నో కుటుంబాలపై పడింది.

కొన్ని దినపత్రికలలో వివిధ సాహిత్య శీర్షికలు ఏదో ఒక రోజైనా వారపు విందులు చేస్తున్న సందర్భంలో ఈనాడులో అటువంటి సాహిత్యపు పుట లేదని లోటుగా సాహితీజనులు కొందరు అనుకోవడం ఉండేది. అటువంటి సందర్భంలో ప్రత్యేకంగా “తెలుగువెలుగు” అనే భాషాసాహిత్య పత్రికను శ్రీ రామోజీరావుగారు ప్రధాన సంపాదకులుగా కొన్నేళ్లు ప్రామాణిక పద్ధతుల్లో నడపడం తెలుగు పత్రికా చరిత్రలో ఒక మహాదర్శం. తెలుగువెలుగు ఆయన కలల వెలుగు. ప్రణాళికాబద్ధంగా ఆలోచించి 2012 సంవత్సరంలో సెప్టెంబరు తొలి సంచికగా ప్రారంభించి, 2021వ సంవత్సరం మార్చి సంచిక వరకూ నిర్వహించారు. 103 సంచికలు సర్వాంగ సుందరంగా తెలుగు నాట మూడు ప్రాంతాల ప్రాతినిధ్యమూ సహజంగా ఉండేల చూసుకుంటూ నడిపారు. శతాధిక మాస భాసమైన ఈ తెలుగు పత్రికా ప్రస్థానంలో ఎన్నో శక్తిమంతమైన రచనలు! ఆసక్తి


తెలుగువెలుగు తొలి సంచిక

సెప్టెంబరు 2012

పెంచే శీర్షికలు. ధారావాహికలతో శిరోభార రచనలు కాకుండా నిత్యనూతన ఆలోచనలతో తెలుగు వెలుగు విజ్బంభించింది. అది 60వేల ప్రతుల పంపిణీకి ఎదిగింది. తెలుగు వెలుగు కేవలం తెలుగుభాషా సాహిత్యాలకు చెందిన పత్రిక మాత్రమే కాదు. అది తెలుగు చరిత్ర, సాంస్కృతిక, కళాసంబంధ రచనలని పొదిగించుకున్న పత్రిక.

రామోజి ఫౌండేషను నడిపిన ఈ పత్రికకు అత్మ శిరస్సు, మార్గనిర్దేశిక, సంపాదకత్వం, అన్నీ- శ్రీ రామోజీరావుగారే.

సంస్ధ ట్రస్టీ శ్రీ కిరణ్‌ ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, విధినిర్వాహణ చేసేవారికి, నిధి నిర్వాహణాది కార్యాలను ప్రోత్సాహకరంగా చేయడం - తెలుగు వెలుగు విజయానికి దోహదం చేసింది.

శాఖాధిపతిగా తెలుగు వెలుగు బాధ్యులుగా తదేక దీక్షతో- సంపాదకుల ట్రస్టీల అనుసంధాన బలంతో శ్రీ జాస్తి విష్ణుచైతన్య చేసిన సేవలు తీసుకున్న మెలకువల వల్ల - తెలుగు వెలుగు తన ముద్రను వేసుకోగలిగింది. 25 మంది ముఖ్యులైన సిబ్బందితో పత్రికను నడపడం ఆషామాషి కాదు.

చతుర పత్రిక 518 సంచికల్పి విపుల 518 సంచికల్చి బాలభారతం 94 సంచికల్ని ఇచ్చింది.

తెలుగు వెలుగు 103 సంచికలు వచ్చాయి. శ్రీ రామోజీరావు గారికీ తెలుగు వెలుగు పత్రిక పట్ల గాడాభిమానం ఉండటానికి అనేక అంశాలు సాక్షాత్మరిస్తాయి. దినపత్రికలకు రాయతీల ద్వారా వచ్చే కాగితంతో తె.వె. నడపలేదు. స్విట్టర్‌లాండ్‌ నుండి పెర్లిన్‌టాప్‌ అనే సంస్థనుండి నాజూకైన, విలువైన గట్టి కాగితాన్ని ప్రత్యేకంగా దిగుమతి చేసుకుని, ఆ కాగితాన్ని తెలుగువెలుగుకు వినియోగింపజేశారు. 60 పుటల దరిదాపు ఉండే ప్రతీ సంచికకు ఉత్పత్తి ధర ముఫ్ఫై అయిదు రూపాయలవుతుండగా 10 రూపాయలు ప్రతీ సంచికకు నష్టం వచ్చినా, తక్కువ ధరకే పత్రిక దొరకజేయడంలో లాభదృష్టిలేదు సరికదా ఏమైనా మంచి ప్రమాణాలతో నడపడమే ముఖ్యమని భావించిన- ఆదర్శ భాషా సాహిత్యాభిమాని శ్రీ రామోజీరావుగారు.

కష్టపడి, ఇష్టపడి సాహిత్య సృజన చేసే రచయితలని గౌరవించుకోవాలి. పత్రిక ద్వారా మరీ గౌరవించు కోవాలనేది వారి మంచి పూనిక.

రచనలు వెలువరించి, కనీసం ఆ రచనపడిన ప్రతులను రచయితలకు పంపడం కూడా చేయని పత్రికలు తెలుగునాట కొన్ని ఉన్నాయి.

తెలుగు వెలుగులో రచనలు ముద్రించాక రచనలు పడిన పత్రికలను విఫణివీధిలోకి అవి రాకముందే రచయితలకు చేర్చడం తెలుగువెలుగు చేబట్టింది. రచయితలకు నగదు పారితోషికాలను వారివారి బ్యాంకు అక్కౌంట్లలో జమచేయించడం తెలుగువెలుగు క్రమం తప్పకుండా చేసేది.

లెక్కకు మిక్కిలి రచనలు వస్తున్నా-అవసరమైనప్పుడు వాని ఆనుపానులు, మంచి చెడ్డలు మార్చుచేర్చుల గురించి సంపాదక వర్ణ సభ్యులు-ఆయా రచయితలతో సంప్రదించే ఆరోగ్యకర ధోరణి తెలుగు వెలుగు చేబట్టింది. అల్పసంతోషులు సహృదయులు అయిన రచయితలపట్ల ఇది ఆహ్వానించదగిన అంశం. పారితోషికాలను పంపిన్తూ రచనలు పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సౌజన్యపూరిత సంబంధాలను నెలకొల్చే అధికార లేఖలను పంపి తెలుగువెలుగు మేలుతోవలో సాగింది. తానాలో తెలుగు సభలు పెద్దఎత్తున జరిగినప్పుడు వేలకొలది సంచికలు తీసుకువెళ్ళి ఉచితంగా ప్రతినిధులకు పంపిణీ చేసిన ఉదార దృష్టి తెలుగు వెలుగు పత్రికది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం వచ్చాక వైభవోపేతంగా దొరతనం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నాలుగు కాలాలపాటు దాచుకోదగిన ప్రత్యేక సంచికను వెలువరించి తెలుగుజాతీయ భావైక్యతకు దోహదం చేసింది.

ప్రేమ అంటే కేవలం ప్రేయసీ ప్రియుల మధ్య సంబంధ వ్యక్తీకరణలు మాత్రమే కావు; తల్లిబిడ్డా, అక్కాచెల్లీ, తండ్రికొడుకూ,




తెలుగువెలుగు తుది సంచిక

మార్చి 2021

వంటి ఇతర సంబంధాలూ ప్రేమకు సంబంధించినవే. ఆ సంబంధాలకూ చెందిన ప్రేమలేఖలూ ఉంటాయి. అవి తెలుగు వెలుగు “ప్రేమలేఖ." శీర్షిక విలక్షణంగా నడిపింది. ప్రేమలేఖల పోటీ పెట్టీ, ప్రతినెలా బహుమతి వేయినూటపదహార్లు ఇచ్చే పద్ధతి పెట్టారు. మంచి స్పందన వచ్చింది.

తెలుగు వెలుగులోని సంపాదకీయాలు ప్రత్యేక గ్రంథంగా తీసుకురావలసినవి ఉన్నాయి. తెలుగు భాషా పరిరక్షణకు పాఠ్యగ్రంథాలలో తెలుగు స్థితిగతులూ ఇటువంటి అనేక భాషా సాహిత్య విషయాలపై దొరతనాలకు నిర్మాణాత్మక సూచనలు చేస్తూ అవసర సందర్భాలలో తగు మాత్రం విమర్శలు చేస్తూ సాగిన సంపాదకీయాలు అవిస్మరణీయమైనవి. స్వతంత్ర ఆలోచనలతో భాషోద్యమకారుల ఆలోచనలతో కాంతిమంతాలైనవి. 'తులాభారం,

'కొండఅద్దంముందు ' శీర్షికల్లో గ్రంథ దీర్డ సమీక్షలూ, లఘుసమీక్షలు చేయించడం, వేయడమే కాక రచయితా లేక ప్రకాశకునికి సమీక్ష పడే సంచిక పంపే మరో మంచి సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.

ప్రకటిత రచనా ప్రక్రియల్లో ఒక నాటక ప్రక్రియ తప్ప తక్కిన అన్నిటికీ స్థానకల్చన చేశారు. చలనచిత్ర కవుల, కళాకారుల, పాటల రచయితల రచనలు వేశారు. చివరకు పేరడీ రచనలనీ స్వాగతించారు. సమస్యాపూరణలు ఆసక్తి కరంగా నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో జరిగిన వర్ముషాపులకు రచయిత సభలకు, జానపద వస్తు, గిరిజన వస్తు ప్రదర్శనలకు తన ప్రతినిధుల్ని పంపించి సారాంశ ప్రధానాంశాలను సచిత్రంగా ఇచ్చారు.

శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి ఇతర దేశాల్లో గల భాషాసాహిత్య కార్యక్రమాలను తెలుగు ప్రాంత పాఠకులకు తెలిపారు. చాలామంది తక్మిన రచయితల రచనలు వెలువరించడానికి వీలుగా - ఒక రచయిత రచన ప్రచురించాక మొదటి 4 నెలల తర్వాత, తర్వాత 6 నెలల తరువాత మాత్రమే ఆయా రచయితల రచనలు వేసేవారు. భాషాదిజ్ఞానాంశాలు గ్రహించడానికి వీలుగా మాటకట్టు వేరువేరు రచయితలచే నిర్వహింపజేసేవారు.

2012 తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ సందర్భంగా అమ్మనుడి సంపాదకులు భాషోద్యమ అంకిత మూర్తులు డా॥ సామల రమేష్‌బాబు శ్రీ రామోజీరావును కలిసారు. అప్పుడు వారు శ్రీ సామల వారికి భాషోద్యమ పరంగా అనేక నిర్మణాత్మక సూచనలు చేశారు. శ్రీ రమేష్‌బాబు వంటివారి ముఖాముఖీ కార్యక్రమలు “తెలుగువెలుగు 'లో ఇచ్చేవారు. సమాజానికి అవనరమైన శ్రీ రామోజీరావుగారి అభిప్రాయ ఆలోచలనల్ని- అమ్మనుడిలో ఇచ్చేవారు.

ముచ్చటైన అచ్చు, మృదువైన పటిష్టమైన కాగితం, సంపాదకుల సరైన రచనల ఎంపికలు ఉండి - తెలుగువారి భాషోద్యమానికి వెలుగు బావుటా అయిన పత్రిక - ఆగిపోయిందా? సాహిత్య ప్రామాణిక పత్రిక - ఒక నిశ్శబ్ద చైతన్య శంఖం కాలాన్ని బద్దలు కొట్టుకొని మళ్ళీ పూరింపబడుతుందా? తెలుగు వెలుగు మళ్ళీ అక్షరాలా దృశ్య్వమానమవుతుందా? వర్తమాన కాలాన్ని ప్రశ్చిస్తే - ఆగిన తెలుగు” అని వినిపిస్తోంది. చిరస్మరణీయమైన ఆ పత్రిక ప్రామాణిక సేవలు ఎలా మరువగలం?