అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/తెలుగులో ఏలుబడికి కట్టుబడే పార్టీలకే ఓటు

వికీసోర్స్ నుండి

సంపుటి: 6

సంచిక: 9

అమ్మనుడి

ఫిబ్రవరి 2021

తెలుగులో ఏలుబడికి కట్టుబడే పార్టీలకే ఓటు

ఫిబ్రవరి 21 - ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ. దీన్ని గొప్పగా జరుపుకోవలసిన బాధ్యత ప్రజలకూ, ప్రభుత్వానికీ ఉంది. ఇరవై రెండేళ్లుగా 'యునెస్తో ఈ కట్టుబాటును మన ముందుకు తెచ్చింది. దీన్ననుసరించి ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రభుత్వాలు, ప్రజాసంస్థలు, ప్రజలు జరుపుకొంటున్నారు. మన దేశంలో కూడా క్రమంగా ఈ అలవాటు పుంజుకొంటున్నది. కేంద్రప్రభుత్వం కూడా నాలుగైదేళ్లుగా ఈ పిలుపునిస్తున్నది.

ఉమ్మడి తెలుగురాష్ట్రంలో యునెస్కో పిలుపును ముందుగా పట్టించుకున్నది “జనసాహితి” సాహిత్య సంస్థ. 2003 ఫిబ్రవరి, 21న తెలుగు భాషోద్యమసమాఖ్య "పెద్దఎత్తున ప్రారంభమై తెలుగు రాష్ట్రంలోనే కాక, పొరుగురాష్ట్ట్రాల్లోని తెలుగువారిలో కూడా కదలిక కలిగించింది. క్రమంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలో పలురాష్ట్రాల్లోనూ పనిచేస్తున్న తెలుగు సాంస్కృతిక సంఘాలు ఈ పండుగను జరుపుకొంటున్నాయి. అయితే రెండు రాష్ట్రాలుగా ఏర్చడిన తర్వాత రెండు ప్రభుత్వాలూ ఈ సంగతిని పట్టించుకోవడంలేదు.

భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలే అయినా, ప్రజల భాషల్లోనే పాలించాలనే ప్రాధమిక సూత్రానికి అవి కట్టుబడి ఉండడం లేదు. తప్పనిసరి అవసరం అయినంతవరకే ప్రజలభాష వారికి కావాలి. ఓట్లకోసం, సీట్లకోసం తప్ప దేనికీ ప్రజాభాషలను పట్టించుకోరు.

పరిమితికి మించి ఆంగ్ల భాషను వినియోగిస్తూ క్రమంగా విద్యారంగాన్నంతా ఆంగ్లంలో నడిపే ధోరణి 'ప్రబలడంతో, పరిపాలనారంగమంతా ఆ భాషకు లొంగిపోయింది. నేటితరం పిల్లలు తెలుగు లిపిని చదవలేని స్థితి ఏర్చడింది. మచ్చుకు, ఇప్పుడువస్తున్న తెలుగు సినిమాల పేర్లు, వాటి ప్రకటనలనూ చూడండి. అంతా ఇంగ్లీష్‌లోనే. సినిమా పేరు మాత్రమే తెలుగులో, తక్కిన వివరమంతా ఆంగ్లంలో. కొన్న సినిమాలకైతే ప్రకటనల్లో ఒక్క తెలుగు అక్షరం కూడా ఉండదు. ఏ తెలుగు దినపత్రికను చూసినా ఈ ధోరణి కనబడుతుంది. ఏరంగంలోనైనా ఇదే పోకడ. ప్రభుత్వ పథకాలను మాత్రం భారీగా తెలుగులో కూడా పత్రికల్లో ప్రభుత్వం 'ప్రకటిస్తుంది- అవి ఓట్లను తెచ్చేవి గనుక! ప్రభుత్వమే కాదు, బ్యాంకులతో సహా అన్ని సంస్థల్లో ఇదే ధోరణి. ప్రభుత్వ జి.ఒ.లు అన్నీ ఆంగ్లంలోనే. వాటి గురించి మాట్లాడడం మాత్రమే తెలుగులో! ప్రజావేదికల మీదా చట్టసభల్లోనూ మన రాజకీయ నేతలు తిట్టుకొనేదీ, కొట్టుకొనేదీ తెలుగులోనే! ఆ పని ఆంగ్లంలో చేతగాడు కనుక!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, రెండవసారి ఏర్చడిన ప్రభుత్వాలు తెలుగులో పరిపాలించడాన్ని పూర్తిగా మరిచిపోయాయి. విద్యారంగం సంగతి సరేసరి! ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆంగ్లాన్ని అతిగా నెత్తిన పెట్టుకొని మోస్తున్న సంగతి అందరకూ తెలిసిందే. ప్రాథమిక విద్యలో తెలుగు విషయంలో అవమానకరమైన ధోరణిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు. ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ రాజకీయ ప్రయోజనమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ధోరణిని ప్రదర్శించడం లేదుగాని తెలుగు భాష కోసం పాలనలో గాని, చదువుల్లోగాని వారు చేస్తున్నదేమీలేదు. ప్రజల భాషల విషయంలో కేంద్రప్రభుత్వవిధానాన్ని 'అమ్మనుడిలో ఇటీవల చర్చించుకొంటూనే ఉన్నాం. కొత్తవిద్యావిధానంలో ప్రజాభాషల విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమనూ, డొల్లతనాన్నీ స్పష్టంగా విమర్శించాం. మొదట్లో కొందరు మా అభిప్రాయాలను తప్పుపట్టారు. కాని, ప్రాచీన భాషల వ్యవస్థల్నీ, భారతీయ భాషల సంస్థనూ కలిపివేసి ఒక విశ్వవిద్యాలయాన్ని పెట్టాలనే కేంద్ర ఆలోచన వెనుక ఉన్న పక్షపాత వైఖరిని, దురుద్దేశాన్నీ బయటపెట్టిన తరువాత, వారు తిరిగి అలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భాషోద్యమకారులూ, భొధన, పాలనా రంగాల్లొ ఉన్న తెలుగువారూ తమ బాధ్యతలను గుర్తెరిగి ఉద్యమించాలి. తెలుగుజాతి ప్రయోజనాలనూ, ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోవాలని భావించేవారంతా ఉద్యమించాలి.

తెలుగులో ఏలుబడికి కట్టుబడి ఉంటామని తమ పార్టీ ప్రణాళికలో ప్రకటించని రాజకీయ పార్టీలకు ఓటు వెయ్యవద్దని ప్రకటించాలి. ఫిబ్రవరి 21న జరిగే కార్యక్రమాల్లో ఈ అంశాన్ని ప్రచారంలో పెట్టాలి.

-సామల రమేష్ బాబు.

పద్మశ్రీ గౌరవాన్ని పొందిన

ఆదివాసీ కళాకారుడు కనకరాజుకు జేజేలు

భారత గణతంత్ర దినోత్సవంనాడు ఒక గురువు, నిరుపేద ఆదివాసీ కళాకారుడు కనకరాజుకు 'పద్మశ్రీ' గౌరవాన్ని అందించి కేంద్ర ప్రభుత్యం ఆలస్యంగానైనా మంచిపని చేసింది. మూలవాసుల భాషాసంస్కృతులను గౌరవించినట్లయింది.

గోండి ఆదివాసీ ఆట దండారి కళాకారుడు కనకరాజు గణతంత్ర దినోత్సవంలో, ఇందిరాగాంధి, జ్ఞానీ జైల్‌ సింగ్‌, అబ్బుల్‌ కలాం వంటి మహామహుల ముందు ప్రదర్శనలిచ్చాడు. దశాబ్దాలుగా ఆ ఆటను యువతరానికి నేర్చుతున్నాడు. ఆయనకు ఇప్పుడు పద్మశ్రీ పురస్మారం రావటం, గోండ్వానాతో, దండకారణ్యంతో ముడిపడిన ఆ సంస్కృతికి, వారి కళకు గుర్తింపునిస్తుంది. ఆశ్రమపాఠశాలలో కూలీగా పనిచేస్తున్న తనను ఈ పురస్మారంతో పాటు ఇచ్చే నగదు కొంతైనా ఆదుకొంటుందని ఆశపడుతున్నాడు. ఇటువంటి కటిక దరిద్రం లోకూడా తమ తము సమష్టి నంప్రదాయాలను నిలబెట్టుకోవాలనే ఈ మూలజాతులకు జేజేలు పలకాలి.

మొక్కజొన్న పంట చేతికందే దీపావళికి ఊరూరా తిరుగుతూ జరుపుకునే గోండులు పండుగలో, తప్పిదాల వల్ల శాపగ్రస్తులైన, తమ పూర్వులు ఒక గుహలో బందీ కావటం, మహాదేవుని మనసు కరిగేలా వారి కష్టాలను గానం చేసి వినిపించిన నృత్య గాన దేవతలను ఆహ్వానిస్తూ 16 వాయిద్యాలు, 18 నృత్తరీతులతో ఆడేదే ఈ డండారి.వారిని ప్రసన్నం చేసుకుని, వారి పరమగురువు పహండికూపర్‌ లింగాల్‌ నాలుగు గోత్రాల వారికి, నాలుగు జెండాలు, నలుగురు దేవతలను ఏర్చరచి, వారిని వ్యవసాయంలో స్థిరపరచటంలో ఒడిదుడుకులు ఈ పాటలు, తంతులో కథావస్తువు. ఈ దండారిలో నెమలీకలు ధరించి తలపాగాలో అద్దాలు, పూసలు, గవ్వలతోపాటు జింక, మేకకొమ్ములు; చేతికర్ర, భుజాన జింక, పులిచర్మాలతో అలంకరించుకునే గుసాడీ ఈ బృందంలొ ప్రత్యేక అకర్షణ. గుసాడీలు ఒళ్ళంతా ఊపుతూ ఆడుతుంటే, వాయిద్యాలు మోగుతుంటే, వారు వేసుకున్న గుల్లలు, గంటలు, బెండ్లు లయాన్వితంగా చప్పుడు చేస్తుంటాయి. డెంసా పాటలు పాడుతూ గుమ్మెల దరువులకు అనువుగా పార, తుర్చులి, డప్పు, పిప్రి, కాలికోం వంటి వాద్యాలు వాయిస్తూ పర్దాన్‌, కొలాం, తోటి తెగవారు కూడా పాల్గొంటారు. మథ్యలో ఖేల్‌ అంటే రాజకీయ సామాజిక పరిస్థితుల మీద చిన్న నాటికలు వేస్తారు. “గోండుదేవతలను ఆరాధిస్తూ భజనలు చేస్తారు. పక్మన మహార్యాష్టలో పండరి భజనలో లాగా ఒకరు స్త్రీ వేషం వేసుకుని భజనలకు అనుగుణంగా నర్తిస్తారు.. ఇలా భక్తిని రక్తిని ముక్తిని మేళవించుకున్న విశిష్టమైన పరంపర ఈ దండారి.

కొమరం తిరుగుబాటును అణిచివేశాక ఈ జాతుల సంస్కృతి, అభివృద్ధి సమస్యలను అర్థం చేసుకోడానికి మానవ శాస్త్రవేత్త హైమెండార్భ్‌ను నాటి ప్రభుత్వం పిలిపించింది. ఆయన చెంచు, కొండరెడ్డి, గోండు జాతులను అధ్యయనంచేసి, నిజాం ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. ఆయన శిష్యుడు మైకేల్‌ యార్క్‌ వారి ఆటపాటలను ఫిల్మ్‌గా తీశారు. 1977లో పి.యస్‌. సుబ్రహ్మణ్యం, తరువాత గారపాటి ఉమామహేశ్వరరావు గోండు భాషను అధ్యయనం చేశారు. జయధీర్‌ తిరుమలరావు మరుగుపడిపోతున్న లిపిని ప్రచారంలోకి తెచ్చారు. అదిలాబాదు ఆకాశవాణి ద్వారా ఈ తెగల పాటలను రికార్డ్‌ చేయటమే కాక, గిరిజన సంక్షేమశాఖ ద్వారా మైకేల్‌ యార్క్ పర్యటనను ఏర్పాటుచేయటం, నాటి ఫోటోలు, ఫిల్ములు భద్రపరుస్తున్నారు. శక్తి శివరామకృష్ణ అటవీ హక్కుల గుర్తింపులో, పంచాయత్‌ రాజ్‌ చట్టం అమలుకు కరదీపిక తయారు చేసి శిక్షణనిచ్చారు. గిరిజనోద్యమ నాయకులు రాసిన 'అడవిలో వెన్నెల కథా సంకలనం నాటికీ నేటికీ గిరిజనుల సమస్యలకు అద్దం పడుతుంది. అల్లం రాజయ్య రచనలు ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తాయి. ఇందరి కృషిని రంగరించుకుని ముందుకుపోతూ దండారి వంటి గిరిజనుల ఆటపాటలు వృద్ధిలోకి రావాలని ఆశిద్దాం.

మూలవాసుల కళలతోపాటు వారి భాషలు కూడా ఎదిగేందుకు కనీనం ప్రాథమిక విద్యనైనా వారి సొంతనుడిలో చదువుకోనిచ్చేందుకు తగిన వసతులను, అవకాశాలను కలిగించాలి. వారు ఆరోగ్యంగా జీవించేందుకు, అభివృద్ధిచెందేందుకు ప్రభుత్యం అన్ని చర్యలు తీసుకోవాలి. “పద్మశ్రీని అందించి 'కనకరాజును గౌరవించడంతో సరిపెట్టుకోకుండా, డెబ్బదేళ్ల వయసులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులతో కలసి సుఖంగా జీవించేందుకు తగిన ఆర్థిక సహాయాన్నీ ప్రభుత్వం అందించాలి. -అమ్మనుడి