అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/జగమునేలిన తెలుగు - 12

వికీసోర్స్ నుండి

నవల

డి.పి. అనూరాధ 90100 16555








జరిగిన కధ ప్రవల్లికను వెతుకుతూ సూర్యవర్మ శ్రీలంక వెళతాడు. అనూహ్య వరిస్థితుల్లో కంటి కోట రాజ్యం గురించి తెలుసుకుంటాడు. శ్రీలంకను పరిపాలించిన అఖరు ప్రభువులు తెలుగు వారని తెలిసి ఆశ్చర్యపోతాడు. నేటికీ తెలుంగు మాట్లాడుతోన్న శ్రీలంక మూల వాసుల్ని కలుసుకుని విస్మయానికి గురై వాళ్ల ఊర్లలో పర్యటించడానికి బయల్దేరతాడు. అతడి కలల రాకుమారిని కలుసుకుంటాడా?


మసన్న అన్న కూతురి ద్వారా ప్రవల్లికను కలుసుకోవాలనే ఆరాటం. ఎప్పుడెప్పుడు ఊరు వెళతామా అని గడియారం చూస్తూ కూర్చున్నా. అసలు మసన్నది ఏ ఊరు. ఆ విషయమే అడగలేదన్న సంగతి గుర్తుకువచ్చింది.

“అన్నా మనది ఏ ఊరు”

“కలవేవ, అనురాథపురా నుంచి ఓ యాఖై కిలోమీటర్లు ఉంటాది. మనోళ్లందరమూ కోతుల్ని ఆడిస్తూనో, పాముల్ని ఆడిస్తూనో బతుకుతున్నాం. లంకోళ్లు మాకు 'అహికుంతికలు” అని పేరుపెట్టారు. ఈ దేశంలో మాది ప్రత్యేక జాతి. మేం సింహళోళ్లమే కాదు. తమిళులమూ కాదు. నిన్నా మొన్నటి వరకూ సంచార జీవితమే గడిపినాము. ఇప్పుడిప్పుడే ఇళ్లు కట్టుకుని ఓ చోట కుదురు కుంటున్నాం. పుత్తళం, దేవరగమ్మ, కుడాగమాలో మనోళ్లు ఎక్కువగా ఉండారు.

మనన్న మాటలు వింటుంటే నాకు మయున్నార్స్‌ “మన్‌ జాతీయులు గుర్తుకువచ్చారు. కానీ వాళ్ల మాతృభాష తెలుగుకాదు. అసలు తెలుగు నేల నుంచి వెళ్లిన సంగతినే వాళ్లు మరచిపోయారు. శ్రీలంక లోని ఈ 'మన జాతీయుల మాతృభాష తెలుగే. వీళ్లు ఎవరు? క్రీస్తు పూర్వం విజయుడితో ఇక్కడికి వచ్చారా? లేక అశోకుడి కూతురు సంఘమిత్ర సవరివారంలో ఉన్నారా? లేక శ్రీలంక మూల జాతీయులా? వాళ్ల గురించి నేషనల్‌ లైబ్రరీకి వెళ్లి సమాచారం సేకరించాలి. వీళ్ల తెలుగు మన తెలుగు లాగానే ఉంది. అక్కడక్కడ తమిళ, సింహళ పదాలు ఉన్నా సులభంగానే అర్థం అవుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వలస వచ్చినవారా? మయన్మార్‌ “మన్‌” కూ శ్రీలంకలోని 'మన 'కూ ఏదైనా సంబంధం ఉందా? అన్నీ శేష ప్రశ్నలే.

“ఇదే కలవేవ మసన్న మాటలకి నా ఆలోచనల్ని పక్కన పెట్టాను. ప్రవల్లిక గురించి సమాచారం తెలుస్తుంది అనే ఊహే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈసారెలాగైనా నా ప్రేమను గెలిపించుకోవాలి.

అటు పెద్ద ఊరు కాదు చిన్నది కాదు కలవేవ... ఓ మోస్తరు నగరం. మసన్న ఇళ్ళెక్కడా అన్న ఆత్రంలో ఉన్నా నగరమంతా దాటేసి బయటికి వచ్చాం. కాస్త దూరం వెళ్లాక ఓ చిన్ని గ్రామం. మట్టి రోడ్లు. కొన్నీ ఇటుకలతో నిర్మిస్తే మరి కొన్ని గుడిసెలు. మామిడి చెట్లు వేప చెట్లు.. కొన్నిటికి చీర ఉయ్యాలలు వేలాడదీశారు.

“సూర్యా మనం ఇంటికి వెళ్లగానే నువ్వు టాక్సీని ఇడిపించేయి. అంత దవ్వు నుంచి వచ్చావు. మాతో కొన్ని రోజులు ఉండు. దేశం విషయాలు చెప్పు. మన వాళ్లందరూ చాలా సంతోషవెలయితరు.” మసన్న మాటలు కాదనలేకపోయాను.

“ఇదంతా మన తావే.. వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా ఉండకుండా మా తాతముత్తాతలు ఉండారు. బయటి ప్రపంచాన్ని పట్టించుకోకుండా మా లోకంలో మేం ఉన్నాం. కానీ నాగరికత వల్ల మాకు నిలువు నీడ లేకుండా ఫోయింది. నలబై ఏళ్ల నుంచి ప్రభుత్వం మాకు మల్లు ఇచ్చింది. ఇలా ఇల్లు కట్టుకుంటున్నాం. మాలో ఎవరమూ చదువుకోలేదు. ఈనాటికీ మా తాతముత్తాతల్లా కోతుల్సి పాముల్ని ఆడిస్తూ పొట్టనింపుకుంటున్నాం. ”

శ్రీలంకలో తెలుంగు జాతి కష్టాల్ని మసన్న మాటలు తెలియజేస్తున్నాయి. వీళ్లు జిప్సీల్లాంటి వాళ్లన్నమాట. వీళ్లకి మన


ప్రభుత్వాల తరపున సహయం అందించేలా ఛ్హూడాలి.

“సూర్యా ఇదే మన ఇల్లు..”

'మెతానిన్‌ నవతిన్న ' క్యాబ్‌ డ్రెవర్‌తో సింహళంలో ఏదో చెప్పాడు మసన్న. కారు డిక్కీలోంచి సామానుదించాడు. కారు వాడికి అప్పటి వరకూ అయిన డబ్బు ఇచ్చేసి పంపించేశాను.

మా కారు ఆగిన శబ్దానికి ఇంటి లోపలి నుంచి ఓ నడివయసు స్త్రీ బయటకి వచ్చింది. మసన్న ఆమెతో 'మనోడే, దేశం నుంచి వచ్చినాడు అని చెప్పాడు.

“సూర్యా, నా పెండ్లాం కళావతి..” అంటూ పరిచయం చేశాడు”

“నమస్తే, వదినా” అన్నా ఆమె మొదట నన్ను చూసి కాస్త ఆశ్చర్యపోయినా ఆ తరవాత చిరునవ్వుతో ఆహ్వానించింది.

వసారాలో ఉన్న చెక్క బెంచీ మీద ఇద్దరం కూర్చున్నాం. వదిన మా ఇద్దరికీ స్టీలు గ్లాసుల్లో మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది.

చల్లగాలి వీస్తోంది. ఇక్కడ పరినరాలు చాలా స్వచ్చంగా ఉన్నాయి. కాలుష్యం ఇంకా వీళ్ల వాడను తాకలేదు.

“ఇల్లు చూపిస్తా రా సూర్యా అంటూ లోపలికి దారి తీశాడు. తన వెంటే నేనూ.

వసారాను ఆనుకుని హాలు. అది కాస్త పెద్దదే. ఓ పక్క ధాన్యం బస్తాలు... ఓ ప్లాస్టిక్‌ టేబుల్స్‌ నాలుగు కుర్చీలు వేసి ఉన్నాయి.

ఆ హాలు నుంచి నేరుగా ఉన్న తలుపులోంచి లోపలికి వెళితే పడక గది. ఓ నాలుగు పరుపులు చుట్టి ఉన్నాయి. ఆ గదిలో ఉన్న కిటీకీకి ఆనుకుని ఆరడుగుల చెక్క బల్ల వేశారు. బల్ల పక్కనే నా సామాను పెడుతూ...

“ఇదే నీ గది సూర్యా, ఎన్ని రోజులైనా నువ్వ హాయిగా ఉండొచ్చు. మా ఇల్లు చిన్నది కావచ్చు కాని మనసు కాదు” నా కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పాడు.

ఒక్కసారిగా ఆయన దగ్గరికి వెళ్లి హత్తుకున్నాను. తను సంతోషంగా నన్ను చూశాడు.

హాలులోనే ఓ వైపు వంటగది. ఇద్దరమూ హాలు మథ్యలో ఉన్న ఇంకో తలుపులోంచి బయటకి వచ్చాం. బయట అంతా చిన్నపాటి తోట. ఆనపకాయలు, కాకరకాయల తీగలు అల్లుకున్నాయి. గులాబీలు, మందారాలు విరబూశాయి. సీమకోళ్లునూ 'పెంచుతున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా ఓ షెడ్డులాంటిది చేశారు. ఓ కోడి పెట్ట తన పిల్లలతో తిరుగుతోంది. ఇంత దాకా ఎక్కడుందో కానీ వచ్చింది ఓ కుక్క తోక ఊపుతూ మసన్న దగ్గరికి వెళ్లింది. 'జాకీ అంటూ దాన్ని ముద్దు చేస్తున్నాడు. ఓ పక్క స్నానాల గది. అటు వైపే చూస్తూ..

“ ఇది ఆడొళ్ల స్నానాల గది, కాస్త దవ్వలో కాలువ ఉంది.మగాళ్లందరమూ పొద్దునే అక్కడికి వెళ్లి స్నానాలు చేసి, బట్టలు ఉతుక్కుని వస్నాం. తాగు నీళ్లు వాడకం నీళ్లు అన్నీ అక్కడి నుంచి తెచ్చుకోవలసిందే” వివరించాడు మసన్న

మామిడి చెట్టు కింద ఓ బకెట్లో నీళ్లూ మగ్గూ ఉన్నాయి. తను వెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కుని లోపలికి వెళ్లాడు.

నేనూ కాళ్లూ చేతులు కడుక్కుని ఆ చల్లగాలికి అక్కడే ఉండిపోయాను. మామిడి చెట్టంతా చిగురేసింది. అక్కడక్కడా పిందెలు వేసింది. చెట్టుకానుకుని ఉండిపోయా. ప్రవల్లికకు నాకూ ఇంకా ఎంత దూరం అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది మసన్న వాళ్ల అన్న కూతురు.

మసన్నే రెండు కప్పుల్లో టీ తీసుకుని వచ్చాడు. టీ తాగుతూ అడిగాను

“మీ అన్న వాళ్ల ఇల్లు ఎక్కడ?”

“ఈ పక్మదే మా అన్నోళ్లది. తన పేరు ఎర్రన్న ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాడు. ఏటా తనే కొన్ని ధాన్యం బస్తాలూ నాకూ ఇస్తాడు. రా వెళదాం అన్నోల్లింటికి”

అలాగే తోటలోంచి వెళితే పక్క ఇళ్లే ఎర్రన్నది. ప్రతి ఇంటి చుట్టూ కాంపౌండ్‌ లాంటి విభజన ఇంకా ఇక్కడ చేసుకోలేదు.

ఎర్రన్న ఇంటి చుట్టూ తోట... రకరకాల పూలు.. చెట్లు వసారా నుంచే ' అన్నా ' అని పిలుస్తూ మసన్న వెళుతున్నాడు. తన వెనకే నేనూ.

'రా మసన్న ' హాల్లోంచి మాటలు విన్సించి మేం లోపలికి వెళ్లాం.

సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న ఎర్రన్న నన్ను చూసి లేచాడు.

“అన్నా ఇతడు సూర్య, ఏదో పని మీద దేశం నుంచి వచ్చాడు. మనింట్లో కొన్ని రోజులు ఉండమని తీసుకువచ్చా.”

ఆయన నన్ను చూస్తూ కాస్త ఆశ్చర్యపోతూ దగ్గరగా వచ్చి...

“దేశంలో మన తెలుంగు గుంపు పెద్దదేనా”

“చాలా పెద్దది తొమ్మిది కోట్ల మందిమి ఉంటాం”

“'భలేగా ఉండే..” సంబరంగా నవ్వాడు ఎర్రన్న

“అన్నా లచ్చిమి లేదా?” మసన్న ఎవరి కోసమో వెతుకుతూ అడిగాడు.

“లేదు, పురానికి పోయింది... రేపొస్తాది అన్నాదు.

“మా అన్న కూతురు లచ్చిమి, తనే బుద్ద పాదాల యాత్రలో ఇండియా పోయి వచ్చినాది మసన్న చెబుతుంటే వింటున్నా కాని మనసులో మాత్రం బాధ.

“సూర్యా సాయంత్రం మనోళ్లందరినీ పిలిపిస్తా నువ్వు మాకు దేశం విశేషాలు చెప్పాల” ఎర్రన్న కోరాడు. సరేనని చెప్పా.

మళ్లీ కలుస్తాం అని చెప్పేసి మసన్న ఇంటికి వచ్చేశాం.

“నేను గదిలోకి వెళ్లి కూర్చుండిపోయాను. కిటీకీ లోంచి బయటకి చూస్తూ... కాసేపటికి బయట అలజడి మొదలైంది. వెళ్లి చూస్తే... చంటి పిల్లలతో తల్లులు, పడుచువాళ్లు, ముసలి వాళ్లు... ఆడామగా అంతా చేరి ఓ ముప్పై నలఖై మంది. వాళ్లలో వర్రన్న



వీళ్లెవరు, వీళ్లకూ నాకూ ఏమిటీ సంబంధం అన్పించింది. కానీ వీళ్లందరూ నా తెలుగు తోబుట్టువులు. మా అందరిలో ప్రవహిస్తోంది తెలుగు రక్తమే. అందుకే ఇంతమంది తమ ఆత్మీయుడిని చూడాలన్నంత ఆత్రంగా వచ్చారు.

సూర్యా, దేశం గురించి, తెలుంగుజాతి గురించి నువ్వు చెబితే మేమందరమూ వినాలని మనసుపడుతున్నాం..” మసన్న కోరాడు.

“లంకకు కొద్ది దూరంలోనే భారతదేశం ఉంది. అక్కడ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలలో మొత్తంగా తెలుంగే మాట్లాడతారు. ఇతర రాష్ట్రాలలో కూడా తెలుంగు మాట్లాడేవాళ్లు చాలానే ఉన్నారు. మనది మొత్తం తొమ్మిది కోట్ల గుంపు. లంకలో మీవి ఎన్నీ కుటుంబాలో తెలియదు, ఎంత మంది ఉండారో తెలియదు. కానీ ఇతర దేశాలలో చూస్తే మన తెలుంగు జాతిది చాలా పెద్ద గుంపు.. కాస్త సరళంగా వాళ్లకి అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించా.

“మన గుంపులో రాజపక్ష లాంటి వాళ్లు ఉన్నారా? ఎవరో ప్రశ్న వేశారు

ఎందుకు లేరు. మన తెలుంగు వారు భారతదేశ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా చేసిన వాళ్లు ఉన్నారు.

“మన తలైవా ఎన్టీఆర్‌ అనీ అక్కడెక్కడో ఉండాడని ఇక్కడికి వచ్చి మా జీవితాలని మారుస్తాడని మా తాత చెప్పేవాడు. ఆ ఎన్టీఆర్‌ ను చూడకుండానే మా తాత పోయాడు. ఆ ఎన్టీఆర్‌ ఉండాడా? మరో ప్రశ్న

ఆ యువకుడు ముప్పై ఏళ్ల వాడు. “నీ పేరేమిటి”

సుబ్బడు”

సుబ్బడూ ఆ మహానటుడు, మహా తలైవా మరణించి చాలా ఏళ్లవుతోంది. ఇప్పుడున్న తలైవాలతో మీ గురించి చెబుతా.

“దేశంలో మనోళ్లు ఈనాటికీ ఏల్‌ నాళ్ల పెళ్లిళ్లు చేసుకుంటున్నారా, ఓ మధ్య వయసు స్త్రీ ప్రశ్నించింది.

“అమ్మా మీ పేరేమిటి?

“ముత్తుమారి '

“ఇక్కడ మీ పెళ్లిళ్లు అలా జరిగేనా అమ్మా

“ముందర అలా జరిగేవి. పెళ్లికొడుకు పెల్లికూతురింటికి వచ్చేవాడు. గుడారాలు వేసేవాళ్లం. తాళికట్టడం, నల్ల పూసలు వేసుకోవడం అంతా ఉందేది. అందరూ చేరి తినేది, తాగేది.కసాటాలు రాసేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. సింగలంలోనే కసాటాలు రాస్తున్నారు. బుద్దుడిని కొలుస్తున్నాం కదా పెళ్లి కూడా ఒక్క పూటలో అయిపోతుంది”. కాస్త బాధ పడుతున్నట్టుగా అనిపించింది.

'మరి ఈ వీధి మొదట్లో గణేష్‌ మందిరం కన్పించిందే' వీళ్ల మతం గురించి తెలుసుకోవాలనే ప్రశ్నించాను.

ఎర్రన్న ముందుకు వచ్చాడు. “సూర్యా, అదంతా ఓ పెద్ద కత అవుతాది. మా తాత ముత్తాతలు, వాళ్ల తాతలు అంతా సంచారులే. వారం రోజులు కూడా ఒక్క చోట ఉండేవాళ్లు కాదు. క్రమంగా నాగరికత పెరిగింది. నగరాలు, ఊర్లు పుట్టుకొచ్చాయి. మాకు ఉండడానికి ప్రాంతాలు తగ్గిపోయాయి. గత నలఖై ఏళ్ల నుంచే ఇలా అందరమూ ఓ చోట చేరి ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నాం. మా వాళ్లు మరణించినప్పుడు ఏ స్మశానానికి తీసుకువెళ్లాలో తెలిసేది కాదు. ఎక్కడా మమ్మల్ని అనుమతించేవాళ్లు కాదు. అందుకే చాలా మటుకు బౌద్దానికో, కైస్తవానీకో మారుతున్నాం. కుడాగమా, దీవరగమ్మలలో మేమంతా బుద్దుడిని పూజిస్తున్నాం. పుత్తలం లాంటి చోట్ల ఏసుప్రభువును పూజించే వాళ్లు ఎక్కువ.” అంటే మరణానంతర పరిస్థితికి భయపడి మతం మారుతున్నారు. ఈ భూమ్మీద ఇలాంటి సమస్య మరెవ్వరికైనా ఉంటుందా అనిపించింది. చాలా బాధేసింది. అవేవీ కన్పించకుండా ..

“దేశంలో ఉన్న మనోళ్లకు మీ గురించి ఏమన్నా చెప్పాలా?

“దేశంలో ఉన్న మనోళ్లను ముందు చూడాలని ఉంది, నాకు ఇండియా రావాలని ఉందన్నా? మొదట సుబ్బడు స్పందించాడు.

“మాకు కుర్రు లేదు, బిల్లలు సింగలమే నేరుస్తున్నారు. మన తెలుంగు కుర్రు నేర్పిస్తే బాగుంటాది” మరో అభ్యర్థన.

నిజమే. తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ ఆ అక్షరాలు రాయలేరు. కాబట్టి వాళ్ల చరిత్రను రాసిపెట్టుకోలేకపోయారు. చంటి పిల్లాడితో వచ్చింది ఓ పాతికేళ్ల యువతి. ఆ బాబును చూస్తూ ఏం పేరని అడిగాను.

“'వేలుకమల్‌, సింగలం పేరు పెట్టా. మావి తెలుంగు పేర్లని సింగలం వాళ్లు గేలి చేస్తారు. అందుకే బడి మానేశా. ఇప్పుడు కూడా వాళ్ల ఇళ్లల్లోకి రానీవ్వరు. మమ్మల్ని దూరంగా పెడతారు. నా బిడ్డ ఆ కష్టాలు పడకూడదు. అందుకే సింగలం పేరు పెట్టా. సింగలమే నేర్పిస్తా.” కాస్త ఆవేశంగా మాట్లాడింది. కానీ ఆమె ప్రతి మాటా ఆలోచింపజేసేదే.

'మీ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటాను. దేశం వెళ్లగానే మనోళ్లందరికీ చెప్పి మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తా" ముక్తాయింపుగా చెప్పా.

ఒక్కొక్కరూ తలలూపుతూ వెళ్లిపోతున్నారు. చీకటి పడుతోంది. మసన్న భోంచేయడానికి రమ్మన్నాడు. ఏదో అలా తినేసి భారమైన ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించా. పేదరికపు అంచుల్లో ఉన్న ఈ తెలుంగుజాతి వారికి ఎలాగైనా సహాయం చేయాలనీ కంకణం కట్టుకున్నా.

తెలతెలవారుతుండగా మసన్న వచ్చి నిద్రలేపాడు. కాలువ కాడికి వెళ్లి స్నానం చేయాలని ముందు రోజు చెప్పిన సంగతి గుర్తొచ్చింది. ఇంకా అయిదు గంటలు కూడా కాలేదు. వేపపుల్లతో పళ్లు తోముకుంటా తువ్వాలను భుజానికేసుకుని బయల్దేరాం.

ఆ ఇండ్లు వీధులు దాటుకుని రాగానే అటూ ఇటూ పొలాలు. మధ్యలో ఎనిమిది అడుగుల వెడల్పున్న మట్టిరోడ్డు. చల్లటి పైరగాలి. ఆకాశంలో బంగారు వర్ణ కిరణాలు పరుచుకుంటున్నాయి. మనసంతా హాయిగా ఉంది...

మా ఎదురుగా నీళ్ల బిందె నడుముపై పెట్టుకుని ఓ యువతి వస్తోంది. ఆమెను చూడగానే మసన్న “మా లచ్చిమి" అన్నాడు.

నా గుండె కొట్టుకోవడం ఆగిపోయి ప్రపంచమంతా స్తంభించింది. తను మరెవరో కాదు, నా ప్రవల్లికే. అంటే ఈ జన్మలో శ్రీలంకలో లచ్చిమిలా పుట్టిందన్నమాట. ఆమెనే చూస్తుండిపోయాను. తను మా దగ్గరికి రాగానే మసన్న..

“అమ్మా అచ్చిమి, పురం నుంచి ఎప్పుడు వస్తివి?

“'ేయి పొద్దుపోయినాకు వచ్చిన చిన్నాన్న.

ఆ తియ్యటి న్వరం నా మనసుకు ఉయ్యాల ఊపినట్టుగా అన్పించింది. నాడు రాకుమారిలా చూసిన యువతిని నేడు సాధారణంగా చూడడం కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. ఆమె భుజాన తడి బట్టలు ఉన్నాయి. అంటే ఇంత పొద్దున్నే నిద్రలేవడమే కాదు, బట్టలు ఉతుక్కుని మంచినీటిని ఇంటికి తీసుకెళుతోంది. కష్టజీవిగా అన్పించింది.

తనకు నన్ను పరిచయం చేస్తూ..'ఇతడు సూర్య, దేశం నుంచి వచ్చాడు. మనింట్లోనే ఉంటాడు. మళ్లీ కలుస్తాంలే అన్నాడు మసన్న

లచ్చిమి నన్ను చూస్తూ పలకరింపుగా నవ్వి ... ముందుకు సాగింది.

ప్రపంచంలోని పూలజాతులన్నీ ఓ వైవు వేసినా ఎంతకీ తూకనిది ఆమె నవ్వు.

ఆలోచనలతో అలాగే మసన్నను అనుసరించా.

కాలువ వచ్చింది. కొంత మంది పురుషులు ఈతకొడుతున్నారు. కాస్త దూరంలో స్త్రీలు ఉన్నారు గట్టుమీద.

నేనూ, మసన్నా నీళ్లలోకి దిగాం. అంత లోతుగా లేదు. చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు.

సూర్యా, ఇదంతా కలవేవ నీళ్లే. కలవేవ అనేది ఇక్కడ పెద్ద మంచి నీటి సరస్సు. రాజుల కాలంలో నిర్మించారు. ఎన్నో కాలువల ద్వారా ఆ నీటిని వ్యవసాయానికి మళ్లిస్తున్నారు. అలాంటి ఓ కాలువే ఇది. ఎండల కాలమైనా ఆ సరస్సు ఎండిపోదు. ఈ కాలువ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.” మసన్న వివరిస్తున్నాడు.

ఆ విషయాలన్నీ గొప్పగా ఉన్నా నా ధ్వాసంతా ప్రవల్లిక మీదే.ఇంటికి ఎప్పుడు వెళ్లాలి, ఆమెను ఎప్పుడు కలవాలి అనే ఆలోచిస్తున్నా.

ఇంటికి వచ్చాక కూడా అదే ధ్యాస. నా గదిలోకి వెళ్లిపోయా.బల్లమీద కూర్చుని కిటికీలోంచి చూస్తూ ఆలోచనలో మునిగిపోయా. అలా ఎంత సేపు ఉన్నానో..

“చిన్నమ్మా”. బయటి నుంచి మృదువైన స్వరం వినిపించింది. ప్రవల్లికదే అని నా మనసు చెప్పింది. కానీ బయటకు రాలేకపోయాను.

“సూర్యా అంటూ మసన్న పిలవడంతో హాల్లోకి వచ్చా. ఎదురుగా లచ్చిమే ఉంది.

“ఇండియా బుద్ధ పాదాల యాత్ర గురించి తెలుసుకోవాలని ఉంది అన్నావ్‌ కదా, లచ్చిమితో మాట్లాడు” అన్నాడు.

మేం ముగ్గురం హాల్లోనే కూర్చున్నాం. వదిన వంటింట్లో ఉంది.

కాస్త చొరవగా '“లచ్చిమి, నువ్వు ఇండియాలో ఎక్కడెక్కడికి వెళ్ళావ్‌?”

నన్ను ఓ క్షణం తేరపార చూసింది. కాసేపు ఏదో ఆలోచించి...

“బుద్ద భగవానుడికి సంబంధించి ముఖ్యమైన బుద్ధగయ, సారనాథ్‌, కుషీనగర్‌కు వెళ్లాం. నేపాల్‌లోని బుద్ద జన్మస్థానం లుంబినిలో ప్రార్ధనలు చేశాం. తిరిగి వస్తూ దక్షిణ భారతదేశంలోని నాగార్జునకొండకు వెళ్లాం. అక్కడ వేల ఏళ్ల క్రితం మా సింహలీయులు నిర్మించిన విహారాన్ని దర్శించాం. మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్ధనలు జరిపాం. అక్కడ అందరూ తెలుంగు మాట్లాడుతున్నారు. వాళ్లంతా మా కుదురే అన్పించింది. మీరు తెలుంగు వారా?” సూటిగా ప్రశ్నించింది.

“అవును, నాగార్జునకొండ సమీపంలో మా ఊరు ఉంది”

“లచ్చిమీ, సూర్య మన చుట్టం. పురంలో మహాబోధి దగ్గర నాకు కన్పించాడు. మనూరికి తీసుకువచ్చా. తనకి మన తావులన్నీ నువ్వే దగ్గరుండి చూపించాల” మసన్న నా గురించి లచ్చిమికి చెబుతున్నాడు. తను ఆసక్తిగా నన్నూ మసన్ననూ చూస్తోంది.

సూర్యా మా కలవేవలో కాలేజీ వరకు చదువుకుంది లచ్చిమి ఒక్కతే. అందుకే నీ పనులన్నీ తనకి పురమాయించాను” మసన్న వివరిస్తున్నాడు. సింహళం, తమిళం, తెలుంగు, కాస్త ఆంగ్లమూ మాట్లాడగలదు.

“లచ్చిమీ...” వాళ్ల నాన్న పిలుపనుకుంటా.

“వస్తున్నా అయ్యా” అంటూ మళ్ళీ వస్తా చిన్నాన్న అని చెప్పి వెల్లిపోయింది.

“తల్లి లేని పిల్ల, అయ్య గారాబంగా పెంచినా అందరికీ సహాయం చేయడంలో ముందుంటుంది. మంచి పనిమంతురాలు'కళావతి వదిన లచ్చిమి గుణగణాలు వివరిస్తోంది.

నా మనసు గాల్లో తేలుతోంది. ప్రవల్లిక అదే నేటి లచ్చిమి నా కళ్లెదురుగానే ఉంది. నా పక్క ఇంట్లోనే నివసిస్తోంది. ఈ ఊహే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనకి నేను గుర్తులేను. థాయిలాండ్లో మా ప్రేమ కథంతా తనకి తెలియజేయాలి. కానీ ఎలా... తను నన్ను విడిగా కలుస్తుందా? అదంతా నిజమని నమ్ముతుందా?

కట్టు కథని కొట్టిపారేస్తే... లచ్చిమితో ఎలాగైనా సరే మనసు విప్పి మాట్లాడాలి...

ఎలా... ఎలా... ఎలా?

(తరువాయి వచ్చే సంచికలో...)