అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020

వికీసోర్స్ నుండి
పుట:Ammanudi April-July 2020.pdf/2

లోపలి పుటలలో....

సంపాదకహృదయం: సుప్రీంకోర్టు సన్నిధిలో బోధనామాధ్యమ సమస్య... 06 పుట:Ammanudi April-July 2020.pdf/4

మలేసియాలో తెలుగు రక్షకుడు, ఉపాధ్యాయుడు

బుద్ద అప్పలనాయుడు

మలేసియా (మలయా) ప్రవాసాంద్ర ప్రముఖుడు బుద్ద అప్పల నాయుడు మాష్టరు (100 సం॥) 2020 మే 5తేదీన (మంగళవారం), మలయాలో మధ్యాహ్నం మృతి చెందారు.

అనకాపల్లి గవరపాలెంకు చెందిన బుద్ద మహలక్ష్మమ్మ, బుద్ద మారయ్య దంపతులు తమ ముగ్గురు సంతానం కుమారుల్ని వెంటతీసుకుని 1928లో మలేషియాకు వలసవెళ్లి పోయారు. వారి సంతానంలో రెండోవాడైన అప్పలనాయుడు అక్కడే చదువుకొని, ఉపాధ్యాయునిగా వృత్తి నిర్వహణలో తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. మలేసియా కెడా రాష్ట్రానికి చెందిన పెలాం ఎస్టేటులోని తెలుగు పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు.

వృత్తి రీత్యాను, ఇతర సాంఘిక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మలేషియా తెలుగు సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన అప్పలనాయుడు మాష్టరును, మలేసియా రాజు 1978లో ఆదేశంలోని అత్యున్నత పురస్కారం పి.జె.కె. బిరుదుతో సత్మరించారు. రెండు, మూడు తరాల మలేసియా ప్రవాసాంధ్రులు ఆయన వద్ద విద్యనభ్యసించిన వారే. ఆయనకు ఆరుగురు కుమార్తెలు. వారిలో ముగ్గురు కుమార్తెలు ఇప్పుడు విశాఖ జిల్లాలో వుండగా, రెండో కుమార్తె డా॥ మార్గరెట్‌ లండన్‌లో ప్రముఖవైద్యురాలు. ఇద్దరు కుమార్తెలు మలయాలోనే నివసిస్తున్నారు. 1955లో స్థాపించిన మలేసియా 'కూలిం' శాఖకు చాలా సంవత్సరాల పాటు అధ్యక్షునిగా వ్యవహరించారు. గత ఏడాది మరణించిన మలేసియా తెలుగు సంఘం వ్యవస్థాపకులు ముదిని సోమునాయుడుకు అత్యంత సన్నిహితునిగా సంఘ కార్యక్రమాలలో పాలుపంచుకున్న తెలుగు భక్తుడు.

మలేసియాకు వలస వెళ్లిన తొలి తరం తెలుగు వారు పడిన కష్టాలను చిత్రిస్తూ 2006వ సం॥లో 'మధుర స్మృతులు పేరిట కొన్ని కధలు రాశారు. తొలి తరం తెలుగు వారి వాడుకభాషను అప్పలనాయుడు గొప్పగా చిత్రించారని పలువురు భాషాభిమానులు కీర్తించారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

నూకాంబిక భక్తుడయిన అప్పలనాయుడు మాష్టరు దేవస్థానం మండపం విస్తరణకు భూరీవిరాళం అందజేశారని నూకాంబికా దేవస్థానం మాజీ ఛైర్మన్‌ (మాష్టరి అల్లుడు) కొణతల వెంకటరావు తెలిపారు. తెలుగు మాత ముద్దు బిడ్డ, విశాఖజిల్లా భూమి పుత్రుడు బుద్ద అప్పలనాయుడు అనకాపల్లికి మలయాలో మంచి గుర్తింపు తెచ్చారని సీనియర్‌ జర్చలిస్ట్‌ బి.వి. అప్పారావు నివాళులర్సించారు.

తెలుగు భాషోద్యమ సమాఖ్య

“క్రీ.శే. ముదిని సోమినాయిడుగారితో పాటు బుద్ద అప్పలనాయుడుగారు “నడుస్తున్న చరిత్ర " అభిమానులుగా నాకు ఆస్తులు. సుదూర దేశాలకు వలసవెళ్లినా అక్కడ తమ అమ్మనుడి తెలుగుకోసం జీవితమంతా శ్రమించిన వీరు తెలుగు జాతి వారందరకూ ఆదర్శం - అంటూ వారిరువురికి తెలుగు భాషోద్యమ సమాఖ్మ అధ్యక్షుడు డా॥ సామల రమేష్‌బాబు నివాళులర్చించారు.


“అమ్మనుడి చదువరులకు విన్నపం

కరోనా మహమ్మారి కాటు వల్ల మూడు నెలలపాటు పత్రికలను ప్రచురించలేకపోయాం. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలో మన దేశమూ, ప్రాంతమూ కూడా లాక్‌డౌన్‌లో ఒదిగిపోవలసివచ్చినందున ఈ పరిస్థితి ఏర్పడిందని మన అందరకూ తెలిసిందే.

మార్చి నెల చివరివారంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మూడు వంతులు సిద్ధమైన ఏప్రిల్‌ నెల సంచికను పూర్తి చేయకుండా ఆపివేయవలసివచ్చింది. ఇప్పుడు 'లాక్‌డౌన్‌'లో సడలింపు ఏర్పడడంతో - పత్రికలో కొన్ని మార్చులు చోటుచేసుకున్నాయి. పాత వార్తావిశేషాలను కొన్నిటిని తొలగించి, కొన్ని కొత్త అంశాలను చేర్చవలసి వచ్చింది. జులై సంచికగా దీనిని వెలువరిస్తున్నా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలతో కలుపుకొన్న సంచికగా స్వీకరించ ప్రార్ధన.

ఏప్రిల్‌ మే, జూన్‌ సంచికలను అందజేయలేనందుకు చింతిస్తూ, ఎప్పటివలెనే పాఠకులు పత్రికకు తమ ఆదరాభిమానములను అందించగోరుచున్నాము.

- సంపాదకుడు

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ

మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి

(మాతృభామా మాధ్యమ వేదిక ప్రారంభించిన ఆన్‌లైన్‌ మహజరు)

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటి లోనూ విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలనే డిమాండు సాధనకై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించిన ఈ ఆన్‌లైన్‌ మహజరుకు మీ ఆమోదం తెలియజేయగలందులకు విజ్ఞప్తి.

ఈ పిటీషన్‌ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే సంబంధించినది కాదు. ప్రైవేటు పాఠశాలలకు కూడా విద్యాహక్కు చట్టం వర్తిస్తుంది. ప్రైవేటు పాఠశాల్లలోకూడా ఎనిమిదవ తరగతివరకు మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి. మధ్య తరగతి వారు మాతృభాషా మాధ్యమమే తమ బాలల సమగ్రాభివృద్ధికి మంచిదనే విషయాన్ని గ్రహిస్తే వారి బాలలకు, ప్రజల భాషలకూ మరియు విస్తృత సమాజానికి మంచిది. ఒక వైపు ప్రైవేటు విద్య, మరొక వైపు ఆంగ్లమాధ్యమం ద్వారా బాలలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తల్లితండ్రులు గమనించాలి. తమ స్వంత భాషలో బాలలు ఇష్టంగా, ఉత్సాహంగా, సృజనాత్మకంగా విద్య నేర్చుకొాంటారని ప్రపంచ వ్యాప్తంగా మేధావులు చెబుతున్నారు. అంతేకాదు, మాతృభాష ద్వారానే ఇంగ్లీషుతో సహా ఇతర భాషలు బాగా నేర్చుకోవచ్చని బోధనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాలను గ్రహించి అన్ని వర్గాల ప్రజలు మాతృభాష మాధ్యమానికి మద్దతు తెలపాలి.

ఆంగ్లం అవసరమే. ఆయితే ఆంగ్లభాష ఆంగ్లమాధ్యమం ద్వారా రాదు. ఎల్‌.కే.జీ. నుండి బీ.టెక్‌. వరకూ ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు పట్టుమని పది వాక్యాలు కూడా ఆంగ్లంలో రాయలేక ఫోవడమే దీనికి రుజువు. ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ఆంగ్లంలో ప్రత్యేకార్హతలూ, బోధనలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించితేనే పిల్లలకు ఆంగ్లం వస్తుంది. ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోగానీ లేదా అటు ప్రైవేటు పాఠశాలల్లోగానీ అటువంటి ఉపాధ్యాయ పోస్టులు లేవు. అందుకే ఎవరికీ ఆంగ్లం రావడంలేదు. ఆంగ్లాన్నీ ఒక పాఠ్యవిషయంగా బోధించాలి. కాగా లెక్కలు, సైన్సు మరియు సోషల్‌ వంటి ఇతర పాఠ్య విషయాలను మాతృభాషా మాధ్యమంలో బోధించాలి. మాతృభాషా మాధ్యమం కారకు మరియు ఆంగ్ల భాష మెరుగైన బోధన కొరకు ఈ ఆన్‌లైన్‌ మహజరుపై సంతకం చేయగలందులకు విజ్ఞప్తి.

-మాతృభాషా మాధ్యమ వేదిక

భాష, విద్యా, విజ్ఞాన వేదికలు: 1) తెలుగు భాషోద్యమ సమాఖ్య, 2) విద్యా వికాస వేదిక, 3) విద్యాపరిరక్షణ కమిటి, 4) తెలుగు భాషాశాస్త్రజ్హుల వేదిక, 5) జన విజ్ఞాన వేదిక, 6) ప్రజాసైన్సు వేదిక. ఉపాధ్యాయ సంఘాలు:1) యు.టి.యఫ్‌ 2) ఎస్‌.టీ.యూ 3) ఎ.పి.టి.యఫ్‌ (257) 4) ఎ.పి.టి.యఫ్‌ (1938) 5) డి.టి.యఫ్‌. విద్యార్థి సంఘాలు:1) ఏ.ఐ.యస్‌.యఫ్‌.. 2) పి.డి.యస్‌.యు., 3) యస్‌.యఫ్‌.ఐ., 4)పి.డి.యస్‌.యు. సాహిత్య సాంస్కృతిక సంస్థలు: 1) అభ్యుదయ రచయితల సంఘం 2.) సాహితీ స్రవంతి ౩.) జనసాహితి 4)విష్లవ రచయితల సంఘం 5.) జాషువా సాంస్కృతిక వేదిక 6.)ప్రజానాట్య మండలి .

ఈ క్రింది రెండింటిలో ఏదో ఒక పద్ధతిలో మీ అన్‌లైన్‌ పిటీషన్‌ను ముఖ్యమంత్రి గారికి పంపించవచ్చును

http://chng.it/ykkQq9bXDS ఈ లింకును తెరచి, అందులో సూచించిన ప్రకారం అన్‌లైన్‌ పిటీషన్‌ను పంపండి

2వ పుట (అట్టలోపలి పుట) చూడండి

ఈ QR కోడ్‌ను స్మాన్‌ చేసి అందులో సూచించిన ప్రకారం అన్‌లైన్‌ పిటీషన్‌ను పంపండి


పాఠక మిత్రులకు విజ్ఞప్తి

ఈ ఆన్‌లైన్‌ మహజరును ఎవరైనా పంపవచ్చును. 'అమ్మనుడి పాఠకులు అందరూ పంపించాలని కోరుతున్నాము. మీ మిత్రులను కూడా ప్రోత్సహించి, వారి నుంచి కూడా పంపించుటకు చొరవ తీసుకోవలసిందిగా విజపి చేస్తున్నాము.

-సంపాదకుడు