అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020
ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ
మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి.
మాతృభాషా మాధ్యమ వేదిక ఆన్ లైను మహజరు
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహనరెడ్డి గారికి,
అయ్యా,
విషయం: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలోనూ మాతృభాషా మాధ్యమ విధానం- అమలు గురించిన విన్నపం --
మాతృభాషలో విద్యను అభ్యసించడం బాలల హక్కు మాతృభాషా మాధ్యమంలో అయితే విద్య బాలలకు సహజంగానూ మరియు సులభంగానూ ఉంటుంది. కష్టపడి చదువుకోవడంగా కాక ఇష్టపడి చదువుకోవడంగా ఉంటుంది. మాతృభాషా మాధ్యమం బాలలలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. పరాయి భాషామాధ్యమంలో విద్య వారి సృజనాత్మకతను తుంచివేస్తుంది. ఆ కారణంగానే మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి జాతీయ నాయకులు కూడా మాతృభాషా మాధ్యమాన్ని గట్టిగా సిఫారసు చేశారు. భారత రాజ్యాంగం పాఠశాల స్థాయిలో మాతృభాషా మాధ్యమ ఆవశ్యకతను ఎంత గట్టిగా నొక్కి చెబుతుందంటే, ప్రతి రాష్ట్రంలోనూ భాషా మైనారిటీలకు కూడా మాతృభాషా మాధ్యమాన్ని అందుబాటులో ఉంచాలని అధికరణం 350 (ఎ) ద్వారా నిర్దేశించింది. బహుళ ప్రాచుర్యం పొందిన కొఠారీ కమీషన్ నుంచి ఈ మధ్యనే తన నివేదికను ఇచ్చిన కస్తూరిరంగన్ కమిటీ వరకూ కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయమని సిఫారసు చేసినాయి. ఇక జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణా సంస్థ 2005లో విడుదల చేసిన జాతీయ పాఠ్య ప్రణాళిక గూడా పాఠశాల విద్య మాతృభాషా మాధ్యమంలో సాగాలని నిర్దేశిస్తోంది. ప్రపంచంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు సాధించిన ఫిన్లాండు దేశం కూడా మాతృభాషా మాధ్యమాన్నే అమలుచేస్తోంది. ప్రపంచ దేశాలకు విద్యాపరమైన దిశానిర్దేశం చేసే యునెస్కో మాతృభాషా మాధ్యమాన్నే సిఫారసు చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక దేశాలు వివిధ స్థాయిలవరకూ మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేస్తున్నాయి. పరాయి భాషలో విద్య బాలలను సమాజం నుంచి పరాయీకరిస్తుంది. అంతేకాదు, బాలలు తమ నుండి తాముకూడా పరాయీకరణ పొందుతారు. వారిలో అసహన మనస్తత్వం పెరుగుతుంది. వివిధ భాషలు తమ ఉనికిని కోల్పోతాయి. భాషతోపాటు ఆ భాషను మాట్లాడే జాతి తమ సాంస్కృతిక వారసత్వాన్ని పొగొట్టుకుంటుంది. తెలుగుజాతి తన గుర్తింపును కోల్పోతుంది. కుటుంబ ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా బాలలందరికీ మాతృభాషా మాధ్యమమే మంచిది. చివరిగా 2010 ఏప్రిల్ 1 నుండి అమలు జరుగుతున్న కేంద్ర 'బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009' కూడా 8వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలని నిర్దేశిస్తోంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలలో మాతృభాషా మాధ్యమానికి అనుకూలంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొనవలసినదిగా మిమ్ములను కోరుతున్నాం.
బాలలు ఆంగ్ల భాష నేర్చుకోవడం చాలా అవసరమనే విషయంలో మీతో ఏకీభవిస్తాం. ఆయితే ఆంగ్ల మాధ్యమం ద్వారా ఆంగ్లభాష రాదు. ఎల్.కే.జీ. నుండి ఇంజనీరింగు వరకూ ఆంగ్లమాధ్యమంలో చదివినవారు ఈనాడు పట్టుమని పది వాక్యాలు ఆంగ్లంలో రాయలేరనే విషయం మీకు తెలిసిందే. మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లం ఒక పాఠ్య విషయంగా ఉంది. కానీ దానిని బోధించడానికి ప్రత్యేకమైన పోస్టు లేదు. బాలలకు ఒకటో తరగతి నుండి మంచి ప్రమాణాలతో ఆంగ్లాన్ని నేర్పడానికి ప్రాథమిక పాఠశాలలలో విద్యాహక్కు చట్టానికి అదనంగా ప్రత్యేక విద్యార్హతలు మరియు శిక్షణ నిబంధనలతో ఒక ఉపాధ్యాయ పోస్టును ప్రభుత్వరంగ పాఠశాలలకు మంజూరు చేయాలనీ అలాగే అటువంటి ఉపాధ్యాయుల నియామకం అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలకు కూడా తప్పనిసరి చేయాలని ఇందుమూలంగా కోరుతున్నాం.
తప్పక చేయవలసినవి: 1. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ కేంద్ర విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి., 2. ఒకటవ తరగతి నుంచి ఆంగ్లాన్ని సమర్థవంతంగా బోధించడానికి ప్రత్యేక విద్యార్హతలూ మరియు శిక్షణ పొందిన ఒక ఉపాధ్యాయ పోస్టును ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకూ అదనంగా మంజూరు చేయాలి, అటువంటి ఉపాధ్యాయుల నియామకం అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలకు కూడా తప్పనిసరి చేయాలి., 3. విద్యార్థి మాతృభాషను ఒక పాఠ్యవిషయంగా పాఠశాల మరియు ఇంటర్ తోసహా డిగ్రీ రెండవ సంవత్సరం వరకూ అమలుచేయాలి., 4. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే నింపాలి., 5. విద్యావ్యాపారాన్ని రద్దు చేసి పేద ధనిక తారతమ్యాలు లేకుండా కామన్ స్కూలు విధానాన్ని అమలు చేయాలి. సంప్రదించుటకు:
- డా. సామల రమేష్ బాబు, 9848016136
- మాతృభాషా మాధ్యమ వేదిక
- పి.డి.ఎఫ్. కార్యాలయం, 27-31-11, విజయవాడ 520002
- (6 వ పుటలో వివరాలను చూడండి)
లోపలి పుటలలో....
సంపాదకహృదయం: సుప్రీంకోర్టు సన్నిధిలో బోధనామాధ్యమ సమస్య... 06
ప్రత్యేక వ్యాసం: ఆంగ్ల మాధ్యమంపై కోర్టుతీర్పు... 09
కవిత: సంస్కృతిపై అధికారం.. డా. వావిలాల సుబ్బారావు… 13
లిపి చొరబాటు: తెలుగులో తమిళ అక్షరాలా... 14
కవిత: భూగోళానికి తాళం.. డా. సి. భవానీదేవి… 15
తిరగమోత: ప్రజల భాష (మాండలికం)... 16
సంప్రదాయం-సాధికారిత: ఎండమావి నీళ్ళు….. డా. పి. శివరామకృష్ణ ’శక్తి’… 17
అసలు సంగతి: తరగతి గదిలో తెలుగు.. సి. వి. కృష్ణయ్య… 21
ప్రత్యేక వ్యాసం: ’భీమ్’ ఆశించిన బౌద్ధం.. వెన్నెలకంటి రామారావు… 23
శ్రద్ధాంజలి: అక్షరాల వెలుగులో.. డా. గోవిందరాజు చక్రధర్… 27
జగమునేలిన తెలుగు - 8.. డి. పి. అనూరాధ ... 30
వ్యాస పరంపర: పడమటి గాలిలో..2.. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి… 35
సాహిత్య రంగం: రచన-ప్రతిరచన.. డా. మధురాంతకం నరేంద్ర… 38
కవిత: కరోనా నానీలు.. డా. కలువకుంట రామకృష్ణ… 40
ధారావాహిక: సొతంత్రకాల సదువులు-11.. నంద్యాల నారాయణరెడ్డి… 41
కోవిడ్-19: కరోన కార్పొరేట్ విధాన వైపరీత్యం.. మాదిరాజు సునీత… 45
యాత్రా సాహిత్యం: ఆమె లేఖలు.. డా. కాళిదాసు పురుషోత్తం… 48
పుస్తక సమీక్షలు.. ఎం. వి. శాస్త్రి… 50 తెలుగుజాతి పతిక అమ్మనుడి మాసపత్రిక నుడి నాడు - నెనరు చందా వివరాలు - వ్యక్తులకు సంస్థలకు విదేశీయులకు రూ.7500 శాశ్వత చందా
రూ.5000 5 సం॥
రూ. 1000 రూ.1500 150 డాలర్లు 3 సం॥
రూ. 700 1 Joll
- రూ.240
రూ.1000 75 డాలర్లు రూ. 40025 డాలర్లు ఎం.ఓ. లేదా తెనాలిలో చెల్లునట్లు బ్యాంకు డి.డి.ని 'అమ్మనుడి' పేర పంపాలి. చెక్కు పంపేట్లయితే దయచేసి అదనంగా రు.30 లు చేర్చి పంపండి. ఆన్లైన్ ద్వారా చందాను పంపేవారు NEFT / RTGS ద్వారా 'అమ్మనుడి' - యాక్సిస్ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. AMMA NUDI-AXIS BANK, TENALI అక్కౌంట్ నెం. 915020010550189 IFSC Code : UTIB0000556 ఆన్లైన్ చందాను పంపినవారు, ఆ వెంటనే దయతో చిరునామా, ఫోన్ నెం. తదితర వివరాలను జాబుద్వారాగాని, ఫోన్ మెసేజి ద్వారాగాని తెలుపగలరు. చందాలు పంపడం, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా డా॥ సామల లక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి' 8-386, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి గుంటూరు జిల్లా 522 211. ఫోన్ : 9440448244 ఇ-మెయిల్ : ammanudi2015@gmail.com చందాదారులు కోరినట్లయితే ఆన్లైన్లో కూడా పత్రికను పంప గలము. ఇందుకోసం మీ ఇ-మెయిల్ ఐడిని తప్పక తెలుపగలరు. చందాదారులకు సూచనలు 1. చందా కాలం ముగింపు తేదీ - పత్రిక కవరుమీద మీ చిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి. 2. చందా పూర్తయ్యేందుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి. 3. మీ ఇంటి నెంబరుతో పూర్తి చిరునామాను, పిన్ కోడ్ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్ నెంబరును, వుంటే మీ మెయిల్ ఐడి ని తెలపాలి. 4. మీ చిరునామా మారినట్లయితే దయచేసి వెంటనే తెలియజేయండి. 'అమ్మనుడి' ఈ క్రిందిచోట్ల కూడ లభిస్తుంది నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ భవనం ఎదురుగా, కాచిగుడా. హైదరాబాదు - 27. ఫోన్ : 040-24652387 మైత్రీ బుక్ హౌస్, జలీల్ వీధి, కార్మిర్కారోడ్డు (ఏలూరు రోడ్డు) విజయవాడ - 2. ఫోన్ : 9866211995 మణి బుక్ ల్, షాప్ నెం.58, సండే మార్కెట్, నెల్లూరు-1. జులై 2020 | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి తాపీ ధర్మారావు పురస్కారం భారతీయ కవితాత్మను ఆవిష్కరించిన 'అదేనేల' రచయిత యల్లపు ముకుంద రామారావు గారికి ప్రముఖకవి, అనువాదకుడు యల్లపు ముకుంద రామారావు గారిని తాపీధర్మారావు పురస్కారంతో సత్కరించడానికి నిర్ణయించడమైనదని తెలుపుటకు సంతోషిస్తున్నాము. 'అనువాద కళని ఆపోశన పట్టిన రామారావు, యిప్పుడు 'అదే నేల' ద్వారా, భారతదేశంలోని భిన్నభాషల్లో విలసిల్లిన కవిత్వాన్ని, వాటి చారిత్రక నేపథ్యంతో సహా, మనముందు కుప్పబోసి దేశీయ సాహిత్య ప్రపంచంలోకి తనదైన శైలితో ఆహ్వానిస్తున్నారు. వందలాది భారతీయ భాషల నుంచి, దాదాపు మూడు వేల మంది కవుల్ని యీ గ్రంథం ద్వారా ఆయన పరిచయం చేస్తున్నారు. ఏడు వందలకు పైగా కవితల్ని అనువదించి, దేశంలోని భిన్న భాషాజాతుల అస్తిత్వాన్ని గుర్తించి గౌరవిస్తూనే, వాటిమధ్య ఐక్యత కోసం ఒక వారధిని నిర్మిస్తున్నారు. ప్రాంతం, జాతి, భాష యేదైనా దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్ధం చేసుకొని దాన్ని కాపాడుకోడానికి, కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకూ, భిన్నకాలాల్లో వెల్లివిరిసిన భారతీయ కవిత్వం దోహదపడుతుందనీ, వైవిధ్యమే యీ దేశపు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అనీ 'అదే నేల' గ్రంథం మరోసారి నిరూపిస్తుంది. 7 సన్మానసభ తేదీ, సమయం మున్నగు వివరాలను ఆగస్టునెల 'అమ్మనుడి'లో ప్రకటించగలము. -సంపాదకుడు, అమ్మనుడి 9848016136
4 మలేసియాలో తెలుగు రక్షకుడు, ఉపాధ్యాయుడు
బుద్ద అప్పలనాయుడు
మలేసియా (మలయా) ప్రవాసాంద్ర ప్రముఖుడు బుద్ద అప్పల నాయుడు మాష్టరు (100 సం॥) 2020 మే 5తేదీన (మంగళవారం), మలయాలో మధ్యాహ్నం మృతి చెందారు.
అనకాపల్లి గవరపాలెంకు చెందిన బుద్ద మహలక్ష్మమ్మ, బుద్ద మారయ్య దంపతులు తమ ముగ్గురు సంతానం కుమారుల్ని వెంటతీసుకుని 1928లో మలేషియాకు వలసవెళ్లి పోయారు. వారి సంతానంలో రెండోవాడైన అప్పలనాయుడు అక్కడే చదువుకొని, ఉపాధ్యాయునిగా వృత్తి నిర్వహణలో తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. మలేసియా కెడా రాష్ట్రానికి చెందిన పెలాం ఎస్టేటులోని తెలుగు పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు.
వృత్తి రీత్యాను, ఇతర సాంఘిక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మలేషియా తెలుగు సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన అప్పలనాయుడు మాష్టరును, మలేసియా రాజు 1978లో ఆదేశంలోని అత్యున్నత పురస్కారం పి.జె.కె. బిరుదుతో సత్మరించారు. రెండు, మూడు తరాల మలేసియా ప్రవాసాంధ్రులు ఆయన వద్ద విద్యనభ్యసించిన వారే. ఆయనకు ఆరుగురు కుమార్తెలు. వారిలో ముగ్గురు కుమార్తెలు ఇప్పుడు విశాఖ జిల్లాలో వుండగా, రెండో కుమార్తె డా॥ మార్గరెట్ లండన్లో ప్రముఖవైద్యురాలు. ఇద్దరు కుమార్తెలు మలయాలోనే నివసిస్తున్నారు. 1955లో స్థాపించిన మలేసియా 'కూలిం' శాఖకు చాలా సంవత్సరాల పాటు అధ్యక్షునిగా వ్యవహరించారు. గత ఏడాది మరణించిన మలేసియా తెలుగు సంఘం వ్యవస్థాపకులు ముదిని సోమునాయుడుకు అత్యంత సన్నిహితునిగా సంఘ కార్యక్రమాలలో పాలుపంచుకున్న తెలుగు భక్తుడు.
మలేసియాకు వలస వెళ్లిన తొలి తరం తెలుగు వారు పడిన కష్టాలను చిత్రిస్తూ 2006వ సం॥లో 'మధుర స్మృతులు పేరిట కొన్ని కధలు రాశారు. తొలి తరం తెలుగు వారి వాడుకభాషను అప్పలనాయుడు గొప్పగా చిత్రించారని పలువురు భాషాభిమానులు కీర్తించారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
నూకాంబిక భక్తుడయిన అప్పలనాయుడు మాష్టరు దేవస్థానం మండపం విస్తరణకు భూరీవిరాళం అందజేశారని నూకాంబికా దేవస్థానం మాజీ ఛైర్మన్ (మాష్టరి అల్లుడు) కొణతల వెంకటరావు తెలిపారు. తెలుగు మాత ముద్దు బిడ్డ, విశాఖజిల్లా భూమి పుత్రుడు బుద్ద అప్పలనాయుడు అనకాపల్లికి మలయాలో మంచి గుర్తింపు తెచ్చారని సీనియర్ జర్చలిస్ట్ బి.వి. అప్పారావు నివాళులర్సించారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య
“క్రీ.శే. ముదిని సోమినాయిడుగారితో పాటు బుద్ద అప్పలనాయుడుగారు “నడుస్తున్న చరిత్ర " అభిమానులుగా నాకు ఆస్తులు. సుదూర దేశాలకు వలసవెళ్లినా అక్కడ తమ అమ్మనుడి తెలుగుకోసం జీవితమంతా శ్రమించిన వీరు తెలుగు జాతి వారందరకూ ఆదర్శం - అంటూ వారిరువురికి తెలుగు భాషోద్యమ సమాఖ్మ అధ్యక్షుడు డా॥ సామల రమేష్బాబు నివాళులర్చించారు.
“అమ్మనుడి చదువరులకు విన్నపం
కరోనా మహమ్మారి కాటు వల్ల మూడు నెలలపాటు పత్రికలను ప్రచురించలేకపోయాం. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలో మన దేశమూ, ప్రాంతమూ కూడా లాక్డౌన్లో ఒదిగిపోవలసివచ్చినందున ఈ పరిస్థితి ఏర్పడిందని మన అందరకూ తెలిసిందే.
మార్చి నెల చివరివారంలో లాక్డౌన్ ప్రకటించడంతో మూడు వంతులు సిద్ధమైన ఏప్రిల్ నెల సంచికను పూర్తి చేయకుండా ఆపివేయవలసివచ్చింది. ఇప్పుడు 'లాక్డౌన్'లో సడలింపు ఏర్పడడంతో - పత్రికలో కొన్ని మార్చులు చోటుచేసుకున్నాయి. పాత వార్తావిశేషాలను కొన్నిటిని తొలగించి, కొన్ని కొత్త అంశాలను చేర్చవలసి వచ్చింది. జులై సంచికగా దీనిని వెలువరిస్తున్నా ఏప్రిల్, మే, జూన్ నెలలతో కలుపుకొన్న సంచికగా స్వీకరించ ప్రార్ధన.
ఏప్రిల్ మే, జూన్ సంచికలను అందజేయలేనందుకు చింతిస్తూ, ఎప్పటివలెనే పాఠకులు పత్రికకు తమ ఆదరాభిమానములను అందించగోరుచున్నాము.
- సంపాదకుడు
ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ
మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి
(మాతృభామా మాధ్యమ వేదిక ప్రారంభించిన ఆన్లైన్ మహజరు)
ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటి లోనూ విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలనే డిమాండు సాధనకై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించిన ఈ ఆన్లైన్ మహజరుకు మీ ఆమోదం తెలియజేయగలందులకు విజ్ఞప్తి.
ఈ పిటీషన్ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే సంబంధించినది కాదు. ప్రైవేటు పాఠశాలలకు కూడా విద్యాహక్కు చట్టం వర్తిస్తుంది. ప్రైవేటు పాఠశాల్లలోకూడా ఎనిమిదవ తరగతివరకు మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి. మధ్య తరగతి వారు మాతృభాషా మాధ్యమమే తమ బాలల సమగ్రాభివృద్ధికి మంచిదనే విషయాన్ని గ్రహిస్తే వారి బాలలకు, ప్రజల భాషలకూ మరియు విస్తృత సమాజానికి మంచిది. ఒక వైపు ప్రైవేటు విద్య, మరొక వైపు ఆంగ్లమాధ్యమం ద్వారా బాలలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తల్లితండ్రులు గమనించాలి. తమ స్వంత భాషలో బాలలు ఇష్టంగా, ఉత్సాహంగా, సృజనాత్మకంగా విద్య నేర్చుకొాంటారని ప్రపంచ వ్యాప్తంగా మేధావులు చెబుతున్నారు. అంతేకాదు, మాతృభాష ద్వారానే ఇంగ్లీషుతో సహా ఇతర భాషలు బాగా నేర్చుకోవచ్చని బోధనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాలను గ్రహించి అన్ని వర్గాల ప్రజలు మాతృభాష మాధ్యమానికి మద్దతు తెలపాలి.
ఆంగ్లం అవసరమే. ఆయితే ఆంగ్లభాష ఆంగ్లమాధ్యమం ద్వారా రాదు. ఎల్.కే.జీ. నుండి బీ.టెక్. వరకూ ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు పట్టుమని పది వాక్యాలు కూడా ఆంగ్లంలో రాయలేక ఫోవడమే దీనికి రుజువు. ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ఆంగ్లంలో ప్రత్యేకార్హతలూ, బోధనలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించితేనే పిల్లలకు ఆంగ్లం వస్తుంది. ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోగానీ లేదా అటు ప్రైవేటు పాఠశాలల్లోగానీ అటువంటి ఉపాధ్యాయ పోస్టులు లేవు. అందుకే ఎవరికీ ఆంగ్లం రావడంలేదు. ఆంగ్లాన్నీ ఒక పాఠ్యవిషయంగా బోధించాలి. కాగా లెక్కలు, సైన్సు మరియు సోషల్ వంటి ఇతర పాఠ్య విషయాలను మాతృభాషా మాధ్యమంలో బోధించాలి. మాతృభాషా మాధ్యమం కారకు మరియు ఆంగ్ల భాష మెరుగైన బోధన కొరకు ఈ ఆన్లైన్ మహజరుపై సంతకం చేయగలందులకు విజ్ఞప్తి.
-మాతృభాషా మాధ్యమ వేదిక
భాష, విద్యా, విజ్ఞాన వేదికలు: 1) తెలుగు భాషోద్యమ సమాఖ్య, 2) విద్యా వికాస వేదిక, 3) విద్యాపరిరక్షణ కమిటి, 4) తెలుగు భాషాశాస్త్రజ్హుల వేదిక, 5) జన విజ్ఞాన వేదిక, 6) ప్రజాసైన్సు వేదిక. ఉపాధ్యాయ సంఘాలు:1) యు.టి.యఫ్ 2) ఎస్.టీ.యూ 3) ఎ.పి.టి.యఫ్ (257) 4) ఎ.పి.టి.యఫ్ (1938) 5) డి.టి.యఫ్. విద్యార్థి సంఘాలు:1) ఏ.ఐ.యస్.యఫ్.. 2) పి.డి.యస్.యు., 3) యస్.యఫ్.ఐ., 4)పి.డి.యస్.యు. సాహిత్య సాంస్కృతిక సంస్థలు: 1) అభ్యుదయ రచయితల సంఘం 2.) సాహితీ స్రవంతి ౩.) జనసాహితి 4)విష్లవ రచయితల సంఘం 5.) జాషువా సాంస్కృతిక వేదిక 6.)ప్రజానాట్య మండలి .
ఈ క్రింది రెండింటిలో ఏదో ఒక పద్ధతిలో మీ అన్లైన్ పిటీషన్ను ముఖ్యమంత్రి గారికి పంపించవచ్చును
http://chng.it/ykkQq9bXDS ఈ లింకును తెరచి, అందులో సూచించిన ప్రకారం అన్లైన్ పిటీషన్ను పంపండి
2వ పుట (అట్టలోపలి పుట) చూడండి
ఈ QR కోడ్ను స్మాన్ చేసి అందులో సూచించిన ప్రకారం అన్లైన్ పిటీషన్ను పంపండి
పాఠక మిత్రులకు విజ్ఞప్తి
ఈ ఆన్లైన్ మహజరును ఎవరైనా పంపవచ్చును. 'అమ్మనుడి పాఠకులు అందరూ పంపించాలని కోరుతున్నాము. మీ మిత్రులను కూడా ప్రోత్సహించి, వారి నుంచి కూడా పంపించుటకు చొరవ తీసుకోవలసిందిగా విజపి చేస్తున్నాము.
- -సంపాదకుడు