అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఆమె లేఖలు

వికీసోర్స్ నుండి

యాత్రాసాహిత్యం

మూల ర్లచన : జూలియా చార్లోటి

అనువాదం : కీ.శే. పెన్నేపల్లి గోపాలకృష్ణ

డా. కాళిదాసు పురుషోత్తం

90006 42079

ఆమె లేఖలు

(గత సంచిక తరువాయి...)

13వ లేఖ

“ఈ దేశంలో స్త్రీ పురుషుడికంటే వందరెట్లు హీనం. స్త్రీ అంటే నిర్లక్ష్యం, నిరాదరణ. స్త్రీ విద్య వినాశనమేనని ఇక్కడి ప్రజల నమ్మకం.”

అక్టోబరు 31వ తేది ఉత్తరంలో 'ఆమె' చిన్న సంఘటనను వివరిస్తూ ముగింపుగా పై అభిప్రాయం వెలిబుచ్చుతుంది.

జడ్జిదంపతులు రాజమండ్రిలో నేటివు స్కూలు నెలకొల్పాలని అనుకొంటారు. తగిన ఉపాధ్యాయుడి కోసం వెదుకుతున్నారు కూడా. స్మూలు నెలకొల్పుతున్నట్లు నేటివులకు తెలియజేయడం, వారి పిల్లల్ని పంపుతామని మాట తీసుకోడం కూడా మరోవైపు జరుగుతోంది. ఇలా వుండగా శ్రీనివాసరావు అనే కోర్టు ఉద్యోగి (పోస్టాఫీసు హెడ్‌ రైటర్‌) జడ్జిగారిని చూడడానికి వచ్చాడు.

పిల్లల్ని స్కూలుకు పిలుచుకొచ్చే బాధ్యత తాను వహిస్తానని అన్నాడు. “ఆడపిల్లల స్కూలు పెడితే పిల్లలు వస్తారా?” జడ్జిగారు అతన్ని అడిగారు.

“రారండీ! అయినా ఆడపిల్లలకి చదువెందుకండీ!” అని సమాధానమిచ్చాడు. ఈ విషయాన్ని గురించి చాలా సేపు చర్చ సాగింది. కానీ శ్రీనివానరావు మాత్రం తన అభిప్రాయం మార్చుకోలేదు. స్త్రీలు చదువుకొంటే, అరిష్టం దావురిస్తుందని, బంధువులకు ఏదో కీడు మూడుతుందనీ, ముఖ్యంగా తల్లికో, తండ్రికో చావు తప్పకపోవచ్చునని అతను కచ్చితంగా అన్నాడు.

“మరి నేను చదువుకొన్నాను గదా, మా అమ్మవాళ్లు నిక్షేపంగా వున్నారే. యూరోపియన్‌ స్త్రీలందరూ చదువుకొన్నవారే, అయినా అందువల్ల వాళ్ళ చుట్టాలకు ఏ అరిష్టమూ జరగలేదే” అని ఆమె వాదించింది. ఐనా అతను వొప్పుకోలేదు -

“యూరోవియన్లకేం పర్వాలేదు, వాళ్లకేం కాదు, ఎటొచ్చీ నేటివులం మాకే ముప్పు” అన్నాడు అతను. అదంతా నిజం కాదని, నేటివులు బాగుపడకుండా చేసేందుకు ఏ పిశాచమో వాళ్ల తలల్లో ఈ ఆలోచన రేపి పెట్టిందని జడ్జిగారు నచ్చజెప్పబోతే -

శ్రీనివానరావు - “మీరు చెప్పేది నిజమైతే కావచ్చుగానీ, ఆడపిల్లలకు అంత తెలివితేటలు లేవుకదా, వాళ్లకు చదువెట్లా వస్తుందండీ?” అని ఎదురు ప్రశ్న వేశాడు. స్త్రీలు కుటిలస్వభావులని, అబద్దాలకోరులని, నీచులని కూడా ఇక్కడి వాళ్లు భావిస్తారంటూ, ఆమె యూరోపియన్‌ బాలురకు సహాయకులుగా స్త్రీలను నియమించడం ప్రమాదమనే అభిప్రాయం వ్యక్తపరుస్తుంది. ఆడవాళ్లు నమ్మకస్తులుకాదనే అభిప్రాయంతో పిల్లల్ని ఎత్తుకొని తిప్పడానికి మగవాళ్లను నియమించుకౌంటున్నారని ఈ సందర్భంలో వ్యాఖ్యానిస్తుంది.

స్కూలు ఏర్పాట్లు, సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంచి ఉపాధ్యాయుడు దొరకడం కష్టంగా ఉంది. రాజమండ్రి ప్రాంతాల్లో నేటివు క్రైస్తవులు లేరు. హిందువులను (11621609) నియమించడం జడ్జిదంపతులకు ఇష్టం లేదు. ఆదివారంనాడు అనుకోకుండా ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతన్ని ఇదివరకెప్పుడూ జడ్జిగారు చూడలేదు. అతన్ని గురించి వాకబుచేయగా, ఏదో కోర్టు వ్యవహారం మీద రాజమండ్రి వచ్చాడని, రెండు రోజులుంటాడని, ఇంగ్లీషు బాగా అర్థం చేనుకోగలడని, దస్తూరి, ఉచ్చారణ బాగుంటాయని తెలిసింది. అతడు చర్చికి రావడాన్ని బట్టి గౌరవస్థుడే ననిపించిందంటుంది ఆమె. జడ్జిగారు అతనికి జాబు రాశారు, స్కూల్లో ఉపాధ్యాయుడుగా చేరమని.

చివరకు 25 మంది మగ పిల్లలతో స్కూలు ప్రారంభమైనట్లు అదే ఉత్తరంలో నవంబరు 23న రాసింది. స్మూల్లో చేరిన వారంతా పై కులాలవారే. బడికి అస్పృశ్యులను (౧౫129) తీసుకొని రావడం కంటే పై కులాల వారిని తీనుకొని రావడం కచ్చం గనక, పైకులాలవారికి చదువు చెప్పడమే మంచిదని, పై కులాలవారు చదువుకోడమే మేలని జడ్జిగారి అఖిప్రాయమని ఆమె ఆ ఉత్తరంలో రాస్తుంది. స్కూల్లో తెలుగు బోధించడాని కొక బ్రాహ్మణుడు, ఇంగ్లీషుకి దేవిడ్‌ గంజాల్వ్‌స్‌ (౧౪/6 60౧94/09) అనే మిశ్ర జుతి వ్యక్తి (౧౫1 0౬90) కుదిరారు.

ఒక రోజు ఉదయాన్నే ఆమె స్కూలు చూడ్డానికి వెళ్లింది. పొద్దున ఆరు గంటలకే బడికి రావడం ఇక్కడ పిల్లలకు అలవాటు. స్కూల్లో కులాలవారీగా పిల్లలు కూచుంటారు. బ్రాహ్మణ, వైశ్యుల పిల్లలు ఒకచోట, “మూవీ” (పనివాళ్ల) పిల్లలు మరొక వరస, ముస్లిం బాలురు ఇంకోవరస - ఇట్లా వుంటుంది ఏర్పాటు. వీళ్లందరి వెనక పెద్దవాళ్లు - వాళ్ళు తమాషా చూద్దానికి వస్తారు. చిక్కంతా వాళ్లతోనే! ఎప్పుడూ మాట్లాడుతుంటారు. అందుకే వాళ్లను పరీక్షలపుడు మాత్రమే బడికి రానివ్వాలని అనుకొన్నారు.

పుస్తకాలు చాలా ఖరీదు కావడం వల్ల కొద్దిగానే తెప్పించారు. స్కూలుకయ్యే మొత్తం ఖర్చును జడ్జిదంపతులు, హామిల్టన్‌ దంపతులు భరించుకోవాలి. అందువల్ల పిల్లలకు బాగా ఉపకరించే మంచి పుస్తకాలు మాత్రమే కొంటున్నారు. స్పెల్లింగులు నేర్చుకొనే పుస్తకాలు కాకుండా, చదవడానికి కూడా పనికొచ్చే పుస్తకాలు మాత్రమే తెప్పించారు. అక్షరాలు, స్పెల్లింగులు, మొదటి పాఠాలను ఆమె పెద్ద అట్టమీద రాసింది. ఒక అట్టమీద రాస్తే, పిల్లలందరూ నేర్చుకుంటారు. అవి పుస్తకాల్లా ఉపయోగపడుతున్నాయి. స్కూలు గది చుట్టూ ఆమె అలాంటి అట్టలు తగిలించింది. పిల్లలకు మొదటిసారి ౧౪౫౧౫ 0/ 4-8.ను ఆమె ఎంపిక చేసింది. ఇలాంటి అట్టలు మద్రాసు నుంచి తెప్పించుకోవచ్చు, కానీ వాతావరణం అనుకూలంగా లేనందువల్ల ఓడల రాకపోకలు నత్రమంగా లేవు, రోడ్డు మీద పంపాలంటే ఆలస్యమవుతుంది. అప్పటిదాకా పిల్లలు వేచివుండడం ఆమె కిష్టం లేదు. తన బోధనలతో పిల్లల్ని వెంటనే క్రైస్తవులుగా మార్చెయ్యాలనే ఆశ ఆమెకూ లేదు కానీ, వాళ్లకు తాను “చేయదగింది యేదో చెయ్యాల"ని మాత్రం వుంది. ఇలాంటి స్కూలు నడపడం ఒక్కటే తాను చేయగలిగిందని ఆమె అంటుంది. “దేశమంతటా యిటువంటి పాఠశాలలు నెలకొల్పడం ద్వారా వాళ్ల మూఢత్వాన్ని రూపుమాపవచ్చునని నా ప్రగాఢ విశ్వాసం” అని ఆమె రాస్తుంది.

జడ్జిగారు రాజమండ్రిలో ఎంతకాలం వుండగలరో ఆమెకే తెలియదు, ఉద్యోగులలో చాలా మార్పులు జరుగుతున్నాయి గనక, తాము అవూళ్లో ఎక్కువ కాలం వుండకపోవచ్చునని అంటూ, ఇప్పుడు వాతావరణం ఎంతో హాయిగా వుందని, అందువల్ల ఇప్పట్లో ఈ వూరువదలి పోవాలనిపించడంలేదని, ఏమైనా వేసవిలోగా ఇక్కడి నుంచి బదిలీ అయితే బాగుంటుందని ఆమె రాస్తుంది. ఉష్ణోగ్రత 84-86 డిగ్రీల మధ్య వుంది. వేసవి వేదికి బాగా వేగిపోవడంతో ఆమె యిక్కడి వాతావరణానికి అలవాటుపడి, ఇప్పటి వాతావరణం ఆహ్ల్హాదకరంగా వున్నట్లు భావిస్తుంది. తెల్లవారు రూమునైతే 74 డిగ్రీలు వుంటుంది, అప్పుడు ఆ చలిలో 'క్లోక్‌' ధరించికానీ బయటకు వెళ్లలేనని ఆమె రాస్తుంది. “మా యింటి కిటికీలోంచి కనబడే సుందర దృశ్యం లాంటిది దేశంలో మరెక్కడా వుండదని అందరూ అంటారు. ఇప్పుడిప్పుడే మాతోటను చక్కగా పెంచుకొంటున్నాం. ఇక్కడ అంతా అనుకూలంగా, హాయిగా వుంది అని ఆమె చెప్పంది. వారి లాన్‌లో మూడు లేళ్లను పెంచారు. అవి అందంగా వుండి మచ్చికయ్యాయి. కొన్ని అందమైన అడవి నెమళ్లను కూడా ఆమె పెంచుతోంది.

రాత్రి వేటగాడు ఒక చిరుతపులిని చంపి తెచ్చాడు. అంత అందమైన జంతువును నిర్జాక్షిణ్యంగా కాల్చి చంపినందుకు మాకు విచారం కలిగింది. అవి పశువుల్ని చంపుతాయి గనక వాటిని వేటాడి తెచ్చిన వారికి ప్రభుత్వం బహుమతి నిస్తుంది. వాటి చర్మాన్ని కలెక్టరు తీసుకుంటాడు. “ఈ చిరుతపులి మా ప్రాంతంలో దొరికింది గనక, దాని చర్మాన్ని నాకు యివ్వమని అడగాలనుకుంటున్నాను” అంటుందామె.

“శీతాకాలం రాత్రులు జడ్జిగారి తోటలోకి తరచు నక్కలు, తోడేళ్లు వచ్చి అరుస్తూంటాయి. ఆ అరుపులు ఎవరో దీనంగా రోదిస్తున్నట్లు భయంకరంగా వుంటుంది. పిల్లి పసిబిడ్డను ఎత్తుకుపోయిందని ఎవరో చెప్పారు. చాలా భయపడ్డాను. తీరా విచారిస్తే పావురం పిల్లను ఎత్తుకొని పోయినట్లు తెలిసింది. బాతులు చాలా గుడ్లు పెట్టాయి. వాటిని పొదిగించమని జడ్జిగారు చెప్పారు (You must make little ducks). అందుకు బట్లరు “Sir, I shall do,” అని జవాబు చెప్తే నాకు నవ్వాగింది కాదు.” బట్లరు కోడిని పట్టుకొచ్చి గుడ్లతో బుట్టలో మూతవేసి పెట్టి కాసేపటికి నాలుగు పిల్లల్ని పొదిగినట్లు చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోయింది.

మద్రాసు మునీ నుంచి ఆమెకు జాబు వచ్చింది. తల్లీ బిడ్డల యోగక్షేమాలు విచారిస్తూ "the concern I have for your happiness as my matron, your state of health, and the state of my rising matron, your child” అని రాశాడు. అంటే Patronను స్త్రీ వాచకంగా అతడు భావించి నట్లున్నాడని ఆమె పరిహాసంగా రాస్తుంది.

ఆ దారంట వెళ్లే విదేశీయులకు ఆతిథ్యం యిచ్చిన చిన్న సంఘటనను ఆమె ఈ వుత్తరంలో పేర్కొన్నది -

ఒక సాయంకాలం హామిల్టన్‌ దంపతులు, మరికొంతమంది మిత్రులు ఆమె యింట్లో కూర్చొని కబుర్లు చెప్పుకొంటుంటే, కలెక్టరు సిఫారసుతో M.d. Ariel అనే ఫ్రెంచి వ్యాపార సంస్థల ప్రతినిధి వచ్చాడు. అతనికి ఇంగ్లీషు ఒక్కమాట రాదు, అక్కడున్న వారికి ఫెంచి అస్సలు రాదు. ఐనా ఎవరి భాషల్లో వారు మాట్లాడారు. ఇంగ్లీషు తెలియక పోయినా, స్థానిక భాషలు బొత్తిగా రాకపోయినా అతను మూగ సైగలతోనే మద్రాసు నుంచి 400 మైళ్లు ప్రయాణించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మరో రోజున ఖజానా మోసుకొచ్చే సిపాయిలపై అధికారి - పదిహేదేళ్ల (జూనియర్‌ ర్యాంక్‌ కమాండెంట్‌ ఆఫీసరు) యువకుడు గుర్రం మీద వచ్చాడు. అతను తన గుర్రాన్ని మనిషిలాగా భావిస్తూ దానితో మాట్లాడేవాడు. ఊరి పొలిమేరల్లో కొన్ని అడవి గుర్రాలు దాని మీద పడ్డాయి. “అప్పుడు దాని మీది జీను (bridle)ను తీసేసి నా పోనీని వాటిపైకి వదిలాను. అక్కడి వాళ్లు వాటిని విడదీయకుందా వుండి వుంటే నా పోనీటి అంతు తేల్చుకొని వుండేది. మావాడు అసాధ్యుడండీ!” అన్నాడతను. ఇక్కడ గుర్రాలను, కుక్కలను మేలురకం, తక్కునవరకం అంటూ రెండుగా విభజిస్తారని, అరబ్‌ అశ్వాలను మేలురకంవిగా, స్థానికజాతి గుర్రాలను తక్కునరకంవిగా అంటారని ఆమె రాస్తుంది. ఆమె వద్ద మేలురకం అశ్వం వుంది.

దానికి చాలా పొగరు. చుట్టుపక్కల పోనీ కనిపించినా సహించలేదు. అందుకని దానికాపరి ఎప్పుడూ దాని ముందు పరుగెత్తుతూ ఎదురుగా ఎక్కడా పోనీలు తారసపఢకుండా చూస్తాడని ఆమె చెప్తుంది. (తరువాయి వచ్చే సంచికలో...)


భ్రీమతి శివేగారి దేవమ్మ స్మారక పురస్కారం 2020లో ముద్రితమైన కవితా, కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నాము మూడేసి ప్రతులను డిసెంబర్‌ 31.12. 2020లోపు పంపవలేను. బహుమతి పొందిన కథల సంపుటానికి రూ. 7,000, కవితా సంపుటానికి రూ.7,000 నగదుతో సభలో పురస్కార ప్రధానం జరుగును. మీ ప్రతులు మాకు పంపవలెను.

మా చిరునామా: శివేగారి, కాలవపల్లి, ఎం.పీ కొటూరు (పోస్ట్‌) పలమనేరు (మండలం)

చిత్తూరు (జిల్లా) పిన్‌ కోడ్‌: 517408 సెల్‌: 6300318230

అవార్డు వ్యవస్థాపకులు: శివేగారి వివరాలకు: 6800318230


| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఈ అక్షోబరు-2020 |