అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/'నీకోసం, నీ మంచికోసం-సదా నీ అభిమానిగా ఉండిపోతాను'

వికీసోర్స్ నుండి

సంప్రదాయం - సాధికారత

డా॥ పి. శివరామకృష్ణ 'శక్తి'

94414 27977

'నీకోసం, నీ మంచికోసం-సదా నీ అభిమానిగా ఉండిపోతాను'-3

(“దేలెం ఒసం సకుని అసంగ్‌- దోహ్వానం సాయ తాయ” సవర పాట.)

(గత సంచిక తరువాయి...)

మొత్తంమీద, పరస్పర విరుద్ధ మైన దృక్సధాల, నాయకత్వాల, తాపత్రయాల నేపధ్యంలో, ఒకనాటి సవర దేశంలో ఉద్యోగవర్గం మధ్య పెరుగుతున్న మల్లిపురం జగదీశ్‌ వంటి గిరిజన రచయితలు, తమ మూలాలు తెలుసుకొని రాయాలని అతని కధాసంకలనం శిలకోల” ముందు మాటలో అతని సాహిత్యగురువు గంటేడ గౌరునాయుడు ఆశిస్తారు.

గిడసబారిన రోల్‌ మోడళ్ళు

“గిరిజనులకు రోల్‌ మోడళ్ళు లేరు. గిరిజన సాహిత్యం అంటే ఉద్యమ సాహిత్యం అనే పేరు పడిపోయింది, విశాఖ మన్యంలో 'లోల్లోసి' అనే పాటలు ఉండేవట అని 'బముళ లో జగదీశ్‌ అంటుంటే, ఆ వ్యాస సంకలనం సంపాదకుడు, శిలకోలలో ముందుమాట రాసిన జానపద సాహిత్యవేత్త ఏ.కే. ప్రభాకర్‌, అంబేద్మర్‌ సార్వతిక విద్యాలయం జానపద విజ్ఞానంకోర్సులో, తన వ్యాసాలతోపాటు ఉన్న గిరిజన సంస్కృతి మీద వ్యాసాన్ని గుర్తు చేయలేదు. నిజానిక్తి ఆ వ్యాసం, మొదటి తెలుగు (ప్రపంచ మహాసభలు(1976) ఆంగ్లంలో ప్రచురించిన, నాటి గిరిజన పరిశోధనాసంస్థ సంచాలకుడు డి.ఆర్‌. ప్రతాప్‌ చిన్న పుస్తూనికి సంప్రదాయ సాహిత్యగంధం అద్దింది. "నెలనెలా వెన్నెల సి.వి కృష్ణారావు మొదలుకుని నేటి వరకు ఎందరో రచయితలు ఆ కుదురునుంచి వచ్చారు. కాని ఇటువంటి ప్రయత్నం కాదుగద్హా అసలు ఆ జోలికే వెళ్ళలేదు.

ఎలాచూసినా మనకి గిరిజనసాహిత్యం తక్కువదే అనేభావం ఉంది" అంటారు “ఇప్పపూలు' ముందుమాటలో జయధీర్‌ తిరుమల రావు. 91లో విశాఖ ఐటి.డి.ఎ తెలుగు గిరిజన గీతాలు” (పరివర్ధిత ముద్రణ “కొండకోనలలో తెలుగు గిరిజనులు) 200 కాపీలు కొని ఉపాధ్యాయులకు పంచింది. వాటిలో ఆ 'లోల్లోసి్‌ పాటలున్నాయి. 1976లో అరకులోయలో గిరిజనులను అభివృద్ధి చేయటానికి జీవితం అంకితం చేసిన కెనదా దేశీయుడు గుస్తాఫ్‌ 'ఆదివాసీ పండుగలు” ఆ సంస్థ ప్రచురించింది. 'వారి ఆహార సేకరణ , ఉత్పత్తి దశలో సాగే వారి ఆదిమజీవితం లాగ్కే వారి పాట రూపం మార్పు లేకుందా ఉంది” (కే.ముత్యం 38) అంటూ తెలిసి తెలియక చేసే వ్యాఖ్యానాలకు, సవర జాతాపుల ఇటీవలి సంప్రదాయ పాటలను(నీకోసం ,నీ మంచికోసం సదా నీ అభిమానిగా ఉండిపోతాను' 'దేలెం ఒసం సకుని అసంగ్‌- దోహ్వానం సాయ తాయా) పార్వతీపురంలో ఆర్ట్స్‌ సంస్థ ప్రచురణ, బదులిచ్చినట్లుగా భావించ వచ్చు.(సవర జాతాపుజీవన సరాగాలు 2011) సవర రచయిత జగదీశ్‌ ఈ పార్వతీపురం 0% లోనే పనిచేస్తున్నాడు.

ఇస్తినమ్మ వాయనం

తెలుగు గిరిజనుల మాండలికం తెలిస్తేనే మిగిలిన కొండ భాషలలో నుడికారాలు బోధపడతాయి! అని భద్రిరాజు 1960లలోనే స్పష్టం చేశారు. కాని వారి శిష్యులు గిరిజన మాతృభాషలలో విద్యా బోధన అని మొక్కుబడి వాచకాలు తయారు చేసారు. గిరిజన సంక్షేమ శాఖలో సంపాదకులు ముందుమాటలో, ఆసక్తి గలవారు చదవవలసిన పుస్తకాలజాబితా ఇచ్చి, వాటిని సంక్షిప్తంగా పరిచయం చేస్తే బాగుండేది. ఇటువంటి ప్రాజెక్ట్‌లన్నీ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్న ధోరణిలో నడుస్తాయి. విశ్వవిద్యాలయాలలో అంత్రపాలజి శాఖలుకూడా తక్కువతినలేదు. ప్రతీ సంవత్సరం ఆ శాఖలో [౮ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గదర్శనంలో ఒక గిరిజన గ్రామాన్ని నెల రోజుల పాటు అధ్యయనం చేస్తారు. 2008 నుండి అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలౌతుంటే ఆ అమలుకు పునాది అయిన సంప్రదాయ (గ్రామపటాన్ని ఒక్కచోట వీళ్ళు గీయలేదు. “సంతోష చంద్రశాలొలలో స్థానాచార్యులకు గిరిజనుల పాటలలో “చుక్కల సురిటిపల్లిలో “వెన్నెల వెదురుపల్లిలో *“చూడగల్ల, అడగల్ల బయళ్ళు” కనిపించలేదు. ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రచయితలు, హక్కుల సంఘాలు జనాన్ని ముఖ్యంగా గిరిజనులను నాలుగు స్తంభాలాట ఆడిస్తున్నారు.

1940 లలో సంథాల్‌ పరగణా కలెక్టర్‌ గా ఆంగ్లేయుడు &0౧6వాళ్ళ సాహిత్యం సంప్రదాయాలను గ్రధస్థంచేస్తే, కొంతకాలం గిరిజన శాఖ కమిషనర్‌గా ఫుల్‌ టైట్‌ ఫెలోగా ప్రముఖ ఆంగ్ల రచయిత శితకాంత మహాపాత్ర, 140661019240౧ 01 2౧6 ౧౪౫లో తరువాతి పరిణామాలను 'పేర్యాన్నాడు తప్పు, విశేషమైన కృషి చేయలేదు. అలాగే ఆక్రోశంతో రచనలు చేసి, పనిచేసిన మహాశ్వేతాదేవి, అంతరిస్తున్న సాహిత్యం నిలబెట్టుకుంటూ, మారుతున్న రోజుల్లో భూమి అడవి నీరు దక్కించుకోటానికి కావలసిన లెక్కాడొక్కా దారి చూపించలేదు. ఇలా సాహిత్యగాళ్ళంతా తమ ప్రపంచంలో తాము బతికారు. కానీ రాంచీ విశ్వ విద్యాలయం ఉపకులపతి రామ్‌దయాల్‌ ముండా గురువు రఘునాధ్‌ ముర్ము లు గిరిజనుల సంప్రదాయ సాహిత్యాన్ని నిలబెడుతున్నారు. కాబట్టి ఈ పోకడలలో, రచనలలో పాత్రలలో వైరుధ్యాలను, పరిమితులను తెలుసుకుంటూ ముందుదారి వెతుక్కోవాలి.

గిరిజనుల వారసత్వం

చిరకాలంగా తూర్పు, కనుమలను పాలించిన గిరిజన నాయకులు మధ్య భారతాన్ని అందులో ఉత్తరాంధ్రాని, ముఖ్యంగా, విశాఖనగరం అభివృద్ధి చేసిన (క్రమం వేనోళ్ళ చాటుకుంది. ఆంధ్రవిశ్వ విద్యాలయం కులపతి విక్రమదేవవర్శ, రాణి చంద్రమణిదేవి, కురుపాం మార్కెట్స్‌ తాజ్‌మహల్స్‌ దసపల్లా, గిరిజనులతో వియ్యమందిన అనకాపల్లి జమీందారుల ఏవియన్‌ కళాశాల వగైరాలు, యానాది ఎరుకల విముక్తికి జీవితం ధారపోసిన వెన్నెలకంటి రాఘవయ్య వంటి వారి కృషి ఈ రోల్‌ మోడల్స్‌ ఇవేళ చదువుకున్న గిరిజనులకు తెలియవంటే, అందుకు, చాళ్ళము శమతుట్టు శన్పుకునటున్న బుద్ధిజీవులను, వాళ్ళు చెప్పే చదువులను తప్పు పట్టాలి. దళితులలో జాషువా, నాజర్‌, చీమకుర్తి నాగేశ్వరరావు బడి చదువుల వల్ల కాదు, తమ అధ్యయనంతో, ప్రతిభతో అజరామరమైన ప్రభావం చూపించారు. గిరిజన రచయితలకు, తము వారసత్వం గురించి అధ్యయనం చేయాలనే ఆసక్తి, పరిశ్రమ తక్కువైనా, తమసమస్యలు తెలుసు. వాటిని వ్యక్తీకరించే శిల్పంలో “సహానుభూతి” కనిపిస్తుంది. కానీ వారి కథావస్తువు ఆశ్రమ స్కూళ్ళు, మతం మారటం, నిర్వాసితులు కావటం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సమస్యలు గిరిజనులకే పరిమితం కావు. జగదీశ్‌ “అక్షరాల దారిలో సవర పిల్లడు 'సన్నాయి” పాటలు పాడించే మాస్టారికి దగ్గరౌతాడు. మాస్టారు వాళ్ళ ఊరు వెళ్ళినపుడు వాళ్ళ వాద్యాలు, అందులో సన్నాయిని చూస్తాడు. అది షెహనాయికి మాతృక అనిగమనిస్తాదు. అతన్ని బడిదగ్గరలో సన్నాయి విద్వాంసుడి దగ్గర పెడతాడు. అతడు మరో షేక్‌ చిన మౌలానా సాహెబ్‌, 'బిస్మిల్లాఖాన్‌ అవుతాడు. గిరిజన 'ఘరానా'లకునాంది పలుకుతాడు. లేదా మరో ద్రాయింగ్‌ మాస్టారయికే, వాళ్ళ ఉళ్ళో గోడల మీద బొమ్మలు 'ఇడిసింగ్‌” చూసి, అతదిని పికాసో అంతవాదిని చేస్తాడు అని కధ తిరిగిరాస్తే అది సవర కథ అవుతుంది. ఈ బొమ్మలు వేయటాన్ని పాడేరులో 'గన్నికలు (జలకన్యలు) “వలచటం' ఆవాహన చేయటం, మోహిం చటం అంటారు. ఆ మూలాలు కథల్లోకి తెస్తే పికాసోలు, చిను అబేలు వస్తారు. మన చదువులలో లోపించిన అటువంటి నేటివిటీ రావాలంటే కధ, జనం నోట్లో నలగాలి.

“తనంత తానే వచ్చేది ఏమిలేదు"

ఈ సందర్భంగా త్రిపురనేని, కొ.కు. ఇచ్చిన సలహాలు రచయితలు మరువరానివి. 'అధ్యయనం లేకుందా ఎవరికీ శబ్ద సంపద పెరగదు. తనంతతానే వచ్చేది ఏమిలేదు” (సాహిత్యంలో వస్తు శిల్పాలు. 148) అందునా గిరిజన సాహిత్యం అంగడిలో దొరికే వస్తువు కాదు.

“ఈనాడు రచయితలకు పెద్దగా భాషాజ్ఞానమూ, పాండిత్యము, ప్రాలీన సాహిత్య పరిచయమూ అవసరములేదన్నది ఏనాడో నిర్ణయమయింది. కాని వారికీ జీవితానుభవం, సామాజిక దృక్పధము కూడా అవసరం లేదన్నది రాను రాను రుజువవుతున్నది. ఇతివృత్తాలలో పాత్ర పోషణలో, సన్నివేశాలలో ఎలాటి వాస్త్రవికకా అవసరం లేద” (కవిత్వం చైతన్యం'157).

“సాహిత్యం జీవిత వృక్షానికి పూసే పువ్వు చెట్టుకు పూలు పూస్తాయి గాని పువ్వుకు పూలు పూయవు, సాహిత్యానికి పుట్టే సాహిత్యం నాకు ఆనాడే కృత్రిమంగాను, కాగితం పూవులాగానూ కనిపించింది. (ప్రజాసాహితి.కొ.కు ప్రత్యేక సంచిక. 10) పరిశీలన గమనించాలి. నేటివిటీ లేని రచనలు 'కాగితంపు పూలుగా మిగిలితే - అడవి సంప్రదాయంతో మమేకమైనవి గరికపూలైనా మనసును ఆకట్టుకుంటాయి.

“ప్రభత్వం గుర్తింపు కావాలి" అని రచయితలు అంగలారుస్తుంటేే చెంచులు, కొందరెడ్డు కొండదౌరలు తమ సంప్రదాయ సాహిత్యాన్ని సేకరించి 'గిరిగింజ గిరిమల్లెలు” "నల్లమలలో చెంచు ప్రపంచం “గోదావరి లోయలో కొందరెడ్ల బతుకు కధలు" ప్రచురించారు. నాయక్‌ పోడు పసుల బుచ్చయ్య తన తెగ సంస్కృతీ మీద (ప్రచురణలు తేవటమే కాక, చిత్రకారుడుగా రాణిస్తున్నాడు. గిరిజన సంక్షేమశాఖ తయారు చేయించిన 'గిరిజన సంస్కృతి- ప్రధానోపాధ్యాయులకు కరదీపిక విశాఖగిరిజనసంస్కృతి రెండువాచకాలు, మొజాయిక్‌ రామతీర్ధ గారి కొందరెడ్డి వాచకాలు ఎప్పుడు వెలుగు చూస్తాయో? గిరిజన సంస్కృతి, దోపిడీ-బుద్ధిజీవులను, సామాజికన్యాయం కోసం పనిచేసే ఉత్సాహవంతులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. కానీ సంస్కృతి, చరిత్ర, పలుకుబడి పునాది లేకుందా, నేలవిడిచి సాము చేసేవారు గిరిజనులైనా, పురజనులైనా తొందరగానే వెలిసిపోతారు.

పరిమళము చెడని, వాడని అడవిపూలచెండ్లు

అధ్యయనబలంతో, చింతకింది, గిరిజనులమీద చేసే రచనలు, “ప్రజాశక్తి వర్ణించినట్లు ఏడువారాల నగలుగా మిగిలిపోకుందా, వాటిలో 'సహానుభూతి” రాటుదేలుతూ, గిరిజనుల శ్రమైక జీవన సౌందర్యంలో “గంధ మృదుత్వశైత్యా'లను పుణికి పుచ్చుకుని "పరిమళము చెడని, వాడని” పూలచెండ్లుగా అడవి తల్లి సిగలో ఒదిగిపోవాలి. తనకు ఎంతో దూరంలోలేని, మాడుగుల, వంటలమామిడి సంతలలో గిరిజనులు, వారిలో సంప్రదాయ సాహిత్యం వ్యాఖ్యానించగల వారితో పరిచయం 'పెంచుకోవటంవల్ల, ఈ రచనల పూలకు కాయలు పంధ్సు విత్తనాలు, వాటినుండి చెట్లు వస్తాయి. మళ్ళీ, వాళ్లలోకి వెళ్లి మారాకు తొడుగుతాయి. ఆ పక్మనే కప్పరిమజ్జిలో కొంధులు ఒకప్పుడు (బ్రహ్మాండంగా నాటకాలు ఆడేవారని, పాడేరు దగ్గర అద్జుమండ గిరిజనులు తుంపాడ నాటకపోటిలో మొదటి బహుమతి పొందారని, ఉత్తరాంధ్ర జానపద సంపదను (గ్రంధస్థం చేస్తున్న బద్రి కూర్మారావు 'పేర్కాంటారు. ఆ రోజులు మళ్ళీ రావాలి. ఈ కధలను వాళ్ళు తమకు అనువుగా మార్చుకోవాలి.

గిరిజనోద్యమంలో, వాటిమీద వచ్చే, ఆధునిక సాహిత్యంలో లోపించిన చిత్తశుద్ధి లక్ష్యశుద్ధినీ సరిచేస్తూ వచ్చే రచనలు ముందుతరాలకు దారి చూపించగలవని, సవరపాటలో కోరుకున్నట్లు వాళ్ళ శ్రేయోభిలాషిగా... (నీకోసం, నీ మంచికోసం సదా నీ అభిమానిగా ఉండిపోతాను) రచయితలు మరింత కృషి చేస్తారని గిరిజనుల నుండి చిను అబేలు, బిస్మిల్లా ఖాన్‌లు, పికాసోలు, చట్టాలు అనులు చేయించుకోగల కథానాయకులు రావాలని, “తృణ కాష్ట్ర జలసమృద్ధితో కొండకోనలు మనకు భద్రత నివ్వాలని ఆశిద్దాం.

'తరుప్రసూతి పుష్పాణి మరుద్వహతి సౌరభం!

చెట్లు వూలు వూస్తాయి. గాలి నువాసనను మోనుకుపోతుంది.