అమ్మనుడి/సంపుటి 5/మే 2019/కపిలవస్తు నగరానికి బుద్ధుని రాక

వికీసోర్స్ నుండి

బుద్దపూర్ణిమ మే 18.

ఈమని శివనాగిరెడ్డి -స్టపతి 98485 98446

కపిలవస్తు నగరానికి బుద్ధుని రాక

తథాగతుడు వేణువనంలో విహరిస్తున్న సమయంలో- కుమారుడు ఆరేళ్ళ కఠోరసాధన చేసి సమ్యక్‌ సంబోధిని పొందాడనీ, ధర్మచక్రాన్ని ప్రవర్తింపజేసి, నేడు వేణువనంలో విహరిస్తున్నాడనీ మవోరాజు శుద్దోదనునికి తెలిసింది. శుద్దోధనుడు మంత్రిని పిలిచి అతనితో, *నా ఆజ్ఞగా వేయిమందిని తీసుకొని రాజగృవానికి వెళ్ళి, నీ తండ్రి శుద్దొదనుడు నిన్ను చూడాలనుకొంటున్నాడని చెప్పి, నా కుమారుని తీసుకురా” అని చెప్పాడు.

“అలాగే ప్రభూ” అన్న మంత్రి, రాజాజ్ఞను శిరసావహించి వేయిమందిని తీసుకొని అరవై యోజనాలు ప్రయాణించి బుద్దుడు నాలుగు పరిషత్తుల మధ్యన కూర్చుని ధర్మబోధ చేస్తుండగా విహారంలో ప్రవేశించాడు. “రాజసందేశం సంగతి తరువాత” అనుకుని ఒక ప్రక్మన నిలబడి ధర్మదేశనాన్ని వింటూ ఆ మంత్రి మిగిలిన వేయిమంది తోసహా ప్రవ్రజ్యనిమ్మని అడిగి అర్హంతుడై పోయాడు. బుద్ధభగవానుడు "భిక్షులారా! రండి” అని చేతిని చాపాడు. వారందరూ కూడా ఖిక్లాపాత్ర, చీవరాలను ధరించారు. అలా అర్హంతులైన వారు “ఆర్యులు తటస్టులుగా ఉంటారు” అనుకుని సందేశాన్ని బుద్ధునికి వినిపించలేదు.

“వెళ్ళినవాడింకా తిరిగి రాలేదు. కనీసం వర్తమానమన్నా పంపలేదు” అనుకొన్న శుద్దోధనుడు, మరో మంత్రిని పంపాడు. అతడు కూడా అనుచరులతోపాటు అర్హంతుదై, రాజశాసనం విషయాన్ని పక్మనపెట్టాడు. అలా మొత్తం తొమ్మిది మంది మంత్రులను పంపగా వారందరూ ఆనుచర సహితంగా అర్హంతులై రాజశాసనం విషయంలో మౌనంధరించి, రాజగ్భహంలోనే ఉండిపోయారు. కనీసం లేఖద్వారానైనా విషయాన్ని తెలియజేయగలిగిన వారుకనబడక పోవడంతో రాజు ఇలా అనుకొన్నాడు. “నేనంటే ప్రేమ గలవారిందరు వెళ్ళికూడా కనీసం పత్రమన్నా తేలేదు. ఇపుడు నా మాటను తెలియజేయగలవారెవరు మిగిలారు?” అపుడాయన రాజపురుషుల మండలినంతా పారజూస్తూ, కాలుదాయి పై దృష్టిని నిలిపాడు. అతడు రాజుకు పూర్తి ఆంతరింగికుడూ, విశ్వాసపాత్రుడూ, సర్వార్థసాధకుడూ అయిన మంత్రి. అతడు బోధిసత్తుడు పుట్టినరోజునే పుట్టిన, బోధిసత్తుని చిన్ననాటి స్నేహితుడు కూడా. శుద్దోధనుడు అతన్ని చూసి “నాయనా కాలుదాయీ! నేను నా కుమారున్ని చూడాలనుకొంటున్నాను. తొమ్మిదివేల మందిని పంపాను కానీ వారిలో కనీసం పత్రం తెచ్చిన వారొక్కరైనా లేరు. శరీరం అస్థిర మైనది. నేను బ్రతికి ఉండగానే నా కొడుకును చూడాలను కొంటున్నాను. నువ్వు నా కుమారుని తెచ్చి నాకు చూపించగలవా?”

“ప్రభూ! ప్రవ్రజించేందుకు అనుమతి దొరికినట్లయితే తప్పక తీసుకు రాగలను.”

“ప్రవ్రజితుడినా సరే, కాకపోయినా సరే. నా కొడుకును తెచ్చి చూపించు చాలు.”

“అలాగే ప్రభూ!” అన్న కాలుదాయి రాజశాసనాన్ని తీసుకుని రాజగ్భహాన్ని చేరాడు. బుద్దుడు ధర్మదేశనం చేస్తున్న సమయంలో పరిషత్తు చివర నిలబడిన అతడుకూడా అనుచర సహితంగా అర్జంత ఫలాన్ని పొందాడు. “రండి ఖిక్ధులారా” అనగానే ఖిక్ధువైపోయాడు. సిద్ధార్దుడు, బుద్దుడైన తరువాత మొదటి వర్షావాసాన్ని బుషిపట్టణం (సారనాథ్‌)లోనే గడిపాడు. ఆ తరువాత వర్షావాసాంతంలో ప్రవారణ చేసుకొని ఉరువేలకు వెళ్ళాడు. అక్కడ ముగ్గురు జటిలసోదరులనూ సన్మార్గానికి మళ్ళించి, ఆ పై అనుచరులైన వేయిమంది జటిలురతో బాటుగా పుష్యమి మాసానికల్లా రాజగ్భహం చేరుకున్నాడు. అక్కడ రెండు నెలలున్నాదు. ఇప్పటికి వారణాశి నుండి బయలుదేరి అయిదు

మాసాలు అవుతుంది. హేమంత బుతువు గడచి పోయింది. ఉదాయిస్థవిరుడు వచ్చి ఏడెనిమిది రోజులయ్యింది. ఫాల్గుణ పౌర్ణమాసి రోజున కాలుదాయి స్థవిరుడు ఆలోచనలో పడ్డాడు. “హేమంతం వెళ్ళి వసంతం వచ్చింది. రైతులూ మనుషులూ పైరులను కోసి త్రోవలను బాగుచేశారు. భూమంతా పచ్చని పచ్చిక పరచుకొని ఉంది. వనఖండాలన్నీ పుప్పించాయి. రహదారులు ప్రయాణానికి అనుకూల మయ్యాయి. బుద్దుడు తన జూతినీ ఉద్ధరించదగిన సమయం యిది.” ఇలా ఆలోచించిన ఆయన భగవానుని దరి చేరాడు.

“భంతే! ఫలాకాంక్షతో వృక్షాలు ఆకులను విడిచి అగ్నికణాలను ధరించి నట్లున్నాయి.

మవాోవీరా! అవి అగ్నిశిఖలలా అగుపడుతున్నాయి... ఇది రసాల కాలం.

“మరీ చలి లేదు. మరీ వేడి లేదు. అన్నానికి బాధ లేదు. భూమి పచ్చదనంతో శోఖిస్తుంది.

మహామునీ! ఇదే ప్రయాణించేందుకు తగిన సమయం.” అంటూ అరబై గాథలతో బుద్దుని ముందు కులనగర గమనాన్ని ప్రశంసించాడు.

“ఉదాయీ! ఇలా మధుర స్వరంతో యాత్రను గురించి ప్రశంసించిన కారణమేమిటో!” అన్నాడు బుద్దుడు.

“భంతే! మీ తండ్రి శుద్దోదన మహారాజు మిమ్మల్ని చూడాలనుకొంటున్నాడు. (స్వ్ప్రజాతివారిని ఉద్దరించాలి”.

“ఉదాయీ! నేనలాగే జూతివారిని ఉద్దరిస్తాను. నువ్వు యాత్రకు అవసరమైన కర్మలను పూర్తి చేయమని భిక్షు సంఘానికి తెలియజేయి.”

“మంచిది భంతే” అని ఆయన ఆ సంగతిని ఖిక్షుసంఘానికి తెలియజేశాడు. భగవానుడు అంగ-మగథధలకు చెందిన కులపుత్రులు పదివేలమంది, కపిలవస్థు నివాసులు పదివేలమందితో బాటుగా రాజగ్భహాన్ని వీడాడు. రోజుకు యోజనం చొప్పున నడువ సాగాడు. రాజగ్భహంనుండీ అరవై యోజనాల దూరంగల కపిల వస్తును రెండు మాసాల్లో చేరే ఉద్దేశ్యంతో నడకను మెల్లగా సాగించాడు.

ఈలోగా, శాక్యులు భగవానుడు విహరించవలసిన చోటును గురించి ఆలోచన చేసారు. న్యగోధుడనే శాక్యుని ఆరామం రమణీయమని ఎరిగి దానిని శుభం చేయించారు. గంధపుష్పాలను చేతికిచ్చి, చక్కగా అలంకృతులైన బాలబాలికలను ముందుగా ఆహ్వానానికై పంపారు. ఆ వెంటనే కుమారులనూ, కుమార్తెలనూ పంపి ఆ తరువాత తామే స్వయంగా గంధపుప్పు చూర్చాదులతో భగవానుని పూజిస్తూ న్యగోధారామానికి కొనిపోయారు. అక్కడ క్షీణాస్రవులైన ఇరవై వేల మంది అర్హంతులతో బాటుగా భగవానుడు అమర్చివున్న బుద్దాసనంపై ఆసీనుడయ్యాడు.

మరునాడు భగవానుడు భిక్షువుల సహితంగా భిక్లాటనకై కపిలవస్తును ప్రవేశించి. ఇంద్రఖీలంవద్ద నిలబడి ఆలోచించ సాగాడు- “ముందటి బుద్దులు - కులనగరంలో ఖిక్షాటనమెలా చేశారు? మధ్యలో కొన్ని ఇళ్ళను విడుస్తూనా, లేక ఒకదాని తరువాతొకటిగా ప్రతి ఇంటికీ వెళుతూనా?” కనీసం ఒక బుద్దుడైనా మధ్యన కొన్ని ఇళ్ళను విడిచి ఖిక్షకై చరించటం కానరాలేదు. “నాదీ బుద్దుల వంశమే కనుక నేనీ కుల ధర్మాన్నే గ్రహించాలి. దీనివల్ల రానున్న కాలంలో నా శ్రావకులు నన్నే అనుసరిస్తూ భిక్షాటన వ్రతాన్ని పూర్తి చేయగలరు.” అనుకొని మొదటి ఇంటినుండే ఖిక్షాటనను ప్రారంభించాడు. “ఆర్య సిద్దార్థకుమారుడు భిక్షాటనం చేస్తున్నాడ”ని విన్న ప్రజలు రెండు, మూడంతస్థుల మేడల పైనుండీ కిటికీలను తెరచి క్రిందికి చూస్తున్నారు.

రాహులమాతాదేవి (యశోధర) కూడా దీనిని విన్నది. “అర్య పుత్రుడీ నగరంలోనే ఎంతో రాజఠీవితో బంగారు పల్లకీలల్లో తిరిగాడు. కేశాలూ, గడ్డమూ తీసివేసి కాషాయాన్ని ధరించీ ఈ రోజునీ నగరంలోనే పాత్ర చేతపట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. ఇదేమైనా శోభనీయమాగో అంటూ కిటికీని తెరచింది. విరాగం వల్ల ఉజ్జ్వలమైన దేహకాంతితో నగరపథాన్ని ప్రకాశింపజేస్తూ అనుపమమైన సంబోధి సిరితో విరాజిల్లుతున్న భగవానుని చూసింది. రాజుతో “మహారాజా! మీ కొడుకు భిక్షాటనం చేస్తున్నాడు” అని చెప్పింది. రాజు కలవర బాటుతో లేచి, థోవతిని సరిచేసుకొంటూ వడిగా మేడమెట్లను దిగాడు. భగవానుని ముందు సిలబడి "భంతే! మమ్మెందుకిలా సిగ్గుకు గురిచేస్తున్నావు? భిక్షాటనెందుకు? మా వద్ద ఇందరు భిక్షువులకు భోజనమే దొరకదా!” అన్నాడు.

“మహారాజు! ఇది మా వంశాచారం.”

“భంతే! మనది మహాసమ్మత క్షత్రియ వంశం. ఒక్క క్షత్రియుడైనా ఎన్నడూ ఖిక్షాచారి కాలేదు”.

“మహారాజు! బాటసారులకు సత్రంలా నాకు క్షత్రీయవంశంతో ఉన్న సంబంధం తాత్కాలికం. బుద్దపురుషులే నా పూర్వ వంశీయులు. నా వంశాచారాన్నే నేను పాటించాలి.”

రాజు భగవానుని ఖిక్షాపాత్రను చేతిలోకి తీసుకుని ఆయనను భిక్షుసంఘ సహితంగా మేడ నెక్కించాడు. స్వహస్తాలతో ఖాదనీయ, భోజనీయాలను వడ్డన చేసాడు. భోజనం పూర్తయిన తరువాత ఒక్క రాహులమాత తక్క రాణివానపు స్రీలు అందరూ భగవానునికి వందనమాచరించారు. “వచ్చి ఆర్యపుత్రునికి అభివావం చేయ"మని పరిజనుని పంపి నప్పటికీ, “నాలో గుణముంటే ఆర్యపుత్రుదే స్వయంగా నాదగ్గరకు వస్తాదు. అప్పుడే నేను వందన మాచరిస్తాను” అని ఆమె రాలేదు.

పాత్రను రాజు చేతికిచ్చి భగవానుడు ఇరువురు అగ్రశ్రావకులతో బాటుగా రాకుమారి శయనాగారాన్ని ప్రవేశించాడు. “రాకుమారికి తోచినట్టుగా వందనమాచరించనిఅడి. ఏమనకండి.” అని వారికి చెప్పి పరచివున్న ఆసనం పైన కూర్చున్నాడు. ఆమె వడివడిగా వచ్చి ఆయన చీలమండలను పట్టుకుని, తలను పాదాలపై ఉంచి, తనకు తోచినట్లుగా వందన మాచరించింది. రాజప్పుడు ఆమెకు భగవానుని పట్లగల ప్రేమాభిమానాలను గురించి చెప్పసాగాడు- “భంతే! నా కూతురు నీ కాషాయ వస్త్రధారణను గురించి విన్నప్పటి నుండీ, తానూ కాషాయవస్త్రధారిణి అయ్యింది. ఒకసారే భుజించటం గురించి విని, తానూ ఏకాహారిణి అయ్యింది. - ఉన్నతమైన పాన్సులను వీడడం గురించి విని తాను కూడా చిన్న శయ్య పైననే శయనించ సాగింది. మాలాగంధవిరహితుడ వైనట్టు వినీ తానూ వాటిని ధరించడం మాని వేసింది.” నీ సేవా సుశ్రూషలు చేస్తాం రా అని పుట్టింటి వారి వైపునుండీ ఎన్ని లేఖలు వచ్చినా వాటిని కన్నెత్తి చూడదు. భగవాన్‌! నా కూతురంత గుణవతి.” భగవానుడా తరువాత ధర్మదేశనం చేసి ఆసనంనుండీ లేచి నిష్క మించాడు.

మూడవరోజున, అంటే రాకుమారుడు నందుని అభిషేక, గృహాప్రవేశ, వివాహాలు మూడూ జరుగవలసిన శుభదినాన భగవానుడు భిక్షకు బయలుదేరాడు. శుభమని పలికి లేచివెళ్ళేటప్పుడు రాకుమారుడు నందుని చేతి నుండి భిక్షాపాత్రను తిరిగి తీసుకోలేదు. తథాగతుని పట్లనున్న గౌరవాదరాలవల్ల “భంతే !భిక్షాపాత్రను తిరిగి తీసుకొమ్మని అతడూ అనలేక పోయాడు. 'మెట్లు దిగి తీసుకుంటాడు: వాకిట తీసుకుంటాడు అనుకొంటూ అతడు వెనుకే వెళుతున్నాడు కానీ బుద్దుడు మాత్రం ఎక్కడా తిరిగి తీసుకోలేదు. అక్కడ ఉన్నవారు వెళ్ళి అతని భార్య అయిన జనపద కల్యాణ్‌ (సుందరి)తో “భగవానుడు నందరాకుమారున్ని వెంటతీను కొని పోతున్నాడు. ఆయన మీ ఆయనను నీక్కాకుండా చేసేస్తాడు” అని చెప్పారు. ఆమె తడిచిన కురులూ చేత దువ్వెనతో వడివడిగా పై అంతస్టుకు వెళ్ళి కిటికీని తెరిచింది. “ఆర్వపుత్రా! త్వరగా తిరిగి రావాలి " అని అరిచింది. ఈ పిలుపు నందుని గుండెలను కలచి వేసింది. బుద్దుడు అలాగే విహార ప్రవేశం చేసి “నందా! ప్రవ్రజితుడివవుతావా?” అని అడిగాడు. ఎదురు చెప్పలేక “ఆఁ అవుతాన”న్నాడు. “నందుని ప్రవ్రజితుని చేయండి” అని భగవానుడన్నాడు. ఇలా కపిలవస్తును చేరిన మూడవ రోజున ఆయన నందకుమారుని ప్రవ్రజితుడిని చేసాడు.

ఏడవ రోజున యశోధర కొడుకు రాహులుని అలంకరించి, “నాయనా! అ ఇరవై వేలమంది మధ్యన కూర్చుని బంగారు కాంతులను వెదజల్లుతున్న..ఆ శ్రమణుని చూడు. ఆయనే నీ తండ్రి. ఆయన వద్ద అనేక నిధులుండేవి. అవి ఆయనిల్లు వదిలిన నాటీనుండీ కనబడడంలేదు.” అని చెప్పి బుద్ధభగవానుని వద్దకు పంపింది.

భగవానుడు పూర్వాహ్న సమయాన, పాత్రచీవరాలను తీసుకుని శుద్దోదన శాక్యునింటికి వెళ్ళాడు. అపుడు యశోధర రాహు లునితో “రాహులా! ఆయనే నీ తండ్రి. వెళ్ళి ఆస్థిలో నీ భాగాన్నిమ్మను అని చెప్పి పంపింది. అపుడు రాహుల కుమారుడు భగవానుని ముందుకు వెళ్ళి ఆయన ముందు నిలబడ్జాడు. “శ్రమణా! నీ నీడ చాలా సుఖకరంగా ఉంది” అన్నాడు. భగవానుడప్పుడు ఆసనంనుండీ లేచి నడువసాగాడు. రాహులుడు ఆయన వెంటే నడుస్తూ “శమణా నా వారసత్వ భాగం నాకివ్వు” అనసాగాదు. భగవానుడు తలను తిప్పి, “శారిపుత్రా! అలాగైతే రాహులునికి ప్రవ్రజ్యనివ్వు” అని అన్నాడు.

“భంతే! రాహులకుమారుని కే విధంగా ప్రవ్రజ్యనివ్వాలి?” అని అడిగాడు శారిపుత్రుడు.

ఈ సందర్భంలోనే థర్మ దేశనాన్ని చేసిన భగవానుడిలా అన్నాడు- “ఖిక్షులారా! మొదట కేశాలను తీయించి కాషాయాన్ని కట్టబెట్టాలి. ఆ తరువాత ఉత్తరాసంగాన్ని ఒక భుజం పైకి సర్దించి


వీరాసనంలో కూర్చోబెట్టాలి. చేతులు జోడింప జేసి ఇలా అనమనాలి. “బుద్ధం వరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం సరణం గచ్చామి.”

దుతియంపి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి.

తతియుంపి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి.”

అపుడు ఆ శారివుత్రుడు రాహులకుమారుని ప్రవ్రజింవ జేశాడు. ఆ తరువాత శుద్దోదన శాక్యుడు భగవానుని సమీపించి, అభివాదం చేసి ఒక ప్రక్కన కూర్చుని- “భంతే! నేను భగవానుని నుండి ఒక వరాన్ని కోరుతున్నాను.” అన్నాడు.

"గౌతమా! తథాగతుడు వరాలకు అతీతుడు.” బుద్ధభగవాను డన్నాడు.

“భంతే! ఇది ఉచితమైంది. దోషరహితమైంది.” శుద్దోధనుడు చెప్పాడు.

“అదేమిటో చెప్పు గౌతమా.” అడిగాడు భగవానుడు.

“భంతే! భగవానుడు ప్రవ్రజికుడైనప్పుడు నాకెంతో దుఃఖం కలిగింది. అలాగే నందుడు ప్రవ్రజితుడైనప్పుడు కూడా దుఃఖం కలిగింది. ఇప్పుడు రాహులుని ప్రవ్రజ్యతో అది మిక్కుటమైపోయింది. భంతే! పుత్ర ప్రేమ చర్మాన్ని ఛేదిస్తుంది. చర్మాన్ని ఛేదించి నా మాంసాన్ని నాడులను, ఎముకలను ఛేదిస్తుంది. భంతే! ఆర్యులు (భిక్షువులు) తలిదండ్రుల అనుమతి లేని వారికి 'ప్రవ్రజ్యనీయకుంటే బాగుంటుంది.”

ఆ తరువాత ఖగవానుదు ఆయనకు ధర్మదేశన చేశాడు... అపుడాయన లేచి భగవానునికి అభివాదన ప్రదక్షిణలు చేసి నిష్రమించాడు. భగవాను డిదే సందర్భంలో ధర్మ దేశనం చేసి ఖిక్షువులతో ఇలా అన్నాడు

“భక్తులారా తలిదండ్రుల అనుమతి లేనీ వారికి భిక్షువులు ప్రవ్రజ్యనివ్వకూడదు. ఇచ్చిన వానిది దుష్కృత దోషం.”

మహామౌద్దల్యాయనుడు రాహులునికి తలగొరిగి కాషా యాన్ని కట్టి త్రిశరణగమనం చేయించాడు. మహాకాశ్యపుడు ఉపదేశమిచ్చే ఆచార్యుడయ్యాడు.

(మహాపండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ “శ్రీబుద్దచర్వా” లోని భాగానికి అనువాదం)

స్పందనను వ్రాయండి “అమ్మనుడిలో రచనలపై మీ స్పందనను వ్రాసి పంపండి!

సంపాదకుడు “అమ్మనుడి, జి-2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి, మాచవరం, విజయవాడ-520 004 ఇ-మెయిల్‌ : editorammanudi@gmail.com