అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/బౌద్ధుల ఖగోళ పరిశోధనలు-2

వికీసోర్స్ నుండి

15. బౌద్ధుల ఖగోళ పరిశోధనలు - 2

గత సంచిక తరువాయి

ఆకాశగోళం - దిక్చక్రం:

ఒక రాశిలో కన్పించే విషువత్‌, తిరిగి అదే రాశిలోకి రావడానికి పట్టేకాలం 26వేల సంవత్సరాలు. మన జీవితకాలం గట్టిగా 70 ఏళ్ళు. లేదా తీసుకు తీసుకు బతికితే వందేళ్లు. ఒక రాశిని పూర్తి చేయడానికి 2150 సంవత్సరాలు. అంటే...విషువత్తులు ఆయనాంతాల మార్పు గమనించడానికి కనీసం 2000 సంవత్సరాలు కావాలి. అంటే... 600 తరాల కాలంలో ఈ మార్పు గమనించడం సాధ్యం. మొత్తం వృత్తానికి 3600 లు అనుకుంటే - ఒకరాశికి ౩00 లు. 12 రాశులకుగాను 3600 లకు 26 వేల సంవత్సరాలు అనుకుంటే - ఒకరాశికి 300 లకు 2150 సంవత్సరాలు. అందులో 10 కి 72 సంవత్సరాలు. మనిషి తన 70 ఏళ్ళ కాలంలో విషువత్తుల్లోని 10 మార్పుని మాత్రం గమనించగలడు. ఈ 10 ని నక్షత్ర పాదాల్లోకి మారిస్తే..ఒక నక్షత్రం నుండి మరో నక్షత్రానికి మారడానికే వెయ్యేళ్ళు పడుతుంది.

ఇంత సూక్ష్మమైన మార్పుని గమనించడం ఒక ఎత్తు అయితే, దీనికి కారణం కనుగొనడం మరో ఎత్తు. కారణం వారికి తెలియక పోవచ్చు. కానీ, మార్పుని గమనించడం మాత్రం జరిగింది.

ఈ మార్పుని గమనించిన తాలూకు మొట్టమొదటి ఆనమాలు నిదానకథలో మనం చెప్పుకున్న 'దిక్‌ చక్రం' విషయంలో కన్పిస్తుంది.

మనకి ఇప్పటిదాకా బాగా తెలిసిన భూచలనాలు రెండే.

ఒకటి. : భూ ఆత్మభ్రమణం (తన చుట్టూ తను తిరగడం)

రెండు : భూ పరిభ్రమణం (భూమి సూర్యుని చుట్టూ తిరగడం)

ఇవికాక మూడో చలనం విషువత్‌ చలనం. భూమి గిరగిరా తిరుగుతూ వేగం ఆగి పోయి, పడిపోబోయే ముందు బొంగరం ఎలా తూలుతూ చుట్టూ తిరుగుతుందో అలా తిరిగే చలనమే ఈ మూడో చలనమైన విషువత్‌ చలనం. ఇలా ఒక తూలుడు చలనాన్ని పూర్తి చేయడానికి 26 వేల సంవత్సరాలు పడుతుంది. ఈ 26 వేల సంవత్సరాలలో వంగి ఉన్న భూ అక్షం సూర్యునికి ఒకసారి అటూ, ఒకసారి ఇటూ తిరుగుతుంది. దీనివల్ల వాతావరణాల్లో, బుతువుల్లో మార్పులు వస్తాయి. ఋతువులన్నీ వెనక్కి నడుస్తాయి. ఇప్పుడు వేసవి ఉన్న ఋతుకాలంలో 15వేల సంవత్సరాలకు శీతాకాలం ఉంటుంది. అలా ఒక్కో ఋతువు వెనక్కి వెళ్లి... వెళ్ళి మరలా 26 వేల సంవత్సరాలకి అదే స్థానంలోకి వస్తుంది.

మనం ఆకాశంలో ఆ స్థానాల్ని గుర్తు పట్టలేం. కాబట్టి సూర్యుని వల్ల భూమ్మీద ఏర్పడే విషువత్తుల ద్వారా, అవి వెనక్కి జరిగే ప్రక్రియ ద్వారా ఆ మార్చును, గమనించగలం. అందుకే ఈ చలనాన్ని విషువత్ ‌ చలనం అంటారు. విషువత్తుల, ఋతువుల మార్పుని గమనించడమే ఈచలనాన్ని తెలుసు కోవడం.

విషువత్తులతో పాటు ఆయనాంతాలు కూడా మారతాయి. ఆయన ప్రాంతాల మీద నివసించే ప్రజలకి కనిపించే ఆకాశం తీరే - దిక్‌ చక్రం. మనం సాయంత్రం వేళ ఆయన రేఖపై నిలబడి ఆకాశాన్ని చూస్తే నక్షత్రాల వంకర చలనకాలు కన్పిస్తాయి. అక్కడి నుండి ధృవ నక్షత్రాన్ని చూస్తే ఆకాశంలో, రాశులు, నక్షత్రాలు అన్ని దిక్కులకూ సమానంగా ఉన్నాయా? లేదా?, ఏదైన దిక్కుకేసి వంగి ఉన్నాయా? అనేది కూడా కన్పిస్తుంది. ఏ రోజున, ఏదిక్కున ఆకాశం (ఆకాశగోళం), భూమికి సమాంతరంగా ఉంటుందో అదే సరైన దిక్‌ చక్రం -(పటం -1 చూడండి)

ప్రస్తుతం వసంత విషువత్తు మీనరాశిలో జరుగుతుంది. అంటే సూర్యుడి మీనరాశిలో ఉన్నప్పుడు మనకి వసంత విషువత్‌ అన్నమాట. అంటే...సూర్యుడు తన ఉత్తరాయన కాలంలో భూమద్యరేఖ మీదకు వస్తాడు. అప్పుడు భూమధ్యరేఖ మీదుగా ఆకాశగోళంలో మీన రాశి ఉంటుంది.
క్ర్రీ. పూ 2050 - క్రీ. శ 100 కాలం నాటి దిక్చక్రం


అలాగే...శరత్‌ విషువత్తు కన్యరాశిలో జరుగుతుంది. ఇక ఉత్తరాయణాంతం మిధున రాశిలో దక్షిణాయనాంతం ధనుర్రాశిలో జరుగుతున్నాయి.

నిజానికి కర్కటరేఖ మీద ఆకాశంలో కనిపించే కర్కాటక రాశిలో కాకుండా దాని వెనుకదైన మిధునంలో ఉత్తరాయణాంతం జరుగుతుంది. అంటే ఉత్తరాయణాంతం ఒక రాశి వెనక్కి పోయిందన్నమాట!

అలాగే మకర రాశిలో జరగాల్సిన దక్షిణాయనాంతం ధనుర్రాశిలో జరుగుతుంది

ఈ ప్రక్కనున్న రెండవ బొమ్మను చూస్తే ఈ నాలుగు అంశాలు ఏఏ రాశుల్లో జరుగుతున్నాయో తెలుస్తుంది.

ఇక 2 వేల సంవత్సరాల వెనక్కిపోదాం - క్రీ.పూ. 2050 నుండి క్రీ.శ 100వరకూ ఉన్న కాలం. రుగ్‌ యజుర్వేదకాలం. బుద్ధుని కాలం. అశోకుడు, ఉపనిషత్తులు, అధర్వణ వేదం, శాతవాహనుల కాలం వరకూ ఉన్నదంతా ఈ కాలంలోనే.

ఈ కాలంలో చూడండి. వసంత విషువత్‌ మేషంలో జరిగింది. శరద్‌ విషవత్‌ తులలో జరిగింది. ఉత్తరాయణాంతం కర్కాటకరాశిలో, దక్షిణాయనాంతం మకర రాశిలో జరిగాయి.

పటం..3. (బుద్దుని కాలంలో)

ఈనాడు మనం నక్షత్రాల క్రమాన్ని “అశ్వని, భరణి, కృత్తిక అనే క్రమంలో చెప్తాం. ఈ క్రమం అప్పటిదే. ఈ మూడు నక్ష త్రాలతో ఏర్పడ్డరాశి మేషం. ఇక అంతకంటే పూర్వపు స్థితి చూద్దాం. ఆపైన 2150 ఏళ్ల వెనక్కిపోతే క్రీ.పూ. 4200 - క్రీపూ. 2050 మధ్యకాలం వస్తుంది. ఈ కాలంలో వసంత విషువత్‌ వృషభంలో, శరత్‌ విషువత్‌ వృశ్చి కంలో, ఉత్తరాయణాతం సింహంలో, దక్షిణాయనాంతం కుంభరాశితో సంభవించాయి.

పటం. 4 (సింధూనాగరికత కాలం)

రుగ్‌ యజుర్వేదాల్లో నక్షత్రాల పేర్లు వున్నాయి. కాని, మొదటి నక్షత్రం అశ్విని కాదు. కృత్తిక. కృత్తికతో నక్షత్రాల లెక్కింపు మొదలవుతుంది. ఎందుకంటే కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల కూడికే వృషభ రాశి. అప్పుడు మొదటిరాశి వృషభం. మొదట నక్షత్రం కృత్తిక. అశ్విని ఇరవై ఆరో నక్షత్రం.

పై మూడు బొమ్మలు చూస్తే ఆయనాం

పటం 2. ప్రస్తుత కాలంలో క్రీ. శ. 100 - క్రీ. శ. 2200
శాలు, విషువత్తులు ఎలా మారుతున్నాయో అర్ధం అవుతుందిగదా!

ఇక, ఇప్పుడు అసలు విషయాని కొద్దాం!

దిక్చక్రం - బుద్ధుని ధ్యానం:

బుద్ధుడు ధ్యానానికి కూర్చొంది బుద్ధ గయలో. బుద్ధగయ భూమ్మీద 240 ఉత్తర అక్షాంశం మీద ఉంది. కర్కాటరేఖ 23 1/20 ల ఉత్తర అక్షాంశం అని మనకు తెలుసు. అంటే. బుద్దుడు దాదాపుగా కర్మటరేఖా ప్రాంతంలోనే ధ్యానానికి కూర్చొన్నాడన్న మాట. అంటే ఆయన కూర్చొన్న ప్రాంతం ఒక ఆయనరేఖా ప్రాంతం. దక్షిణాయనాంతం, ఉత్తరాయన ఆరంభం ఆ ప్రాంతం నుండే స్పష్టంగా గమనించవచ్చు. ఆయనకు జ్ఞానోదయం అయ్యింది. వైశాఖ పున్నమినాడు. అంతకు 48 రోజుల ముందు 'ఇక నేను జ్ఞానం పొందే వరకూ లేవను' అని కూర్చొన్నాడు. అంటే వైశాఖానికి రెండు నెలలు ముందు. 49 రోజులు అంటే 7 వారాలు. ఏడు ఉపోదన దినాలు. 49 వ రోజున జ్ఞానోదయం కల్గింది. దీన్ని మనం ఇప్పుడు ఇంగ్లీషు నెలల్లోకి మార్చుకుంటే జ్ఞానోదయం పొందిన 'నెల' మే నెల కాబట్టి మార్చి నెలలో ఆయన ధ్యానానికి కూర్చొన్నాడు. అంటే మేషరాశిలో వసంత విషువత్‌ జరిగి కాలంలో కూర్చొన్నాడు. విషువత్తులంటే పగలూ రాత్రీ సమానంగా ఉండే రోజులని మనం గతంలో తెలుసుకున్నాం. ఈ రోజున సూర్యుని కాంతివృత్తం లేదా దిక్‌చక్రం భూ మధ్యరేఖకు సమాంతరం గా ఉంటుంది.

అన్ని దిక్కుల్ని చూసి దిక్‌చక్రం ఏ దిశకు సమాంతరంగా ఉంటుందో చూసి, ఆకాశ రాశి చక్రం ఎటు హెచ్చుతగ్గులుగా ఉండదో గమనించి, అటు తిరిగి, బోధ వృక్షానికి పడమర వైపుకు వెళ్ళి తూర్పు దిక్కుకు ముఖం పెట్టి కూర్చొన్నాడు. ఇలా కూర్చోవడం ఎందుకంటే ఎల్లవేళలా ఆ చెట్టు నీడలోనే ఉండడానికి. ఎందుకంటే వసంత విషవత్‌ తర్వాత సూర్యుడు ఉత్తరానికొస్తూ ఉంటాడు కాబట్టి, చెట్టు నీడ దక్షిణం వైపున ఎక్కువ పడుతుంది. ఉత్తరం వైపున తగ్గిపోతుంది. తాను లేవకుండా కూర్చోవాలి అనుకున్నాడు కాబట్టి ఆ వృక్షానికి తూర్పున నదీ తీరం ఉంది. ఉదయం ఎండ పొడ పడుతుంది. అందుకనే చెట్టుకి పశ్చిమ దిశలో పూర్వ ముఖుడై కూర్చొన్నాడు. వేసవి తాపం సోకకుండా ఏ ప్రదేశంలో కూర్చోవాలో అలా కూర్చొన్నాడు.

(పటం. 3.) బుద్ధునికాలంలో క్రీ. పూ 2050 - క్రీ. శ. 100

ఒక చిన్న విషయం చెప్పుకుందాం. మనం బస్సు, రైలు, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. బస్సు బస్టాండులో ఆగినప్పుడు డ్రైవర్‌ వైపున ఎండపడుతూ ఉంటే మనం కండక్టర్‌ వైపు ఉన్న సీట్లలో కూర్చొంటాం. తీరా బస్సు స్టేషన్‌ దాటి రోడ్డు మీదకి వచ్చాక కండక్టర్‌వైపు ఎండవచ్చి పడుతుంది. దీనికి కారణం? మనం వెళ్ళేదారి ఏ దిక్కుకు ఉందో మనం తెలుసుకోలేక పోవడమే!

మరి నెలల తరబడి లేవకుండా కూర్చో వాలి అనుకుంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి ?

ఇప్పటి పంచాంగం ఇప్పటిది కాదు:

ఇక్కడ ఒక విషయం చెప్పుకుతీరాలి. మనం ఇప్పుడు పాటించే పంచాంగం అంతా క్రీ. పూ. 2050 - క్రీ. శ 100 సంవత్సరాల నాటిదే! మేషం మొదటిరాశి. అశ్విని మొదట నక్షత్రం. మన జ్యోతిష్యం అంతా ఆ నక్షత్రాలు, ఆ నక్షత్రపాదాల మీదే రూపొందించినవి. కాని ఇప్పుడు మొదటి రాశి మీనం, మొదటి నక్షత్రం పూర్వభాద్ర - ఈ లెక్కన చూస్తే ఇవ్పటి జ్యోతిష్య పంచాంగం అంతా పరమ తప్పు. ఈ తప్పిదాన్ని సవరించడం తలకు మించిన భారమేమీ కాదు. కానీ అలా మారిస్తే తరతరాలుగా నమ్ముతూ వస్తోన్న మూఢనమ్మ కాలన్నీ మారిపోతాయి. జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది. కాబట్టి, 'నమ్మకం' మీద నాలుగురాళ్ళు సంపాదించుకునేవారికి, జ్యోతిష్యాన్ని మార్చడం ఉత్త దండగ. అందుకే అ ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఈ దురదృష్టం అంతా జ్యోతిష్య ఫలాల్ని నమ్మే వాళ్ళదే!

విషువత్‌ చలనానికి భూమి మూడో చలనమే కారణం అనే విషయం నిదాన కథ రచయితకి తెలియకపోవచ్చు. కానీ, దాని
(పటం. 4) సింధూ నాగరకత కాలంలో క్రీ. పూ. 4150 - క్రీ. పూ. 2ఒ50

మార్పుని గమనించడం, బుద్దుని ధ్యాన విషయంలో ఆ దిక్చక్రాన్ని (కాంతి వృత్తాన్ని) ఆధారంగా స్థల ఎంపిక చేసుకోవడం గొప్ప వైజ్ఞానిక అంశం.

పరిశోధనలు:

ఇప్పటిదాకా మనం కేవలం పరిశీలనలు మాత్రమే చూశాం. అసాధ్యమైన ఆయనాంశాల పరిశీలనా చేశాం. ఇక ఖగోళ పరిశోధనలు చూద్దాం.

ఈ దేశంలో ఖగోళ పరిశీలనలు ఎప్పటి నుండో ఉన్నాయి. కానీ, పరిశోధన ప్రారంభించింది బౌద్ధులు మాత్రమే. వారిలో మొదటివాడు, ఆర్యభటే.

ఆయన పరిశోధనల గురించి తెలుసుకొందాం!

వేదాలు, బౌద్ధగ్రంథాలు ప్రక్కన పెడితే పూర్తి జ్యోతిషగ్రంథం “వేదాంగ జ్యోతిషం”. ఇది కేవలం నక్షత్రాలూ, రాశులకు సంబంధించిన గ్రంథమే. ఇది మంచి చెడుల గురించి చెప్పే ఫలిత జ్యోతిషగ్రంథం కాదు. ఇది క్రీ. పూ. 1200 సం॥ నాటిది. దీని కర్త లాగదుడు. ఇదిఇప్పుడు దొరకడం లేదు. వేదాల్లోగానీ, లాగదుని గ్రంథంలోగానీ ఖగోళ పరిశీలనలే ఉన్నాయి. ఫలిత జ్యోశ్యాలు లేవు.

జ్యోతిష నమ్మకాల పిచ్చి మొదట పుట్టింది గ్రీకులో. టాలెమీ క్రీ. శ 140లో ట్రిట్రిబ్యులస్‌ అనే గ్రంథం రాశాడు. ప్రపంచం లో తొలి ఫలిత జ్యోతిష గ్రంథం ఇదే. దీన్ని 200 లో రుద్రదాముడు గ్రీకునుండి సంస్కృ తంలోకి మార్చి ఆ పిచ్చిని ఇక్కడా అంటిం చాడు. ఆ తర్వాత స్పుజిధ్వజుడు క్రీ. శ 270లో “యవన జాతకం, క్రీ.శ 400 లో మీన రాజు 'వృద్ధ యవన జాతకం' అనే రెండు జ్యోతిష గ్రంథాలు రాశారు.

ఈ సమయంలో నలంద విశ్వవిద్యాలయ కులపతిగా ఉన్న బౌద్ధ ఆచార్యుడు అర్య భట. ఆయన చేసిన కృషి-జ్యోతిషాన్ని ప్రక్కకు నెట్టి ఖగోళ శాస్త్రానికి ప్రాణం పోసింది.

ప్రాచీన భారతీయ ఖగోళ గ్రంథాల్లో "సౌర సిద్ధాంతం” అనేది ఒకటి. దీని కర్త ఎవరో తెలీదు. మన పురాణాలు వల్లించే యుగాల లెక్కలు ఈ సౌరసిద్ధాంతం లోనివే. ఇదికాక వాశిష్ఠ సిద్ధాంతం, రోమన్‌ సిద్ధాంతం, పౌలిన సిద్ధాంతం అనే మరో మూడు ఖగోళ సిద్ధాంతాలున్నాయి. అలాగే అతి ప్రాచీన బ్రహ్మ సిద్ధాంతం ఉంది. దీన్నే పితామహా సిద్దాంతం లేదా పైతామహ సిద్ధాంతం అంటారు. ఆర్యభట్ట ఈ బ్రహ్మసిద్ధాంతాన్ని ప్రక్షాళన చేసి తనదైన నూతన ఆవిష్కరణల్ని అదే సిద్ధాంతం పేరుతో ప్రకటించాడు.

యుగాలు - కల్పాలు:

సూర్య సిద్ధాంతం ప్రకారం:యుగాలు 4.

కలియుగం: 4,32,000 సంవత్సరాలు

ద్వాపరయుగం :8, 64,000 సం॥రాలు (కలియుగం x 3)

త్రేతాయుగం : 12,96,000 సం॥ (కలియుగం x 3)

కృతయుగం : 17,28000 సం॥లు (కలియుగం x 4)

ఇవి మొత్తం = 43,20,000 సం॥రాలు, ఇది ఒక మహాయుగం.

71 యుగాలు = 1 మనువు

1000 యుగాలు = 1 కల్పం. (432 కోట్ల సంవత్సరాలు)

ఈ విభజనకి కాస్త సవరణలు చేసిన ఆర్యభట యుగ విభజన ఇలా ఉంటుంది.

10,80,000 సంవత్సరాలు = 1 చిన్న యుగం

4 చిన్న యుగాలు = 1 మహాయుగం (43,20,000 సంలు)

72 యుగాలు = 1 మనువు

1008 యుగాలు = 1 కల్పం (1 కల్పం = 435,45,60,000 సం॥రాలు.

ఆ తర్వాతి వాడైన వరాహమిహిరుని గ్రంథం “బృహత్‌ సంహిత'లో ఆర్యభటునికి పూర్వం 18మంది జ్యోతిషవేత్తలున్నట్లు ఉంది.

వారు:

1. సూర్యుడు (సౌర సిద్ధాంతం ) 2. బ్రహ్మ (బ్రహ్మ సిద్ధాంతం) 3. వశిష్టుడు (వశిష్ట సిద్ధాంతం) 4 పౌలీసుడు (పౌలస సిద్ధాంతం) 5. యవనుడు (రోమక సిద్ధాంతం) 6. వ్యాసుడు 7. అత్రి 8 పరాశరుడు 9. కశ్యపుడు 10. నారదుడు 11. గర్గుడు 12. మరాబి 13. మనువు 14. అంగీరసుడు 15. లోమశుడు 16. చ్యవనుడు 17. భృగు 18. శానకుడు.

కల్పాలు, యుగాల కాలప్రమాణాల గురించి బౌద్దుల నిదానకథలో ఉంది.

గ్రహణాల గుట్టురట్టు : -

గ్రహణాలు ఎప్పుడెప్పుడొస్తాయో అంతకు ముందే చాలామందికి తెలుసు. రాబోయే కాలంలో కొన్ని వందల సంవత్సరాల్లో ఏ రోజున గ్రహణాలు సంభవిస్తాయో రాసి పెట్టారు. ప్రతి 18 సంవత్సరాలు 11 నెలలకు గ్రహణ చక్రం తిరిగి మరలా అదే తేదీల్లో వస్తాయి. ఇది పరిశీలన.

కానీ, గ్రహణాలు ఎందుకు వస్తాయి? అనేది పరిశోధన ఈ పరిశోధన చేసిన మొదటి వ్యక్తి ఆర్యభట. గ్రహణాలకి సంబంధించిన కట్టు కథలు నమ్మని బౌద్ధాచార్యుడు ఆయన. అందుకే భౌతిక విషయాలతో ఆయన పరిశోధన సాగింది.

భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొట్టమొదట ప్రకటించింది ఆయనే. భూమి గుండ్రంగా ఉందని అంతకు ముందే చాలామంది భావించారు. ప్రకటించారు. 'కపిత్థాకారం భూగోళం' అని చెప్పింది బ్రహ్మ సిద్ధాంతం. ఈ వెలగపండు లాంటి భూమి, తన చుట్టూ తాను తిరుగుతుంది' అని చెప్పడమే కాక, మనకు కనిపించే, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ 'గోళాలే' అని ప్రకటించాడు ఆర్య భట. భూమి తన చుట్టూ తను తిరగడం వల్లే ఆకాశంలో సూరీడు, నక్షత్రాలు, చంద్రుడు అన్నీ భూమి తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్లు కనపడుతున్నాయనీ చెప్పాడు. ఐతే...ఒక్క సూర్యుడు మాత్రమే అగ్ని గోళం అనీ అది తప్ప మిగిలిన గ్రహ, నక్షత్రాలన్నీ భూమిలా నీటి ఆవరణతో నిండిన గోళాలే అని చెప్పాడు.

గ్రహణాలకి పాముగానీ, రాహుకేతువులుగానీ కారణం కాదనీ, భూమి నీడ పడడం వల్లే చంద్రగ్రహణం సంభవిస్తుందని వివరించాడు. ఐతే సూర్యగ్రహణానికి కారణం ఈయన చెప్పలేదు. అలాగే 'ఒక రోజు కాలగణనని సూర్యోదయం నుండి కాకుండా, అర్థరాత్రి నుండి కొలవాలి. ఇలా కొలిస్తే సూర్యోదయ సమయాల్లోని వ్యత్యాసాల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి' అని తన 'ఆర్యభట సిద్ధాంతం' లో ప్రకటించాడు. దీనికి మంచి ఉదాహరణగా శ్రీలంకలోని కాలమానాన్ని సూచించాడు. శ్రీలంక భూమధ్యరేఖా ప్రాంతం. కాబట్టి మనకు లాగా పగలూ రాత్రి సమయాల్లో వ్యత్యాసాలు అక్కడ అంతగా ఉండవు. అయినా వారు రాత్రినుండి సమయాన్ని గుణించేవారు. బహుశ ఆయన ఈ విష యాన్ని తన తోటి సహాధ్యాయులనుండో, శ్రీలంక విద్యార్థుల నుండో తెలుసుకుని ఉంటాడు.

ఎందుకంటే... ఆయన ఒక విశ్వవిద్యాలయ కులపతి. అక్కడికి శ్రీలంక, గ్రీకు, చైనా, ఇంకా అనేక [ప్రాంతాలనుండి విద్యార్థులు వచ్చేవారు. 10వేల మంది విద్యా ర్థులు అక్కడ విద్యనభ్యసించేవారు.

అంతేకాదు... ఆయన రకరకాల ఖగోళ పరికరాల నిర్మాణం గురించి ఆయన రాశాడు. వాటిలో నక్షత్రాల దూరాల్ని కొలిచే పరికరాలు, రకరకాల గడియారాలూ ఉన్నాయి. గ్రహగమనాల్ని కొలిచే సాధనాలూ ఉన్నాయి.

ఆ విశ్వవిద్యాలయంలో బోధించే ఏడు ప్రధాన శాస్త్రాల్లో ఖగోళ శాస్త్రం ఒకటి.

అర్యభట - అల్‌ జహీర్‌:

ఆర్యభట ఆవిష్కరించిన గణిత, ఖగోళ విషయాలన్నింటినీ అల్‌ బెరూనీ అనే అరబ్‌ పండితుడు పారశీక భాషలోకి అనువదించాడు.

ఆయన ఆర్యభటను వేనోళ్ల కొనియాడాడు. అరబ్‌లు ఆర్భభటను “అల్‌-జహీర్‌' అనేవారు. అరబ్‌ నుండి ఆర్యభట సిద్ధాంతాలు గ్రీకు, రోములకు వెళ్ళాయి. ఆర్యభట అరబిక్‌ పేరైన 'అల్‌ - జహీర్‌' నుండే 'సున్న'కు...జహీర్‌, జహర్‌, దాన్నుండి చివరకు 'జీరో అనే పేరు వచ్చింది. సున్నను ఆవిష్కరించినవాడు ఆర్యభటే కాబట్టి 'సున్న' కు వారు ఆయన పేరే పెట్టుకున్నారు. ఆయన పేరు నుండే “అనిర్ధారక సమీకరణాలకి 'అల్‌ - జీబ్రా' అనే నామకరణం కూడా జరిగింది. ఇందుకు అరబ్బులకి ఎంతో రుణపడి ఉండాలి.

ఇక, మనదేశం 1975 లో ఏప్రిల్‌ 19న అంతరిక్షంలోకి మొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. దానిపేరు 'ఆర్యభట'. అలాగే ఆ తర్వాత ప్రవేశ పెట్టిన రెండో ఉపగ్రహానికి 'భాస్మర' అనే పేరుపెట్టింది. 1వ భాస్కరుడు కూడా బౌద్ధ గణిత, ఖగోళ విద్వాంసుడే! - తన 'మహా భాస్మరీయం' లో ఆయన ఎన్నో ఖగోళ విషయాలు చర్చించాడు.

విచారం ఏమిటంటే...

“అరబ్బుల ద్వారా పాశ్చాత్య ప్రపంచానికి ఆర్యభటుని ఖగోళ విజ్ఞానం అందింది. అది ఒక ప్రక్కన జరిగితే... ఆర్యభట అనంతరం. 'బృహజ్జాతకం, బృహత్‌ సంహిత, హోర'-అనే ఫలిత జ్యోతిష గ్రంథాలను వరాహ మిహిరుడు రచించాడు. ఈ ఫలిత జ్యోతిష గ్రంథాలకి ఆధారం గ్రీకు రచయిత టాలెమీ గ్రంథం 'ట్రిట్రిబ్యులస్‌'.

అందుకే... _ వివేకానందుడు ఇలా అన్నాడు - “మనం మన గణిత ఖగోళ శాస్త్రాల్ని గ్రీకులకు ఇచ్చి, వారి నుండి జ్యోతిషాన్ని తెచ్చుకున్నాం. మూఢనమ్మకాల్లో బ్రతుకీడుస్తున్నాం' అని.

(బౌద్భుల రసాయన శాస్త్ర విజ్ఞానం, సృష్టి భావనలు - వచ్చే సంచికలో చూద్దాం).

మాతృభాషంటే...?

ఎందుకు మాతృభాషపట్ల ఇంత ఆందోళన? ఎందుకంటె, అది ఒక భాషీయుడి సంప్రదాయ, సంస్కార మూలాల్ని నిత్యం తడుపుతూ, శుభ్రపరుస్తూ నవనవోన్మేషంగా పల్లవింపచేసే అంతఃస్రోతస్విని. అది జలజలా నిత్యం పారుతుండకపోతే, ఆ భాషీయుడి జీవనం శుష్కించి పోవటమే కాదు, ఏ చిన్న జీవన విషాదానికైనా గజగజవణికి కుప్ప కూలుతుంది. అట్లాంటి అంతశ్శక్తినిచ్చే సహజ పౌష్టికాహారం తల్లిభాష!

- సి. ధర్మారావు

పరభాషా ద్వేషం, పరభాషా దాస్యం - రెండూ తప్పే