58
స్మృతికాలపుస్త్రీలు
పితాదద్యాత్స్వకాం కన్యాం భ్రాతావాసుమతేపితుః
పితామహోమాతులశ్చసకుల్యా బాస్థవాస్తథా
మాతాత్వభావే సర్వేషాం ప్రకృతౌ యదివర్తతే
తస్యామప్రకృతిస్థాయాం దద్యు:కన్యాం ననాభయ:
యదా తునైవకశ్చి త్స్యాత్కన్యా రాజానమాశ్రయేత్
అనుజ్ఞయాతస్యవరం ప్రతీత్యవరయేత్స్యయం
(నారద. 12-20, 21,22)
(తండ్రి స్వయముగ కన్యను దానముచేయవలెను. ఆతని యనుమతితో జ్యేష్ఠసోదరుడుగాని తాతగాని, మేనమామగాని స్వకులస్థులుగాని బాంధవులుగాని దానము చేయవలెను. వీరెవరును లేనిచో తల్లి కన్యాదానము చేయవలెను. ఆమె తగినస్థితిలో లేనిచో జ్ఞాతులు దానము చేయవలెను. ఎవ్వరును లేనిచో కన్య రాజునొద్దకు పోవలెను. ఆతని యనుజ్ఞనొంది స్వయముగ వరుని నెన్నుకొనవలెను.)
యాజ్ఞవల్క్య డిట్లు చెప్పుచున్నాడు.
పితా పితామహో భ్రాతా, సకుల్యోజననీతథా
కన్యాప్రద: పూర్వనాశే ప్రకృతిస్థ: పర: పర:
(తండ్రి, తాత, భ్రాత, జ్ఞాతి, తల్లి-వీరిలో పై వారు లేనిచో క్రిందివారు కన్యాదానము చేయవలెను.)
(ద్విజులలో కన్యాదాన ముదకపూర్వకముగనే జరుగ వలెను.)