42
స్మృతికాలపుస్త్రీలు
వరునకు గూడ నిట్టిలక్షణములే యుండవలెను. కాని యాతడు వేదాధ్యయనము చేసియుండవలెననుట విశేషము.
బంధుశీల లక్షణసంపన్నశ్శ్రుతవానరోగ ఇతివరసంపత్
- (ఆ.గృ.సూ 1-2-20)
(బంధుశీల లక్షణసంపన్నుడు నధ్యయనము చేసినవాడు నగుట వరునిలో నుండవలసిన సంపత్తు)
ఆరోగ్యవిషయములో వరుని పుంస్త్వమును పరీక్షించి యది బాగుగనున్నచో కన్యనీయవలెననియు లేనిచో నీయ కూడదనియు నారదుడు చెప్పుచున్నాడు.
పరీక్ష్య: పురుష: పుంస్త్వేనిజై రేవాంగలక్షణైః
పుమాంశ్చేదవికల్పేన సకన్యాంలబ్థుమర్హతి.
(నారద 13-8)
(వరుడు తన యంగలక్షణములచేతనే పుంస్త్వవిషయములో పరీక్షింపబడవలెను. అందులోటు లేకున్ననే కన్యను పొందుటకర్హుడు.)
ఇచట నారదుడు పుంస్త్వపరీక్షకు సంబంధించిన వివరములను గొన్నిటి నిచ్చియున్నాడు.
వధూనిర్ణయవిషయమున మఱికొన్ని నియమములు గూడ మనువుచే పేర్కొనబడినవి.
నోద్వహేత్కపిలాంకన్యాం నాధికాంగీం నరోగిణీం
నాలోమికాం నాతిలోమాం నవాచాటాం సపింగళాం.
(మను 3-8)