పుట:Womeninthesmrtis026349mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

స్మృతికాలపుస్త్రీలు

వరునకు గూడ నిట్టిలక్షణములే యుండవలెను. కాని యాతడు వేదాధ్యయనము చేసియుండవలెననుట విశేషము.

బంధుశీల లక్షణసంపన్నశ్శ్రుతవానరోగ ఇతివరసంపత్

(ఆ.గృ.సూ 1-2-20)

(బంధుశీల లక్షణసంపన్నుడు నధ్యయనము చేసినవాడు నగుట వరునిలో నుండవలసిన సంపత్తు)

ఆరోగ్యవిషయములో వరుని పుంస్త్వమును పరీక్షించి యది బాగుగనున్నచో కన్యనీయవలెననియు లేనిచో నీయ కూడదనియు నారదుడు చెప్పుచున్నాడు.

    పరీక్ష్య: పురుష: పుంస్త్వేనిజై రేవాంగలక్షణైః
    పుమాంశ్చేదవికల్పేన సకన్యాంలబ్థుమర్హతి.
(నారద 13-8)

(వరుడు తన యంగలక్షణములచేతనే పుంస్త్వవిషయములో పరీక్షింపబడవలెను. అందులోటు లేకున్ననే కన్యను పొందుటకర్హుడు.)

ఇచట నారదుడు పుంస్త్వపరీక్షకు సంబంధించిన వివరములను గొన్నిటి నిచ్చియున్నాడు.

వధూనిర్ణయవిషయమున మఱికొన్ని నియమములు గూడ మనువుచే పేర్కొనబడినవి.

    నోద్వహేత్కపిలాంకన్యాం నాధికాంగీం నరోగిణీం
    నాలోమికాం నాతిలోమాం నవాచాటాం సపింగళాం.
(మను 3-8)