పుట:Womeninthesmrtis026349mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

స్మృతికాలపుస్త్రీలు

    తిస్రః కోట్యర్థకోటీచయాని లోమానిమానుషే
    తావత్కాలం వసేత్స్వర్గేభర్తారం యానుగచ్ఛతి.

(సహగమనము చేయు స్త్రీ మూడున్నరకోట్లు స్వర్గలోకములో నుండును)

అట్లు సహగమనముచేయు సాధ్వి తనపుణ్య ప్రాబల్యమున పతితుడగు భర్తనుగూడ నుద్ధరించునని పూర్వాధ్యాయమున జూచియున్నాము. సహగమనము చేయనిపక్షమున సాధ్వియగు వితంతువు శరీరమును పెంచుకొనదు. కేవలము దేహధారణమున కే భుజించును గాని భోగములకొఱకు గాదు.

    కామంతుక్షపయేద్దేహం పుష్పమూలఫలైశ్శుభైః
    నతునామాపి గృహ్ణీయాత్పత్యౌప్రేతే పరస్యతు.
(మను. 5-157)

(పతి చనిపోయినపిమ్మట స్త్రీ పుష్పములను, దుంపలను, పండ్లను నాహారముగ తీసికొనుచు శరీరమును శుష్కింప జేయవలెను. కాని మఱొకపురుషుని నామమునైనను స్మరింపరాదు)

స్త్రీల కింతకంటెను నుత్తమధర్మములేదు

    అసీతామరణాత్‌క్షాంతా నియతాబ్రహ్మచారిణీ
    యోధర్మ ఏకపత్నీనాం కాంక్షంతీతమనుత్తమం
(మను. 5-158)