పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

జానపదకళారూపాలు


అందుకు సమ్మతించిన పార్వతీదేవి.

ద్విపద

అంగద యా మాట లాలించి వేడ్క
బంగారు చేటలోపలి ముత్తియములు
మమ్మారు తన కరాంబుజమున బట్టి
సమ్మతిపాలందేశం బుజమున నిలిపి
మ్రొక్కి యిట్లనె జిత్తమున దలపోసి
మిక్కిలి కంటి సామికిని నామీద
నెన్నడు దయవచ్చు నెపుడు పెండ్లాడు
నెన్నడు నాకోర్కె లీడేరు ననుచు
చేతి ముత్తియములు చేటలో బోసి
నాతి యందిచ్చెను నను మోముతోడ.

భవిష్యత్తు చెప్పే ఎరుకలసాని:

ఆ తరువాత ప్రార్థన చేసి ఎరుకలసాని ఈ విధంగా భవిష్యత్తు చెపుతుంది.

అదో దేవి యొక్క తలంపు చేసినావు, యొక్క కోరిక కోరినావు, యొక దొడ్డ మేలడిగి నావు. అది కాయో పండో, కల్లో నిజమో, అవునో కాదో, చేకూడునో, చేకూడదో యని వెనుక ముందు తొక్కిస లాడుతున్నావు.

ఇదిగో నీయెదలో తలంపు యెన్నాళకంటె వకటే, రెండే, మూడే. వకటంటే వకయేడు గాదు. రెండంటే రెండేళ్ళు కావు. మూడంటే మూడేండ్లు కావు. శ్రీఘ్రంబె, ఇంతలోనే చేకూడుతున్నది.

ఇంకదాపేల, కోడేగాడితో తక్కిర బిక్కరలాడు కుంటా కులకనున్నావె, అప్పుడు నన్ను మెచ్చేవే కోర్కె లిచ్చేవే " అంటూ తన స్వరూపాన్ని ఈ విధంగా వెల్లడిస్తుంది.

నీకు నాథుడ నయ్యెదనని యిప్పుడిచ్చటనే
యున్నాడు, నీపై చాల దయ వచ్చింది
శీఘ్రంబె పెండ్లియాడు, నీ కోర్కె చేకూరు
నమ్ము నా బుట్ట తోడని నమ్మించి చెప్పిన.