నా లు గ వ ప్ర) క ర ణ ను 32○ మొండెను. ఈసాధ్వి సాధారణసంవత్సర శ్రావణశుద్ధ సప్తమిగా శుక్రవారము నాఁడనఁగా 1910-వ సంవత్సరము ఆగష్టు నెల పండెండవ తేదిని తెల్లవారు జామున పరమపదము నొందెను. ఆందుచేత మరణదినమున కీ మెవయస్సు వఁబదియెనిమిది సంవత్సరముల యెనిమిదిమాసముల యిరువదియైదు దినములు. పట్టాభిరామయ్యగారి కీమె రెండవకొమారిత; ఈమెతల్లి మతియొక మగశిశు వును ప్రసవించి మరణము నొందుట తటస్థించెను. ఇట్లు శైశవమునందే మాతృ మరణము నొందిన యీ మెను మేనమామయు కాతేరికరణమును నగు వెన్నేటి ੋ੦੪ టరత్నము గారును భౌర్యయగు లచ్చమాంబ గారును Tహెరచి పెద్దదానిని శ్లేసిరి. గ్రయు త్రవుదంపతులు సంతానము లేనిణా రగుటచేత తవు మేనకోడ లిని పత్రికాధికమైన పేమతోఁ జూచుచు పెట్టుపోఁతలయందుఁగాని మఱియే విషయమునందుఁగాని యేవిధమైన కొ9ఁతయుఁగలుగకుండఁ గాపాడుచు వచ్చిరి. పుట్టినింటివా రీమెకు పెట్టిన పేరు బాపమ్ల వా రీమెను మరణమువల9 కసను నా పాయి యుని పిలుచుచుండెడివారు, ఆ కాలమునందు సాధారణ ముగా శ్రీవిద్య యన్న దూష్యముగాను తలకంటకము గాను కనబడుచుండి నను తాముండినది పల్లెయయినను మేనమామ యే హేతువుచేతనో యీ-మెను బడికి పంపి చదివించుచుండెను. ఈ వేుననూవుయే యీ మె నెనిమిదవయే టను పండెండేండ్ల ప్రాయముగల నా కిచ్చివివాహము చేసెను. పెండ్లినాటికే యీమె కొంతవిద్య నేర్చి రుణీకళ్యాణమును ముఖస్థముగా చదివిన దగుట చేత ముద్దున కయి మమిద్దఱను పెండ్లిదినములలోనే రౌటుక యరుగుమివాఁద కూరుచుండఁబెట్టి మాచేత రు శీకళ్యాణములోని పద్యములను చదివించుచు వచ్చిరి. ఈమె తరువాత నమకచమకములను పురుషసూక్తమును నారాయణ మును ముఖస్థముగా నేర్చుకొని యింట పురుషులు లేని దినములలో ਚਾਲ਼ੇ దేవ ర్చానము చేయు చుండెను. పండెండేండ్ల ప్రాయమున పునస్భంధానము చేసి యీచిన్నదానిని మాయింటికిఁ బంపి జేసిరి. నా తల్లి పూర్ణమాంబ నాభా ర్యకు పుట్టినింటివారు పెట్టిన పేరు మార్చివేసి రాజ్యలక్ష్మీ యని తనతల్లి పేరు పెట్టి పిలువఁజొచ్చెను. ఈ క్రొ ಕ್ತಸಿಕೆ నాభార్యకును ఇష్టమయిన దయినం దున మరణమువఱకును తానా పేరితోనే వ్యవహరింపఁబడుచువచ్చెను.