నాల్గవ ప్రకరణము.
281
(వైదికులు X విశాఘపట్టణ మండలములోని కృష్ణపురము X
ముఖ్యముగా శీఘ్రముగా పంపుఁడు X నావిలాసము
48 బర్టోలా X సామాన్య ప్రత్యుత్తరమిండు)
ఇప్పుడు మోసము స్పష్టముగా తెలిసినది. అయిదవతేదిని సొమ్ముపంపుచున్నానని మోసగానికి తంత్రీవార్తపంపి, ఈలోపల కలకత్తాలోని మిత్రులకును పోలీసువారికిని తంత్రీవార్తలుపంపి, యావంచకుని పట్టించి దండింపఁ జేయవలెనని మొదట నాలోచించితినిగాని ముందు వ్యయప్రయాస ములకు కారణమగునని తలఁచి యాప్రయత్నమును మానివేసితిని.
"పదిమంది చేరినతరువాత కొన్ని మనస్తాపములును చిక్కులును కలుగక మానవుగాని చేసిన మహాకార్యమును తలఁచుకోఁగా, అవి యెంతమాత్రమును గణనకు తేఁ దగినవిగానుండవు. కొందఱు ధనాశాపరులుగానుండి పలు మిషలమీఁద తొందరలు కలుగఁజేయవచ్చును; కొంద ఱవివేకముచేతను కొందఱు దుస్స్వభావముచేతను తగవులాడవచ్చును."
అని 1885 వ సంవత్సర మధ్యమున స్త్రీ పునర్వివాహచరిత్రమునుగూర్చి నేనిచ్చినయుపన్యాసములో వ్రాసియుంటిని. అవివేకముచేత చేయఁబడినవి క్షమింపఁ దగినవిగానుండును; దుస్స్వభావముచేత చేయఁబడినవియు కొంతవఱకు క్షమింపఁదగినవిగా నుండవచ్చును. కాని లోకోపకారధురీణుల మనియు స్వార్థత్యాగులమనియు చెప్పుకొనుచు ధనాశాపరత్వముచేత పలుమిషలమీఁద బుద్ధిపూర్వకముగా చేసెడివారి యకార్యములు మాత్రము క్షంతవ్యములుగావు.
1887 వ సంవత్సరారంభమున సమాజమువారిముందు స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమాన స్థితులనుగూర్చి చదివిన యుపన్యాసములో నిట్లు వ్రాసితిని. -
"1884 వ సంవత్సరము జనేవరు నెలలో నల్లగొండ కోదండరామయ్యగారి వివాహమగువఱకును సామాజికులకును వివాహములు చేసికొన్న వారికిని