ఈ పుట అచ్చుదిద్దబడ్డది
96
స్వీయ చరిత్రము.
"బోగంవాళ్ల యందు యింత్త అభిమానం యెంద్కు వుండవలశ్నిది. వక బ్రాహ్మడి యందువుండకూడదా. వీళ్లకులవృత్తివల్ల విశేషంగా సంపాదించడమ్కు అవకాశం కల్గివుండగా వస్గులు యంద్కు యివ్వవలశ్నిది." | "వీళ్ళకులవృత్తివల్ల వీళ్ళకు జీవనంజర్గదు. మనలో సహా వక గ్రహస్తుకు యీనాంలున్ను నవుఖరిన్ని వ్యవహారమున్ను వున్నప్పటికి సాలు 1 కి 3, 4 చొప్పున యిటువంటి వస్గులు యివ్వడముకే యిబ్బంది అని ఆలోచిస్తూ వున్నాము. యిటువంటిసంగతిలో బోగంవాళ్ళకు రెండోవృత్తి అనగా యీవస్గులవల్ల జరిగే ఆధారంపోతే యట్లా వాళ్లు జీవిస్తారు. వాళ్ళకుటుంబాలు యట్లా వృద్ధి అవుతవి. ఇదిగాక వాళ్ళకులవృత్తివల్ల వచ్చే ఖాయిలాలకె అటువంటిసొంమ్ము చాలదు. పూర్వపుమామూల్కు వ్యతిరేకంవస్తుందేమో అని గాని వాళ్ళయందు భక్తివుండికాదు. యిదిగ్కా వుత్సవములు పడిపోకుండా వుండడమ్కున్ను కారణం." |
"బోగంవాళ్ళు లేక పోతె యేమినష్టం." | "అనేకఖర్చులు చేశే వక గొప్పగ్రహస్తు సాలు 1 కి వస్గులకింద రు 3, 4 ఖర్చు చేస్తే యేమినష్టం. అట్లా నష్టంలేదు సరేకదా బంధువుల్కు విరోధములు వుండవు. క్షెమాపణలు వుండవు. బోగంవాళ్ళ విద్యలు వృద్ధిచేసినవారము అవుతాము. యిదిగ్కా గుడిశేటి వాళ్ళు విస్తరించ్చరు. గన్కు బోగంవాళ్ళు వృద్ధి కాకపోతె యిదేనష్టం." |
ఈపయిని తీసికొన్న హేతువులే మంచివని మేమిందు గ్రహింప లేదు. వారు వ్రాసిన యిరువది నాలుగు హేతువులును ఒకదాని నొకటి మించియే యున్నవి. కాఁబట్టి వానిలో నేవి గైకొనవలెనో తోచక, అన్నిటిని గైకొన స్థలము చాలక ఈయయిదింటిని మాత్ర మిందు పొందుపరచినాము. - హాస్యసంజీవని 1878 వ సం॥ మార్చి.
వాతేస్దొరగారు మా కప్పుడు మండలన్యాయాధిపతిగా నుండిరి. ఆరంభదశలో నొకరిద్దఱు ప్రాడ్వివాకులు తమ్మాశ్రయించియున్న వారికిఁ గొం