పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార్యమునకును నేర్పడియున్న మార్పులేని బంధమొకప్రక్క మనకున్నను, అదే మనకు కర్మస్వాతంత్య్రమును తెచ్చుచున్నది.

జగత్సష్టియు, స్థితియు నీశ్వరునినుండియే వచ్చును. ప్రకృతి యనునదతని పనిముట్టు అని క్రిందచూపిన శ్లోక ములు తెలుపుచున్నది.


యథా౽కాశ స్థితో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్
తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ.


అన్ని చోట్లను వీచుటకు మహాబలముగల గాలి ఎట్లె ప్పుడును నాకాశమున నెలకొని యున్నదో, అట్లే భూతము లన్నియు నాలో నెలకొనియున్నవని తెలిసికొనుము. 9-6


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః
భూతగ్రామ మిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్.


నాకు లోబడిన ప్రకృతియందు నిలిచి మరల మరల భూత సంఘమునంతటిని స్వభావబలముచేత నుండునట్లు చేసెదను. 9-8


మయా౽ధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్
హేతునా౽నేన కౌంతేయ జగద్వి పరివర్తతే.


నాయధ్యక్షత్వమున ప్రకృతి చరాచరలోకములను సృష్టించును. ఈహేతువుచేత లోకము చుట్టిచుట్టి తిరుగు చున్నది. 9-10