పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యస్మాత్ క్షర మతీతో౽హ మక్షరాదపిచోత్తమః
అతో౽స్మిలోకే వేదేచ ప్రథితః పురుషోత్తమః


నేను క్షరమునకు మించినవాడనై అక్షరముకంటె నుత్తముడనై యుండుటచేత లోకమునందును వేదమునందును పురుషో త్తముడని పొగడబడుచున్నాను. 15-18


భూమిరాపో౽ నలో వాయుఃఖం మనోబుద్ధి రేవ చ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా.


భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఈ యెనిమిది భేదములుగా నాప్రకృతి వేరు పడియున్నది. 7-4


అప రే౽యమిత స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మేపరామ్
జీవభూతాం మహాబాహో యయేదం ధార్య తేజగత్


ఇది నానికృష్టస్వరూపము. దీనినుండి వేరుపడి యున్న నాస్వరూపమును దెలిసికొనుము. అదే ప్రాణులకు ప్రాణ మనునది. దానిచేతనే నీలోకము ధరింప బడుచున్నది. 7-5


ఏత ద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయ స్తథా.


ఎల్లప్రాణులకును నది కారణమని తెలియుము. లోక మంతయు నావలన పుట్టుటయు, నాయందు లీనమై లేకుండ బోవుటయు కలుగుచున్నది. 7-6