పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుణములను గడచి బ్రహ్మపదమును పొంద తగినవా డగును. 14-26


మచ్చిత్తా మద్గతప్రాణా బోధయ న్తః పరస్పరం
కథయ న్త శ్చ మాం నిత్యం తుష్య న్తి చ రమన్తి చ.


చిత్తమును నాయందు నిలిపి, ప్రాణమును నాయందే చొప్పించి నన్నుగూర్చి యొకరితో నొకరు చెప్పి తెలిసి కొనుచు నాభక్తులు తృప్తిని శాంతిని పొందుదురు. 10-9


తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం
దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాన్తి తే.


ఎప్పుడును మనస్సు వశముచేసుకొని ప్రీతితో నన్ను చేరువారికి నేను బుద్ధియోగము నిత్తును. దానివలన వారు నన్ను పొందుదురు. 10-10


తేషా మే వానుకంపార్థ మహ మజ్ఞానజం తమః
నాశయా మ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా.


వారినికరుణించుటకు వారిమనోభావములందు చొచ్చి ప్రకాశించుజ్ఞానజ్యోతితో వారియజ్ఞాన మను చీకటిని తొలగింతును. 10-11


అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.