పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(22)

నాస్తికము కూడదు.

(గీత : అధ్యాయము 16.)


ఈశ్వరుని చేరుటకు సాధనములయిన యెల్లమతములను, మార్గములను భగవంతు డంగీకరించునని గీత చెప్పుతూ నాస్తికము లేక అనాత్మవాదమును ఖండించుచున్నది. ఈక్రింది శ్లోకములు నాస్తికవాదమునుగురించి చెప్పుచున్నవి. "ధర్మమనునదేమి? సత్యమనునదేమి? ఏదిలేదు. మనుష్యులు చేరి, తమ సుఖముకొర కేర్పరచుకొన్న యేర్పాటే ధర్మము" అని యీకాలమున కొందరాడు మాటలనే యివి సూచించు చున్నట్లున్నవి.


ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదు రాసురాః
నశౌచం నాపిచాచారో నసత్యం తేషు విద్యతే.


అసురత్వము నాశ్రయించినవారికి పనిచేయు క్రమము తెలియదు. పనినుండి విరమించుట కూడ తెలియదు. శౌచము, సదాచారము, సత్యము, అనునవి వారిలో కనపడవు. 16-7



అసత్య మప్రతిష్ఠం తే జగ దాహు రనీశ్వరం
అపరస్పరసంభూతం కి మన్య త్కా మహైతుకం.