నాయకురాలు
31
[ అందరూ కూర్చుంటారు ]
నా : ప్రభువుగారికి క్షేమమేగద ?
కే: జేమమే ; తమకు తెలియని సంగతు లేమున్నవి ? తమరు దేశంలో లేనిలోపముమాత్రం జరిగింది.
నా: కేతురెడ్డిగారు కోటను పాలిస్తుండగనే పల్నాటికేతువు పడిపోయిందే?
కే: నాగమ్మగారు భూభారము వహింపని లోపమే నని మనవి జేశాను.
నా : పల్నాటిభారమును వహిస్తున్న పున్నాగముల కది అగౌరవమని నా మనవి.
కే: పున్నాగముల అగౌరవము స్త్రీనాగములు తొలంగించాలె.
నా: బ్రహ్మనాయుడుగారు మంత్రిపద వేల మానుకున్నారో చెప్పగలరా?
న: మాచర్లలో రాజగురువులై పూజలు గొంటున్నారు. ఐహికపదవులయందు వారికి అస్త తగ్గినట్టున్నది.
నా : లోకములో బ్రహ్మ పూజలుగొనడం యిప్పటికి వింటున్నాము. ఐహికపదవులయందు ఈ బ్రహ్మకు ఆశ తగ్గిందనుకోను. నిజానికి ఏబ్రహ్మకూ తగ్గలేదు. ప్రస్తుతము యువరాజుకు రాజప్రతిధిగా వున్నా, త్వరలో మాచర్లకు రాజుగూడా అవుతాడు. ఇవి నాగమ్మ జోస్యం.
కే: రాజుగావలెనని కోరికెమాత్రమున్నదనండి.
న: బుద్ధి భూము లేలవలెననే వుంటుంది. అది నెరవేరవద్దా?
నా: అది వేరు. ఇప్పుడు జరిగినపనికంటె సులభసాధ్యమే.
న: వారసుడుకూడా కాడే.