పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

107

ఇట్లు స్వాగత పద్యరత్నభూషణ భూషితులఁజేసిన పిదప గుంటూరు, బెజవాడ, బాపట్ల, తెనాలి, వంగవోలు, మన్నవ మున్నగు పట్టణముల నుండి సభార్ధమాహూతులయి వచ్చిన మహామహులును గూడరాఁగా వేలకొలఁది జనులు తమ జన్మములు పవిత్రములయ్యెనని సంతసించి, జయజయ ధ్వానము లొనర్పఁగాఁ బుష్ప దామాలంకృతులయిన కవిచక్రవర్తుల నొక పుష్పరథంబునఁ గూర్చుండఁ బెట్టి యిరుగడలఁ జిత్రచ్ఛత్రయుగళంబును బట్టువారుసు జామరంబుల వీచువారును నై కొందఱు పరిసేవింప నూరేగించిరి, అయ్యూరేగింపు సమయంబు నందు "ఆశుకవి చక్రవర్తి” బిరుదవర్ణాంకితములయిన, విజయధ్వజములెత్తి కొందఱు ముందు నడిచిరి. బాలికలు గానంబొనర్చిరి. బాలకులు కోలాటంబాడిరి. మల్లులు కొందఱు తమ దేహ పరిశ్రమ విద్యఁగనుపఱచి వేడుకఁజూపిరి. ఇట్లు మంగళవాద్య ధ్వనులు పెల్లు చెలరేగ సూరేగింపు మహోత్సవంబు నెఱవేఱిన పిదప నాశుకవిత్వ ప్రదర్శనంబుచే నెల్లరానందము జెందిరి. ఆసభ కగ్రాసనాధిపతులుగా వంగవోలు మిషన్ స్కూలులోని పండితులును, సంస్కృతాంధ్ర భాషా పారంగతులునైన బ్రహ్మశ్రీ ముక్తి నూతలపాటి గోపాలకృష్ణ శాస్త్రి గారుండిరి. ఈయాశుకవిత్వసభ యనర్గళ ప్రవాహముగా సాగెను. మఱునాఁడును ఆశుకవిత్వమే కావలయునని మేము గోరితిమి గాని “అవధానమొనర్ప వలయునని మా యుద్దేశమని” కవిసింహులు తమయభిప్రాయముందెలుపుటచే, సభ్యులయ్యదికూడఁ జూడవలయు” నను నుత్సాహముతో నందులకొడంబడిరి. ఆనాఁటి యవధాన సభ యత్యద్భుతముగా నెఱవేఱెను. ఆ యవధాన సభకనేకులు విద్వత్కవివర్యులు చనుదెంచిరి. అట్టి విద్వాంసులలోఁ గొందఱు పృచ్చకులయి కూర్చుండి విషమ ప్రశ్నములనేకము లిచ్చిరి. అట్టి ప్రశ్నములన్నియు నీ కవిసోదరులు తృణ ప్రాయముగా నతిరస వంతములుగాఁ బూరించిరి. శ్రీ తిరుపతి వేంకటకవులు, నరసరావుపేటలో వృథగా బ్రహ్మశ్రీ బెల్లముకొండ రామరాయ కవీంద్రులనిరసించి వారి శిష్యులు తారసిల్లుటచే భయగ్రస్తులయి, ఆహ్వానముచేసిన వారి మర్యాదయైన