పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

407


ఆ.

తల్లి యింతకును గతం బేమి తెలియఁగా
నానతీయవలయు ననుచు మ్రొక్కి
నిలిచి యున్న సురభి నృపవర్యుఁ దనపుత్రు
రీతి మిగుల నాదరించి పలికె.

62


సీ.

పురుహూతుఁ డొకనాడు గురువాదిగాఁగల
        విబుధసంఘంబు సేవింపుచుండ
నూర్వశియును రంభయును మంజుఘోషయు
        నా తిలోత్తమయును నాఘృతాచి
ప్రియదర్శనయు సుకేశియును మేనకయునా
        నెనమండ్రు దివ్యనాయికలు గొలువ
గరుడగంధర్వకిన్నరపన్నగేంద్రులు
        తమనియమంబులు తగభజింప


ఆ.

వసువులును రుద్రు లుభయపార్శ్వముల నుండ
సిద్ధు లెనిమిది తనపొంతఁ జేరి నిలువఁ
దుంబురుఁడు నారదుఁడును బ్రస్తుతులు సేయ
నధికసంపదఁ గొలువున్న యవసరమున.

63


శా.

పర్యాయప్రకృతప్రసంగముల సంభాషించుచో దేవతా
చార్యుం డోసకలజ్ఞ నారదమునీశా నేఁటికాలంబునం
గార్యాకార్యవిచారముం గృపణరక్షాదక్షకత్వంబు నౌ
దార్యంబున్ ఘనధైర్యముం గలిగి యేధాత్రీశుఁ డొప్పున్ భువిన్.

64


మ.

అనిన న్నారదుఁ డోసుపర్వకులవంద్యా యిప్పు డుర్వీస్థలి
న్మనుజాధీశులు లెక్కమీఱఁ గల రేక్ష్మాపాలురున్ దీనపా
లనధైర్యంబున లావున న్వితరణోత్సాహంబున న్విక్రమా
ర్కునిసాదృశ్యము నొంద లే రతనిఁ బేర్కొన్న న్శుభోధర్కముల్.

65