పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

271


గజపుంగవుఁ గాచిన క్రియ
ద్విజపుంగవుఁ గాచి మనుజదేవుఁడు వెడలెన్.

23


శా.

ఆవేళన్ జను లెల్ల నుల్లములఁ జోద్యం బందుచు న్మేలు మే
లీవీరాగ్రణి సాటిచెప్పఁ గలరే యేవీరు లైన న్భువిన్
దైవం బీతనిపాలఁ గల్లె నని వింత ల్గాఁ ప్రశంసింపఁగా
నావిప్రుండు నిజప్రియాసహితుఁడై హర్షించి దీవించుచున్.

24


ఉ.

సాహసికాగ్రగణ్య! రభసంబున నీ వరుదెంచి యమ్మహా
గ్రాహముఁ ద్రుంచి నన్నుఁ గృపఁ గాచితి దీనికి మాఱు మేలుగా
నీహిత మే నొనర్చెదను నీ వతిదుర్లభ మంచు దీని సం
దేహము లేక కైకొనుము దేవసమానుఁడ వీవు గావునన్.

25


క.

ఓపురుషవర్య నేనొక
తాపసు దయఁ దొల్లి నర్మదాతీరమునన్
గోపాలమంత్రజపమున
నోపినక్రియఁ దపము సేయుచుండఁగ నాకున్.

26


వ.

ఒక్కనాఁటి రాతి సుఖస్వప్నావసరమున.

27


సీ.

మేఘంబు కడఁబొల్చు మెఱపుకైవడినున్న
        పీతాంబరముదిండు బిగియఁగట్టి
తరుణాతపద్యుతి హరిచందనం బొప్ప
        రవిభంగి నురమున రత్న మలర
యమునాజలమ్ముపై నమరునెత్తమ్ముల
        తమ్ములౌ తెలిగన్నుఁదమ్ము లమరఁ
గరిరాజుశిరమున ఘనరత్నఖచితమౌ
        దండచాడ్పునఁ బీలిదండ యమర