పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

సింహాసన ద్వాత్రింశిక


వ.

అనిన ననుమానించునెడ నచ్చతురికయు వియచ్చరకుమారుండునుం బఱతెంచి కంఠంబున నున్న లతాపాశం బూడ్చి భుజలతాపాశం బిడి యింతతెంపు సేయుదురే యేమిదె వచ్చుచున్నవార మని బుజ్జగించిన నుజ్జిజీవిషువగు నజ్జోటి లజ్జామజ్జదవనతానాబ్జయై పులకించి గురుని యనుమతిలేమిం గొందలపడు నెడ మనోహరిణి యనుసఖి వచ్చి గౌరీప్రసాదవిభవం బిట్టిదిగదే యని.

179


ఆ.

అమ్మ నీవు గోరినట్లు మీతండ్రియు
నతని కిచ్చేద నని యెఱుఁగఁజెప్పె
మీకుఁ బెండ్లి సేయ మిత్రావసువునకు
నానతిచ్చె నటకు నరుగుదెమ్ము.

180


ఆ.

అన్నమాటఁ బొంగి కన్నులఁ బ్రియునికి
గన్నె మ్రొక్కి యేఁగె నన్నకడకుఁ
జిత్త ముల్లసిల్ల జీమూతవాహనుం
డాత్మగురులకడకు నరుగుదెంచె.

181


వ.

తదనంతరంబున మిత్రావసుండు జీమూతకేతుం డున్నకడకు వచ్చి యవ్వధూవరుల పరస్పరానురాగం బెఱుకపడం జెప్పి ప్రార్థించి తదనుమతి వివాహవేళ నిశ్చయించి నానానగరనివాసులైన కిన్నరకింపురుషగరుడగంధర్వసిద్ధసాధ్యవిద్యాధరులం గూర్చి యుభయవర్గంబులుగా నేర్చి సకలశృంగారాభిరామంబుగా నొనర్చిన కళ్యాణమండపంబున నున్నసురేంద్రాదిసురలు వధూవరులం జూచి సదృశకులవయోరూపలావణ్యంబులు గల మిథునంబుం గూర్చుటకుం బితామహునిం గొనియాడుచుండ.

182


సీ.

అప్సరఃస్త్రీలు కళ్యాణగానంబులు
        తెఱఁ గొప్పఁ బాడగాఁ దివ్యమునులు