పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 127

గలుగక యెక్కం బూనుట
చెలఁగి నపుంసకుఁడు బోటిఁ జేరుట చుమ్మీ. 120

క. నావుడు భోజనృపాలుఁడు
భావంబున సిగ్గు గదురఁ, బాంచాలిక! నీ
వావిక్రమార్కువితరణ
మేవెరవున నొదవెఁ జెప్పు మేర్పడ నాకున్. 121

క. అనవుడు నాపుత్రిక యి
ట్లనియెం జిఱునవ్వుతోడ నవనీనాథా
విను మొప్పుగఁ జెప్పెద నా
జననాయకు దానగుణము సామాన్యంబే. 122

క. సమరస్థలిఁ గపికేతుఁడు
విమతపురోన్మూలనమున వృషకేతుఁడు మా
నమున నహికేతుఁ డాకృతి
సమతను ఝషకేతుఁ డనఁగ జగతిం బరఁగెన్. 123

చ. అట్టి గుణంబులుం గల ధరాధిపుఁ డందఱఁ దండ్రి భంగిఁ జే
పట్టి వినిద్రబుద్ధిఁ బరిపాలన చేయుచు నుండఁగాఁ బ్రజల్
దట్టము లైన సంపదలఁ దారు కుబేరుని పెంపు మీఱి యే
పట్టున దానధర్మములుఁ బాడియుఁ దప్పక యొప్పి రప్పురిన్. 124

వ. ఇట్లు రాజ్యం బఖిలజనమనోరంజకం బగుచుండ. 125

సీ. కనికని మానినీజనమనోధనములు
తొలితొలి గిలుబాడు దొద్దకాఁడు
పువ్వురెమ్మలకు లేమవ్వ మెక్కించుచు
నంగజుతో నాడు సంగడీఁడు