Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


    ప్తిం గాంచంగనుబోక భారత మహాదేశంబును గెల్చె స
    త్సంగుం డీతని రాజ్యమింతని వచించన్ జాల రెవ్వారులున్ 110
    
శా॥ "టైమూర్లేము” ప్రపౌత్రు పుత్రుఁ డతిశిష్టస్తుత్య సౌజన్య లీ
    లామందారము ద్వాదశాబ్దముల కాలంబందె "బేబర్” నృపుం
    డై మోగల్ క్షితి నేలఁ బూని రిపుగోత్రాధీశులన్ దాఁకి యు
    ద్దామ ప్రౌఢిని వారిఁ బోదఱిమి సంస్థాపించెఁ దద్రాజ్యమున్. 111
    
సీ॥ “జాక్సారిటీసు” శ్రేష్ఠతమంబె కాని జా
              హ్నవియొ లోకైక పూజ్యతకు రావు
    'టర్కీ' ప్రశస్త మండలమౌనుగాని, ద
              ర్యావర్త మమృత రసాత్మకంబు
    ‘సమరఖండ’ మతియోగ్యమకాని, ఢిల్లీ పు
              రము స్వర్గమునకు స్వర్గమవు తావు
     తురకలు స్వజను లౌదురుకాని, భారత
              ప్రజలు లోకోత్తర ప్రాభవాంకు
              
గీ॥ లింటనుండిన విశ్రాంతి యెసఁగుఁగాని
    రామమాంధాత లేలిన భూమిగెలువ
    ఘనతరై శ్వర్యములు గల్గి గణన గలుగు"
    ననుచు బేబరు దండెత్తి యరుగుదెంచె. 112
    
శా॥ ఆకాలమ్మున ఢిల్లి పట్టణ నృపుండా యిబ్రహీంలోడి తా
    నాకర్ణించుచు వీనిరాక దశలక్షానీకినుల్ క్ష్మాస్ధలం
    బాకంపింపఁగఁ జేరవచ్చి యని సేయన్ జొచ్చె బేబర్విభుం
    డా కాలాంతకుఁడట్లు శాత్రవులఁ జెండాడెన్ మహోదగ్రుఁడై. 113
    
మ॥ గడియల్ మూఁడగు నంతలో రణము తగ్గన్ సాగె నాయిబ్రహీం
    పడియెన్ సేనలు భిన్నధాండగతులన్ బ్రాపించె; బేబర్ మహీం
    ద్రుఁడు ఢిల్లీపురి నాక్రమించుకొనె హిందూదేశ సర్వస్వ మ
    ప్పుడు దాసోహ మటంచుఁ దత్పదయుగంబున్ గొల్చె నిర్వీర్యమై.114