పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

27



సీ ॥ ఐదువందలు కరు లశ్వంబు లెనుఁబది
               వేలు సామంతులు పెక్కుమంది
     యనుసరింపఁగ జయయాత్ర సాగించె నం
               బరు మారువారు లోఁబడియె గ్వాలి
     యరు లోఁగె సజమేరు చరణముల్ గొలిచే శి
               క్రియుఁగాల్ని తలలొగ్గి ప్రియము నెఱపె
     నారామపురము చెందేరియుఁ బులుమేనె
               గోగ్రోను దలనంచుకొనును నిలిచె
               
గీ॥ నయ్యె నంకితుఁ డాబూ ధరాధి నేత
    బూంది దిగులొంది తత్కృపనొందె ముందె
    చుట్టు గలదేశములను జేపట్టుకొనుచు
    వసుధ సంగ్రాముఁ డేలే వైభవము తనర. 106
    
మ॥ ముజఫర్ షా యను మాళ్వభూపతి బలంబుల్ గొల్వ పైకెత్తి రా
    గజమున్ దాఁకెడు సింహమట్లు తఱుమంగా వాఁడునున్ రాజ ధా
    నిఁ జొఱంబాఱె విడంగఁబో కచట వానిన్ బట్టి చిత్తూరుఁ జే
    ర్చె జగంబుల్ జయపేట్ట నమ్రుఁడయి యర్థింపంగ వీడెన్ వడిన్
    
మ॥ స్థిరశౌర్వుండును ఢిల్లివిశ్వపతికిన్ సేనాని బాహాబ లో
    ద్ధురుఁడౌ 'ఆలి' సమస్త సైన్యములతో దుర్గంబు రక్షించు చుం
    డ 'రణ స్తంభ పురంబు' పై సడచి కోటన్ గెల్చి పేరొందె నీ
    భరతోర్విన్ దనకున్ సముండొరుఁడు గన్పట్టం డటం చెల్లెడన్

క॥ అమితబలులు యవనులు తం
   డములయి జాక్సారిటీస్ తటంబులఁ గలదే
   శమునుండియు భారత ఖం
   డముపై దండెత్తి రాఁదొడఁగి రవ్వేళన్. 109

-: బేబరు దండయాత్ర :-



శా॥ ఛెంగిస్ ఖాను కుమార్తె సంతతి జనించెన్ ముందు టైమూరు, స
    ర్వాంగీణ స్ఫుటశక్తితో సమర ఖండాధీశుఁడై, దానఁ దృ