పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

358

శ్రీనివాసవిలాససేవధి


కరణీయములు దీర్చి కడువడి వెడలి
పురుషోత్తములఁ గాంచి పొసఁగ సేవించి
యాదికూర్మముఁజేరి యట ధర్మపురిని
సాదరంబుగ నృసింహాకృతి శౌరి
వందించి కృష్ణాదివాహినుల్ గడచి
పొందుగా వేంకటభూధరంబునకు
వచ్చి యచ్చటఁ జక్రవర్తిని గాంచి
విచ్చలవిడి తన విమలయాత్రయును
కడు నందు తనయున్కి క్రమమును దెల్పి
తడవయ్యెఁ బోవలె తరుణి నంపు మన 1230

నరపాలుఁడు గలంగి ననబోఁణి తెరగు
మరచి యిన్నాళ్లు ప్రమత్తుఁడై యుండు
కతనఁజింతించి యొక్క యమాత్యుఁ జూచి
ద్విజకాంత యేమయ్యె దెలిసి యేకతము
నిజము దెల్పు మటంచు నెమ్మిఁ బుత్తెంచ
నా మంత్రివరుఁడు బ్రాహ్మణవధూగృహము
వేమరు బరకించి వెలఁదియు సుతుఁడు
నింటిలో మృతిఁజెంది యొంటి యుండంగఁ
గంటికి వెగటుగాఁ గని యత్తెరంగుఁ
దెలిపిన విని మదిన్ దిగులొంది నృపతి 1240

పలుక నోరాడక బ్రాహ్మణుఁ జూచి
విను విప్ర నీనతి వేంకటేశ్వరులఁ
గని భజించఁగనేగెఁ గావున నీవు
నొక్కనా డిచ్చోట నుండి నీమగువ
మక్కువఁ దోడ్కొని మరి యేగు మనుచు