పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

273



వేదవతి వృత్తాంతము

వేదంబునన్ సంభవించిన కతన
వేదవతి యనంగ విఖ్యాతి యయ్యె
నది యౌవనము నొంది యలరంగఁ జూచి
సుదతిని మోహించి సురదైత్యవరులు
నరకిన్నరేంద్రులు నయమున నతనిఁ
గర మొప్ప వందించి కడు బ్రియంబునను
నతివను దనకు నిమ్మనియుఁ బ్రార్థింప
నతఁడు వారి కొసంగ కపు డిట్టు లనియె 550
వెన్నుఁ డల్లుఁడుగాఁగ వేడుచుఁ దపము
లెన్నైన సల్పుచు నిటులున్న వాఁడ
పన్నగశయుఁ దక్క పరుని కెవ్వనికిఁ
గన్నియ నే నియ్యఁగాఁ జాల ననుడు
మరియు నా బాలయు మరుగన్న హరునె
వరియింతు నని చాల వ్రత మూనియున్న
దనుటయు వా రేగి రందు శంభుఁ డను
మనుజవల్లభుఁ డల్ల తరుణిపై మరులు
పట్టఁజాలక యట్టి బ్రహ్మర్షి వరుని
పట్టి వధించెఁ దద్బ్రాహ్మణహత్య 560
పాపాత్ము నవ్వాని భస్మంబుసేసె
నా పరితాపంబు నాపఁగలేక
అల మునిపత్నియు నాత్మేశు మేను
నలమి యుజ్వలితాగ్ని నటు ప్రవేశించె
నా వేదవతియును నబల యెంతయును
భావించి తన తండ్రి పట్టు ప్రతిజ్ఞఁ